• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఎమ్మెల్యే అబద్ధాల కోరు: కాంగ్రెస్ నేతలు

KMR: ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వైఖరిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. కన్న తండ్రిపైనే చేయి చేసుకున్న చరిత్ర ఉన్న MLAకు, షబ్బీర్ అలీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ఎన్నికల అఫిడవిట్‌లో అబద్ధాలు చెప్పారని, రూ.150 కోట్ల అభివృద్ధిపై ప్రజలను వంచిస్తున్నారని ఆరోపించారు.

February 18, 2026 / 08:24 PM IST

కన్నాయిగూడెంలో రేపు బైక్ ర్యాలీ

MLG: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా రేపు 19 ఉదయం 8:30 గంటలకు పోచమ్మ తల్లి ఆలయం వద్ద నుంచి బైక్ ర్యాలీ ప్రారంభం కానుంది. ర్యాలీ కన్నాయిగూడెం నుంచి దేవాదుల మీదుగా ఏటూరు వరకు సాగనుంది. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు సభ్యులకు, యువతకు పిలుపునిచ్చారు. జై భవాని జై శివాజీ అంటూ.. ర్యాలీ నిర్వహించనున్నారు.

February 18, 2026 / 08:09 PM IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నితనిఖీ చేసిన DMHO

KMR: జిల్లాలోని రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ విద్యా బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని రికార్డులు, స్టోర్ రూమ్, ల్యాబ్ రూమ్ పరిశీలించి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని స్థానిక వైద్యాధికారి డాక్టర్ సురేష్‌కు సూచించారు.

February 18, 2026 / 07:56 PM IST

‘సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం’

KMM: తహసీల్దార్ ఉషా శారదను ఎర్రుపాలెం సర్పంచ్ నండ్రు అశ్వని, ఆత్మ కమిటీ డైరెక్టర్ కంచర్ల వెంకట నరసయ్య బుధవారం గ్రామ రెవెన్యూ సంబంధిత సమస్యలపై చర్చించారు. భూసంబంధిత పెండింగ్ దరఖాస్తులు, పట్టాదారుల నమోదు, రికార్డుల సవరణ అంశాలను ప్రస్తావించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

February 18, 2026 / 07:49 PM IST

“బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం దరఖాస్తుల ఆహ్వానం”

BHPL: జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ ఉన్నత పాఠశాలల నుంచి 2026-27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఇందిరా ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులు మార్చి 25వ తేదీ లోపు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

February 18, 2026 / 07:47 PM IST

సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం

HYD: డా. బీ.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇరిగేషన్ & సివిల్ సప్లైస్ శాఖలపై ప్రీ-బడ్జెట్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాధాన్య కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, ఆహార భద్రతకార్డు, ఉచిత సన్న బియ్యం పథకం, తదితర వాటిపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

February 18, 2026 / 07:46 PM IST

మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధి ప్రధాన లక్ష్యం

MDCL: మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య, క్రీడా, మౌలిక సదుపాయాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. బుధవారం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మాను చౌదరిని కలిసి నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వినతి పత్రాలను సమర్పించారు.

February 18, 2026 / 07:42 PM IST

హల్దీ ప్రాజెక్టుకు నీరు విడుదల చేయాలి: ఎమ్మెల్యే

MDK: నర్సాపూర్ నియోజకవర్గంలోని పంట పొలాలకు సాగునీరు అందించేందుకు కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి హల్దీ ప్రాజెక్టుకు వెంటనే నీరు విడుదల చేయాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కోరారు. ఈ విషయమై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆమె ఫోన్లో మాట్లాడి అధికారిక లేఖను పంపారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.

February 18, 2026 / 07:41 PM IST

మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్సీ

KMM: రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను బుధవారం హైదరాబాద్ సెక్రటేరియట్ నందు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మం జిల్లాలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించిన రూ. 5 కోట్ల నిధుల జీవో త్వరగా వచ్చేందుకు అన్ని విధాలుగా సహకరించిన సందర్భంగా ఆయనకు శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.

February 18, 2026 / 07:51 PM IST

అరూరిపై నరుకుడు వెంకటయ్య ఘాటు వ్యాఖ్యలు

WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరుకుడు వెంకటయ్య బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో కాంట్రాక్టర్ రాజ్యం నడిచిందని ఆరోపిస్తూ, ప్రస్తుతం ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పై పార్టీ మార్పులు, కమిషన్ ఆరోపణలతో విమర్శలు గుప్పించారు.

February 18, 2026 / 07:26 PM IST

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సంక్షేమం సాధ్యం

RR: ఫరూఖ్ నగర్ మండలం భీమారం గ్రామ పరిధిలో గల మోల్లోన్ గడ్డ తండాలో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ కార్యక్రమాన్ని ఆదివాసి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శీను నాయక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాధ్యం అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదల సంక్షేమం సాధ్యమని పేర్కొన్నారు.

February 18, 2026 / 07:25 PM IST

‘విద్యుత్ ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరిస్తాం’

KMM: మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ డైరీని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

February 18, 2026 / 06:57 PM IST

తొర్రూరు పట్టణంలో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ..

MHBD: తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో తొర్రూరు పట్టణంలో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, TPCC వైస్ ఛైర్మన్ ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ.. తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు.

February 18, 2026 / 05:44 PM IST

‘పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి’

KMM: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని సీపీఐ(ఎం) జిల్లా నేత భూక్యా వీరభద్రం బుధవారం డిమాండ్ చేశారు. నేడు నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పోడు భూములకు పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, సీతారామ ప్రాజెక్ట్ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు.

February 18, 2026 / 05:44 PM IST

‘క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి అవసరం’

BHPL: జిల్లా నాచారం గ్రామంలో గ్రామ యువత ఆధ్వర్యంలో బుధవారం క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హాజరై, మాట్లాడారు. క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి ఎంతో ఉపయోగకరమని, యువతలో క్రమశిక్షణ, స్నేహభావం, జట్టు భావన పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో TRP నేతలు, క్రీడాకారులు ఉన్నారు.

February 18, 2026 / 04:49 PM IST