• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రోజుకు 37 లక్షల లీటర్లు తాగేస్తున్నారు..!

HYD: HMWSSB పరిధిలో 2,050 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు 1.30 కోట్ల మంది జనాభా నివసిస్తున్నారు. ప్రస్తుతం సుమారు రోజుకు 550MGD (37.8 లక్షల లీటర్లు) తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు జలమండలి వర్గాలు వెల్లడించాయి. నగర విస్తరణను దృష్టిలో పెట్టుకొని నీటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు.

February 25, 2026 / 10:27 AM IST

ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపిన IDJN జిల్లా అధ్యక్షుడు

TPT: సూళ్లూరుపేట పట్టణంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కొత్త సబ్ ఇన్‌స్పెక్టర్‌ను IDJN తిరుపతి జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలో శాంతి భద్రతలను సమర్థవంతంగా పరిరక్షిస్తూ ప్రజలకు మరింత చేరువగా పనిచేయాలని కిరణ్ కుమార్ ఆకాంక్షించారు.

February 25, 2026 / 10:27 AM IST

టీడీపీ నాయకులకు నిరసన సెగ

AP: ఏలూరు జిల్లా మంగపతిదేవిపేటలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. గ్రామంలోకి రాకుండా గ్రామస్తులు టీడీపీ నాయకులను అడ్డుకున్నారు. నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. భూసేకరణ కోసం గ్రామస్తులతో మాట్లాడేందుకు నేతలు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు గ్రామంలోకి రావొద్దంటూ నినాదాలు చేస్తూ అడ్డుకుంటున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 25, 2026 / 10:26 AM IST

‘లిటిల్ హార్ట్స్’ హీరోకి భారీ ఆఫర్

‘లిటిల్ హార్ట్స్’ మూవీతో యువ నటుడు మౌళి తనూజ్ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ క్రేజ్‌తో ఆయనకు బంపర్ ఆఫర్ తలుపు తట్టినట్లు టాక్. ‘పుష్ప 2’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో మౌళి తన తదుపరి ప్రాజెక్టును ఖరారు చేసుకున్నట్లు సమాచారం. రెండో మూవీకే ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లో అవకాశం రావడం విశేషం. ఈ మూవీని ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడట.

February 25, 2026 / 10:25 AM IST

గురుకులాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కృష్ణా: 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పులిగడ్డ గురుకులం(బాలురు)లో 5, 6వ తరగతుల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేపట్టనున్నట్లు ప్రధానాచార్యులు కె. జాన్ వెల్లడించారు. దరఖాస్తులు ఆన్‌లైన్ విధానంలో స్వీకరిస్తామని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 31వ తేదీలోపు తమ దరఖాస్తులను సమర్పించాలన్నారు.

February 25, 2026 / 10:23 AM IST

పాఠశాలలకు సరఫరా చేస్తున్న చిక్కీలపై ఆరోపణలు

ASR: పోలవరం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు పంపిణీ చేస్తున్న చిక్కీల (పల్లీ అచ్చులు) నాణ్యతపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రంపచోడవరం, చింతూరు డివిజన్లలోని పాఠశాలలకు అందుతున్న చిక్కీలలో పురుగులు కనిపిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.

February 25, 2026 / 10:22 AM IST

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

SRD: కోహిర్-జహీరాబాద్ రైల్వే మార్గంలో 35-40 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వద్ద సదాశివపేట ‘సాయిరాం షాపింగ్ మాల్’ సంచి ఉంది. లోకో పైలట్ సమాచారంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచారు. వివరాలు తెలిసిన వారు 77026 29707 నంబర్కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ఈ ఘటనపై పూర్తి వావరాలు తెలియాల్సి ఉంది. 

February 25, 2026 / 10:21 AM IST

కంబాలకొడం అభివృద్ధికి బృహత్ ప్రణాళిక

VSP: కంబాలకొండలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక అభివృద్ధికి బృహత్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. ఈఎస్ జెడ్ పరిధిలో 30.51 చ.కి.మీ. విస్తీర్ణానికి ముసాయిదా జోనల్ మాస్టర్ ప్లా రూపొందిస్తున్నారు. రహదారుల అనుసంధానం, భవిష్యత్ రహదారి మార్గాలు స్పష్టంగా చేర్చాలని సూచించారు.

