• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆసియాలోనే టాప్ సిటీగా మారనున్న వైజాగ్

AP: విశాఖ నగరం త్వరలో కొత్తరూపు సంతరించుకోనుంది. రాబోయే ఐదేళ్లలో పది లక్షల మంది జనాభా పెరగనున్న నేపథ్యంలో, VMRDA రోడ్ల విస్తరణను వేగవంతం చేసింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ, నగర ట్రాఫిక్ తగ్గించేందుకు ఏడు కొత్త ప్రధాన రోడ్లు నిర్మిస్తున్నారు. ఐటీ సంస్థల రాకతో వేగంగా అభివృద్ధి చెందుతున్న వైజాగ్, ఆసియాలోనే టాప్ సిటీగా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

March 5, 2026 / 02:57 PM IST

బహిరంగ వేలం.. రూ.25,53,700 ఆదాయం

CTR: పుంగునూరు మున్సిపల్ కార్యాలయంలో గురువారం కమిషనర్ మధుసూదన్ రెడ్డి సమక్షంలో బహిరంగ వేలంపాట జరిగింది. వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్, ప్రైవేట్ బస్సు స్టాండ్ వద్ద గల పబ్లిక్ యూరినల్స్, షాపు రూమ్‌లు, ఖాళీ స్థలాలకు బహిరంగ వేలంపాట నిర్వహించగా రూ.25,53,700 ఆదాయం వచ్చినట్లు కమిషనర్ తెలిపారు.

March 5, 2026 / 02:55 PM IST

‘మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి’

KMM: ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా రైతులు పండించిన మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని ఐక్య రైతు సంఘం జిల్లా నాయకులు నాగేశ్వరరావు అన్నారు. గురువారం చింతకాని మండలం నాగులవంచ రైతు వేదికలో సొసైటీ సీఈఓ శ్రీనివాసరావుకు ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. మద్దతు ధర ప్రకారం రైతుల నుంచి మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.

March 5, 2026 / 02:54 PM IST

నెక్స్ట్ టార్గెట్ CBN.. పవన్‌కు లైన్ క్లియర్?

మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే, బీహార్‌లో నితీశ్ కుమార్ పరిణామాలతో తాజాగా APలోనూ చంద్రబాబు విషయంలో అదే జరుగుతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. భవిష్యత్‍లో చంద్రబాబును జాతీయ రాజకీయాల్లోకి తీసుకుని ఏపీలో పవన్‌ను CMగా ప్రపోజ్ చేస్తుందనే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే బీహార్, మహారాష్ట్ర వేరు AP పరిస్థితి వేరని ఈ ఊహాగానాలను టీడీపీ శ్రేణులు తిప్పికొడుతున్నాయి.

March 5, 2026 / 02:54 PM IST

యుద్ధం.. విమానసేవలకు అంతరాయం

TG: శంషాబాద్ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. గల్ఫ్ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే విమానాలను కూడా నిలిపివేసినట్లు వెల్లడించారు. గల్ఫ్ నుంచి రావాల్సిన 16 విమానాలు, అలాగే శంషాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన 15 విమానాలను రద్ధు చేసినట్లు పేర్కొన్నారు. UAE, సౌదీ అరేబియాకు విమానాల రాకపోకలు నిలిపివేశామన్నారు.

March 5, 2026 / 02:52 PM IST

పందుల కొరత రాకుండా చర్యలు: కలెక్టర్

PDPL: ఆసుపత్రులలో మందుల కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. గురువారం ఆయన సుల్తానాబాద్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. గర్భిణీ స్త్రీలకు రెగ్యులర్ చెకప్ జరిగేలా చూడాలని, వ్యాక్సినేషన్ 100% పూర్తి చేయాలని సూచించారు.

