KMR: పల్వంచ మండలం భవానిపేటకి చెందిన అఖిల్ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందాడు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్, డైరెక్టర్ నవీన్ నికోలస్ చేతుల మీదుగా పీఎం-పోషణ్ పథకం అమలులో ఉత్తమ పురస్కారం అందుకున్నాడు. ఈ సందర్భంగా అఖిల్ తండ్రి, ఉపసర్పంచ్ రమేశ్ గౌడ్ మాట్లాడుతూ.. అఖిల్ రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు.
AP: అమరావతిపై వైసీపీ విమర్శలు అర్ధరహితమని మంత్రి నారాయణ అన్నారు. నిరాధార ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అలాగే, ఉద్యోగులకు నిర్మిస్తున్న 4,026 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. గత 3 నెలల్లో రాజధానిలో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని చెప్పారు. వచ్చే మూడేళ్లలో పరిపాలన భవనాలు అందుబాటులోకి తెస్తామన్నారు.
PPM: చిన్నమేరంగిలో జిల్లా పరిషత్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా “మహిళల భద్రత – సమిష్టి బాధ్యత” అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు మహిళల రక్షణ, చట్టాలపై అవగాహన, సమాజ బాధ్యత వంటి అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.
NRML: భైంసా మున్సిపల్ కమిషనర్ గా జగదీశ్వర్ గౌడ్ నియామకం అయ్యారు. నిర్మల్ కమిషనర్గా పని చేస్తున్న జగదీశ్వర్ గౌడ్ను భైంసా మున్సిపల్ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. ఆ శాఖ డైరెక్టర్ శ్రీదేవి గత నెల 28వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భైంసా కమిషనర్గా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
MLG: కన్నాయిగూడెం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమయపాలన పాటించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయ సిబ్బంది ఆలస్యంగా హాజరుకావడం, పనులు వాయిదా వేయడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
NDL: డోన్ పట్టణంలోని చారిత్రక గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుంది. దశాబ్దాలుగా విద్యార్థులకు మార్గనిర్దేశం చేసిన ఈ కేంద్రం నుంచి అనేక మంది ఉన్నత స్థాయికి ఎదిగారు. తమ విజయానికి పునాది అయిన గ్రంథాలయానికి తక్షణమే మరమ్మతులు చేసి, ఆధునిక సదుపాయాలు కల్పించాలని ఆదివారం వారు కోరుతున్నారు. అధికారులు స్పందించి పూర్వవైభవం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
HYD: నగర శివారు ORR నుంచి RRR అంతర్గత ప్రాంతాలను కలుపుతూ మొత్తం 10 రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో HMDA అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ORR ఎగ్జిట్–17 వద్ద బుద్వేల్ నుంచి కోస్గి వరకు రెండు రేడియల్ రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు
AKP: నాతవరం ఎంపీపీ పాఠశాలలో సోమవారం మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్ఐ వై.తారకేశ్వరరావు ఆధ్వర్యంలో మహిళా శక్తిపై విద్యార్ధులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు డ్రాయింగ్, డిబేట్ పోటీలు నిర్వహించి అనంతరం క్రీడా సామగ్రిని బహుమతులుగా అందజేశారు. మహిళా కానిస్టేబుల్ బీ.రాజేశ్వరి మహిళా శక్తి గురించి అవగాహన కల్పించారు.
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఇటీవల జరిగిన బాణసంచా పేలుడు ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 25 బాణసంచా తయారీ కేంద్రాలను తక్షణమే మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 22 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.
MLG: గోవిందరావుపేట(M) పస్రాలోని అభ్యుదయ కాలనీలో సోమవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రవి అనే వ్యక్తి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని ఫ్రిజ్ ఇతర విలువైన వస్తువులు కూడా మంటల్లో బూడిదైపోయాయి. వెంటనే స్థానిక ప్రజలు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MDK: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం చేగుంట మండలంలో కలకలం రేపింది. పోలంపల్లి సర్పంచ్ రాజ్యలక్ష్మి తెలిపిన వివరాలు.. గ్రామ శివారులోని రోడ్డు పక్కన ఒక మగ వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
HNK: వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. 48, 49 డివిజన్ల పరిధిలో సుమారు రూ.9.37 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని, నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామని ఎమ్మెల్యే అన్నారు.
SKLM: సెల్ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఇది ఉంటే ఒక పోలీస్ మీ వెంట ఉన్నట్లేనని శక్తి టీం సభ్యులు గిరిధర్, గణేష్ తెలిపారు. సోమవారం సంతబొమ్మాలి జిల్లా పరిషత్ పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆపదలో ఉన్న సమయంలో శక్తి యాప్ రక్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం బాబురావు పాల్గొన్నారు.
AP: సత్యసాయి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమయ్యారు. హెచ్.వడ్రహట్టి గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లలతో సహా తల్లీకూతురు సుబ్బమ్మ, లక్ష్మీ అదృశ్యమయ్యారు. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కుటుంబ వివాదాల కారణంగానే వారంతా అదృశ్యమైనట్లు పోలీసులు భావిస్తున్నారు.
IND vs WI మ్యాచ్ డ్రింక్ బ్రేక్ వేళ కోల్కతా మైదానంలో లేజర్ షో నిర్వహించడంపై దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి మండిపడ్డారు. లేజర్ లైట్ వల్ల బ్యాటర్లకు ఇబ్బంది కలుగుతుందని, T20 WC వంటి కీలక వేదికపై మ్యాచ్ మధ్యలో ఇలాంటి వినోదం అవసరమా అని ప్రశ్నించారు. IPL టోర్నీ మధ్యలో అయితే ఓకే కానీ నాకౌట్స్లో ఇది సరికాదని సూచించారు.