February 25, 2026 / 10:21 AM IST

కుక్క దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలు

ATP: గుత్తి కోటవీధిలోని ప్రాథమిక పాఠశాల వద్ద మహమ్మద్ అనే విద్యార్థిపై బుధవారం కుక్క దాడి చేసి గాయపరిచింది. ఈ దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. కోటవీదిలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

February 25, 2026 / 10:20 AM IST

గాంధీ బొమ్మ ప్రాంతంలో పర్యటించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక గాంధీ బొమ్మ ప్రాంతంలో నుడా ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న “ఐ లవ్ నెల్లూరు” బోర్డు ఏర్పాటు పనులను అధికారులతో కలిసి బుధవారం పర్యవేక్షించారు. అనంతరం స్థానిక మినీ బైపాస్ నర్సరీల సమీపంలో నూతనంగా భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ పనులను నుడా అధికారులతో కలిసి పరిశీలించారు.

February 25, 2026 / 10:20 AM IST

మట్టి కుండ నీళ్లతో ఇన్ని లాభాలా..?

ఎండాకాలంలో ఉదయాన్నే మట్టికుండలో నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇవి తాగడం వల్ల శరీరానికి మినరల్స్‌, ఎలక్ట్రోలైట్స్‌ అందడంతో పాటు శరీరం ఎనర్జిటిక్‌గా ఉంటుంది. మట్టి కుండలో నిల్వ చేసిన నీళ్లు తాగటం వల్ల గ్యాస్, అసిడిటీ, శ్వాసకోశ సమస్యలు రావు. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

February 25, 2026 / 10:20 AM IST

చెత్త సేకరణకు 3 పుష్ కార్ట్స్

AKP: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కోటవురట్ల మండలంలో మూడు పంచాయతీలకు పుష్ కార్ట్స్‌తో పాటు తడి, పొడి, ప్రమాదకరమైన చెత్త సేకరణకు డస్ట్ బిన్‌లను ప్రభుత్వం సరఫరా చేసింది. వీటిని కోటవురట్ల తంగేడు, టి. జగ్గంపేట పంచాయతీలకు కేటాయిస్తున్నట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ బుధవారం తెలిపారు. వీటి ద్వారా చెత్త సేకరణ చేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

February 25, 2026 / 10:19 AM IST

మార్చి 14 నుంచి SSC పరీక్షలు: కలెక్టర్

ADB: పదో తరగతి పరీక్షలను మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు వరకు 52 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 10,928 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష సమయానికి అనుగుణంగా బస్సులను నడపాలన్నారు.

February 25, 2026 / 10:16 AM IST

ట్యాంకు వద్ద మహిళ మృతి

PLD: రాజుపాలెం మండలం ఉప్పలపాడులో గ్రామంలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. గ్రామంలోని నీటి ట్యాంకు సమీపంలో మృతదేహం కనిపించినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలు వేల్పుల మల్లేశ్వరి (45)గా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

February 25, 2026 / 10:15 AM IST

ప్రత్తిపాడులో పారిశుద్ధ్య కార్మికుల నిరసన

GNTR: ప్రత్తిపాడులో బకాయి పడ్డ జీతాల విషయంలో పారిశుద్ధ్య కార్మికులు బుధవారం ధర్నాకు దిగారు. పూర్తి జీతాలు ఇచ్చే వరకు పనిలోకి రావద్దని గతంలో చెప్పిన మేస్త్రి, ఇప్పుడు ట్రాక్టర్‌తో చెత్త ఎత్తించడంపై కార్మికులు మండిపడ్డారు. నిరసనగా చెత్త ట్రాక్టర్‌ను కదలకుండా అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు.

February 25, 2026 / 10:14 AM IST