• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రాజాం జాతరలో అపశృతి

PPM: రాజాం శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర ముగింపు వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి నిర్వహించిన బాణసంచా ప్రదర్శనలో డోలపేట గ్రామానికి చెందిన శ్రీదేవికి తీవ్ర గాయాలయ్యాయి. బాణసంచా పేలుస్తున్న సమయంలో ఒక ఔట్ బాక్స్ నేరుగా వచ్చి ఆమెకు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.

February 25, 2026 / 09:08 AM IST

తహశీల్దారుకు రైతుల వినతి పత్రం అందజేత

KNR: అసంపూర్తిగా నిలిచిపోయిన డీ-8 ఉప కాలువ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి నీటిని అందించాలని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామ రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం బాధిత రైతులు తహసీల్దార్ కనకయ్యకు వినతి పత్రం అందజేశారు. కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయి నష్టపోయామన్నారు. కాలువ నిర్మాణం పూర్తిస్థాయిలో జరగక పంటలకు నీరు అందడం లేదని, అన్నారు.

February 25, 2026 / 09:08 AM IST

‘డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా’

MBNR: కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని డివిజన్ కార్పొరేటర్ గూండా సంతోష్ అన్నారు. మంగళవారం రాత్రి డివిజన్‌కు సంబంధించిన నాయి బ్రాహ్మణ కాలనీ ప్రజలు కార్పొరేటర్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

February 25, 2026 / 09:07 AM IST

టీనేజ్ ప్రెగ్నెన్సీపై అవగాహన కార్యక్రమం

KDP: సింహాద్రిపురం మండలం కోవరంగుంటపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయ డిప్యూటీ డెమో ఆఫీసర్ ప్రసన్న లత విద్యార్ధినీలకు టీనేజ్ ప్రెగ్నెన్సీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల తక్కువ బరువు గల శిశువులకు దారి తీసే ప్రమాదం ఉందన్నారు. టీనేజ్ పిల్లల ముందు తల్లిదండ్రులు కొన్ని అలవాట్లు మానుకోవాలని తెలిపారు.

February 25, 2026 / 09:07 AM IST

నేడు పలు గ్రామాలకు విద్యుత్ కట్

VZM: బొబ్బిలి మండలం పెంట విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే రంగరాయపురం ఫీడర్ నిర్వహణ పనులు కోసం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ బి.రఘు చెప్పారు. రంగరాయపురం, జె.రంగరాయపురం, చెల్లారపువలస, ఎం.బూర్జవలస గ్రామాలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు.

February 25, 2026 / 09:07 AM IST

గ్రామస్థాయి పరిపాలనలో జీపీఓల పాత్ర కీలకం: అదనపు కలెక్టర్

ADB: ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో గ్రామ పాలన అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు కలెక్టర్ శ్యామల దేవి తెలిపారు. మంగళవారం పట్టణంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జీపీఓ, ఆర్‌ఐ యాప్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థాయిలో ఆదాయం, నివాసం తదితర ధ్రువపత్రాలను జీపీఓల ద్వారా జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 09:06 AM IST

గ్రామస్థాయి పరిపాలనలో జీపీఓల పాత్ర కీలకం

ADB: ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో గ్రామ పాలన అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు కలెక్టర్ శ్యామల దేవి తెలిపారు. మంగళవారం పట్టణంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జీపీఓ, ఆర్‌ఐ యాప్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థాయిలో ఆదాయం, నివాసం తదితర ధ్రువపత్రాలను జీపీఓల ద్వారా జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 09:06 AM IST

శ్రీవారి సేవలో మాజీ మంత్రి రోజా

TPT: తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి రోజా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమెకు రంగనాయకులు మండపంలో వేద పండితులు ఆశీర్వచనంతో అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

February 25, 2026 / 09:05 AM IST

ఈనెల 28న జిల్లాకు జాతీయ ST కమిషన్ సభ్యుడు రాక

ASF: జాతీయ ST కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఈనెల 28న తిర్యాణి మండలంలో పర్యటించనున్నట్లు BJP మండల అధ్యక్షుడు సారా రమేశ్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ సభ్యుడు పర్యటనలో భాగంగా మండలంలోని మంగి గ్రామాన్ని సందర్శించడంతో పాటు మారుమూల ప్రాంతాల్లోని రోడ్లు, పోడు భూముల సమస్య, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేయనున్నట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 09:05 AM IST

త్వరలోనే హాస్పిటల్ ప్రారంభం: మంత్రి

WGL: త్వరలోనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించబోతున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మొత్తం 35 డిపార్ట్‌మెంట్లతో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ సేవలు అందించబోతున్నామని, ఆర్గాన్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్ సర్వీసెస్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

February 25, 2026 / 09:05 AM IST

నేడు డబుల్ బెడ్ రూమ్‌ల పంపిణీ

RR: ఇవాళ షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నందిగామ గ్రామ పంచాయతీ పరిధిలోని బండకుంట తండా, ధన్‌సింగ్ తండా, చాకలిగుట్ట తండాలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొననున్నారు. అనంతరం కొత్తూరు, నందిగామ మండల పరిధిలోని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి తెలిపారు.

February 25, 2026 / 09:04 AM IST

నరసాపురం గ్రంథాలయంలో ఆకస్మిక తనిఖీ

నరసాపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయాన్ని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శేఖర్ బాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠకులతో ముఖాముఖి నిర్వహించి గ్రంథాలయంలో అందుతున్న సేవలు, ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు.

February 25, 2026 / 09:04 AM IST

ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి: కమిషనర్

KRNL: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేయడానికి రాజకీయ పార్టీల సహకారం అత్యంత కీలకమని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ పీ.విశ్వనాథ్ స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.

February 25, 2026 / 09:03 AM IST

‘వాహనాదారుల్లో మార్పు కోసమే జరిమానాలు విధిస్తున్నాం’

MNCL: వాహనాదారుల్లో మార్పు కోసమే జరిమానాలు విధిస్తున్నామని మంచిర్యాల ట్రాఫిక్ CI సత్యనారాయణ ప్రకటనలో తెలిపారు. జరిమానాలు విధించడం పోలీసుల లక్ష్యం కాదన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందని, తద్వారా ప్రజల ప్రాణాలు కాపాడిన వారమవుతామని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు.

February 25, 2026 / 09:03 AM IST

రిజర్వేషన్ భిక్ష కాదు.. హక్కు: సునీల్ నాయక్

AP: SC, ST విద్యార్థుల ఎంపికపై గతంలో Dy. స్పీకర్ రఘురామ చేసిన వ్యాఖ్యలను IPS సునీల్ నాయక్ తప్పుబట్టారు. ‘రిజర్వేషన్ అనేది ఛారిటీ కాదు. 2వేల ఏళ్ల చారిత్రక నేరాన్ని రాజ్యాంగం సరిదిద్దుతోంది. మేము కేవలం పరీక్షలే కాదు, మీరు నిర్మించిన శతాబ్దాల గోడలను బద్దలుకొట్టాం. ఉన్నత స్థానాల్లో ఉన్నవారి ఆలోచనా విధానం ఇలా ఉంటే అణగారిన పిల్లలకు ఏం సందేశం వెళ్తుంది’ అని ప్రశ్నించారు.

February 25, 2026 / 09:02 AM IST