March 5, 2026 / 02:49 PM IST

టీమిండియాకు మైఖేల్ వాన్ సలహా

T20 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నేడు సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ప్లేయింగ్-11లో కుల్దీప్ యాదవ్‌ను తప్పనిసరిగా ఆడించాలని సూచించాడు. ఇందుకోసం తిలక్ లేదా దూబెలలో ఒకరిని తప్పించాలని పేర్కొన్నాడు. కుల్దీప్‌ను జట్టులోకి తీసుకోవడం ద్వారా భారత్ విజయావకాశాలు మెరుగవుతాయన్నాడు.

March 5, 2026 / 02:49 PM IST

జూన్ నాటికి నందివెలుగు బ్రిడ్జి పూర్తి: ఎంపీ పెమ్మసాని

GNTR: నందివెలుగు బ్రిడ్జి పనులను జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.గురువారం గుంటూరు కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, శంకర్ విలాస్ ఆర్వోబీకి సంబంధించి రైల్వే అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే మంగళగిరి, నంబూరు, బండారుపల్లి బ్రిడ్జిల నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తాపన్నారు.

March 5, 2026 / 02:47 PM IST

కనుల పండగగా సీతారామచంద్రస్వామి నిత్య కళ్యాణం

భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో గురువారం నిత్య కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది. స్వామివారికి సుప్రభాత సేవ ఆరాధనలు నిర్వహించిన అనంతరం ఉత్సవ మూర్తులను మేళతాళాలతో బేడా మండపానికి తీసుకొచ్చారు. అర్చకులు శాస్త్రోక్తంగా విశ్వక్  సేన పూజ పుణ్యహవాచనం కంకణధారణ గావించి సీతారాముల కల్యాణాన్ని జరిపించారు

March 5, 2026 / 02:46 PM IST

‘అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలేవి’

MBNR: మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై చర్యలేవని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు గురువారం విమర్శించారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఆయన కుర్చీకి గురువారం వినతిపత్రం సమర్పించారు. దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

March 5, 2026 / 02:44 PM IST

‘పెద్ది’లో మృణాల్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు క్రేజీ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించగా, ఆమె ఏకంగా రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు టాక్. చరణ్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఈ సాంగ్ ఉండబోతుందట. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.

March 5, 2026 / 02:43 PM IST

‘పట్టణాలతో సమానంగా గ్రామాల అభివృద్ధి చేస్తాం’

అన్నమయ్య: ప్రతి గ్రామాన్ని, పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి అన్నారు. పుల్లంపేటలో సీసీ రోడ్డుకు గురువారం భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు వేగంగా జరగడం ఆనందంగా ఉందని అన్నారు.

March 5, 2026 / 02:42 PM IST

ప్రభుత్వ సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి రాజీనామా

TG: సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తున్న వేం నరేందర్ రెడ్డి తన పదవికి ఇవాళ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాను సైతం సీఎస్ రామకృష్ణారావు వెంటనే ఆమోదించారు. 

March 5, 2026 / 02:41 PM IST

దామచర్ల సత్యను గజమాలతో సత్కరించిన నేతలు

ప్రకాశం: రాష్ట్ర మారీటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య జన్మదిన శుభ సందర్భంగా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు అడ్డరోడ్డు వద్ద స్థానికులు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం కేక్ కట్ చేయించారు. మండల పార్టీ అధ్యక్షుడు పోకూరి రవి, కామేపల్లి ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోటు మురళి ఆధ్వర్యంలో సింగరాయకొండ వెళ్తున్న సత్యను గజమాలతో సత్కరించారు.

March 5, 2026 / 02:41 PM IST

పరీక్షలను పగడ్బందీగా నిర్వహించండి: కలెక్టర్

KRNL: 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జిల్లాలో జరగబోయే పదో తరగతి పరీక్షలను అధికారులు పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కర్నూలులోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష చేశారు. జిల్లా వ్యాప్తంగా 160 పరీక్ష కేంద్రాలలో అన్ని వసతులను ఒకరోజు ముందుగానే పూర్తి చేయాలని తెలిపారు.

March 5, 2026 / 02:40 PM IST