• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విడవలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐఎస్ఓ సర్టిఫికెట్

నెల్లూరు: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు విద్యా ప్రామాణికతలు పాటించినందుకు ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను అధికారులు బుధవారం అందజేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులకు అందిస్తున్న విద్యా ప్రమాణాలను పరిశీలించారు. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ సర్టిఫికెట్‌ను అందించారు. దీంతో కళాశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

February 25, 2026 / 04:21 PM IST

ఎమ్మెల్సీ దృష్టికి గ్రామ సమస్యలు

MDK: చేగుంట మండలం పోలంపల్లి సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను బుధవారం కలిశారు. పోలంపల్లి గ్రామ సమస్యలను ఎమ్మెల్సీ కోదండరాం దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. గ్రామ సమస్యలపై ఎమ్మెల్సీ కోదండరాం సానుకూలంగా స్పందించి గ్రామాభివృద్ధికి నిధులు అందజేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వార్డు సభ్యులు చింతకాయల ప్రవీణ్ పాల్గొన్నారు.

February 25, 2026 / 04:20 PM IST

జగన్ నిర్వాసితులకు రూపాయి కూడా ఇవ్వలేదు: నిమ్మల

ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.900 కోట్లు ఇవ్వాల్సి ఉండగా వైయస్ జగన్ ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మోసం, దగా చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఆనాడు 2019 ముందు చంద్రబాబు నిర్మాణాలు చేసినవి తప్ప జగన్ ఎలాంటి చేయలేదని, భవిష్యత్తులో ఎవరు మంచి చేస్తారో వారినే ఆదరించాలని పిలుపునిచ్చారు.

February 25, 2026 / 04:20 PM IST

‘జాంబీరెడ్డి 2’పై క్రేజీ న్యూస్..!

యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘జాంబీరెడ్డి’ మూవీకి సీక్వెల్‌గా ‘జాంబీరెడ్డి 2’ రాబోతుంది. తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందించాడట. ఫస్ట్ పార్ట్ కంటే ఈ మూవీ అంతకుమించి వైల్డ్‌గా ఉంటుందట. VFX విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. జాంబీలతో పోరాడే సన్నివేశాలు ఈసారి మరింత డెడ్లీగా ఉంటాయని టాక్.

February 25, 2026 / 04:20 PM IST

రేపటి నుంచి రెవెన్యూ క్లినిక్

PPM: జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి గ్రామస్థాయిలో ‘రెవెన్యూ క్లినిక్స్’ ప్రారంభం కావాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయములో రెవిన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇకపై ప్రతి గురువారం వీఆర్వోలు ఆయా గ్రామాల్లో రెవిన్యూ క్లినిక్లు నిర్వహించాలన్నారు.

February 25, 2026 / 04:19 PM IST

వామపక్షల రౌండ్ టేబుల్ సమావేశం

VSP: ఆంధ్రా యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు మత వైషమ్యాలకు దారితీస్తున్నాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం విశాఖలో పలు ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థలను మత రాజకీయాలకు వేదికగా మార్చొద్దని, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

February 25, 2026 / 04:19 PM IST

గురుకులాల్లో సమస్యలను పరిష్కరించాలని వినతి

MHBD: గురుకులాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని గురుకులాల సెక్రటరీ సీతాలక్ష్మికి DSFI నేతలు వినతిపత్రం అందజేశారు. DSFI రాష్ట్ర కార్యదర్శి సాయికుమార్, కోశాధికారి గుగులోతు సూర్య ప్రకాష్‌లు మాట్లాడుతూ.. గురుకులాల్లో సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలన్నారు.

February 25, 2026 / 04:19 PM IST

ఏఐ టెక్నాలజీ క్లినిక్‌ను ప్రారంభించిన సినీనటి

విజయనగరంలో ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద బుధవారం మొట్ట మొదటి ఏఐ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఓ క్లినిక్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీనటి కామ్నా జెట్మిలాని, డీఎస్పీ గోవిందరావు విచ్చేశారు. ఈ సందర్భంగా MAC చైర్ పర్సన్ అండ్ ఫౌండర్ డా. శ్రీవల్లి కొర్రపాటి మాట్లాడుతూ.. అందరికీ అందుబాటు ధరల్లోనే మా సర్వీసులు ఉంటాయన్నారు.

February 25, 2026 / 04:18 PM IST

కొనసాగుతున్న అంగన్వాడీల రిలే దీక్షలు

ELR: సమస్యల పరిష్కారం కోరుతూ.. అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం మూడో రోజు కొనసాగాయి. వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు దీక్ష చేశారు. సీపీఐ మండల కార్యదర్శి బాడిశ రాము, ఏఐటీయూసీ జిల్లా నాయకులు కారం. దారయ్య అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

February 25, 2026 / 04:18 PM IST

585 మంది‌ విద్యార్థులు ‌గైర్హజరు

AKP: జిల్లాలో 34 ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షకు 585 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 13,939 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 13,354 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు అధికారి ఎం వినోద్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 04:18 PM IST

పెదవలసలో ఆధార్ కేంద్రం ప్రారంభం

ASR: జీకేవీధి మండలం పెదవలస పంచాయతీ వద్ద రైతు సేవ కేంద్రంలో బుధవారం ఆధార్ సేవలు ప్రారంభం అయ్యాయని సచివాలయ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని పేరు మార్పులు, చేర్పులు, కొత్తగా ఆధార్ నమోదు సేవలు అందుతాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిబ్బంది తెలిపారు.

February 25, 2026 / 04:16 PM IST

‘ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయండి’

SKLM: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం అసెంబ్లీలో మాట్లాడారు, వంశధార మహేంద్ర తనయ నదుల పై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు వలసలు వెళ్లకుండా సాగునీరు అందించాలన్నారు. పాత ప్రాజెక్టులకు మరమ్మతుల నిధులు కేటాయించాలని స్పీకర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.

February 25, 2026 / 04:16 PM IST

‘మట్టి పోసి ఈ రోడ్డు సమతుల్యం చేయండి’

RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, అయ్యప్ప కాలనీ పార్క్, ఆనంద్ కాలనీ సమీపంలో ఇటీవల వేసిన రోడ్ల పనులు పూర్తిగా చేయకపోవడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు ఇరుపక్కల మట్టి పోయకపోవడంతో వాహనాలు జారిపడి గాయాల పాలవుతున్నారని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు పక్కన మట్టి పోసి సమతుల్యం చేయాలన్నారు.

February 25, 2026 / 04:16 PM IST

సాయి బాబా నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

TPT: తిప్పవరప్పాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శిరిడి సాయిబాబా మందిరం బాబావారి నూతన విగ్రహ ప్రతిష్టా మహాకుంభాభిషేకం కార్యక్రమంను బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ & గూడూరు నియోజకవర్గ ఇంఛార్జి మెరిగ మురళీధర్ పాల్గొని స్వామి వారి తీర్ధ ప్రసాధాలు స్వీకరించారు.

February 25, 2026 / 04:14 PM IST

కలెక్టర్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే 

TG: సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. MGNREGS కింద రోడ్డు నిర్మాణంపై స్టే ఇచ్చింది. మార్చి 25 వరకు యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది. మార్చి 25లోగా కౌంటర్ దాఖలు చేయాలని అధికారులకు సూచించింది.

February 25, 2026 / 04:13 PM IST