• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

టీడీపీ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

NDL: శ్రీశైలం MLA బుడ్డా రాజశేఖర రెడ్డి శుక్రవారం సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న లింగాలగట్టు గ్రామానికి చెందిన టీడీపీ బూత్ కన్వీనర్ పోలయ్యను ఆయన పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు.

February 21, 2026 / 08:47 AM IST

నల్లమలలో అరుదైన నక్షత్ర తాబేలు కనిపింపు

GDWL: నల్లమల అటవీ ప్రాంతంలో శుక్రవారం అరుదైన ‘నక్షత్రపు తాబేలు’ వెలుగుచూసింది. ఇటీవల అడవిలో అగ్నిప్రమాదాల కారణంగా వన్యప్రాణులు రోడ్లపైకి వచ్చాయి. ITDA మెడికల్ ఆఫీసర్ కళ్యాణ్ సాగర్, బ్రహ్మగిరి నుంచి అచ్చంపేట వెళ్తుండగా రోడ్డుపై భారీ తాబేలును గుర్తించారు. ఇంత పెద్ద పరిమాణంలో తాబేలును అధికారికంగా గుర్తించడం ఇదే మొదటిసారి.

February 21, 2026 / 08:46 AM IST

అగ్ని వీర్ నియామకాలు.. యువతకు 90 రోజుల ఉచిత శిక్షణ

పెద్దపల్లి జిల్లాలో అగ్నివీర్ నియామకాల కోసం యువతకు 90 రోజుల ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు, కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఫిజికల్ ట్రైనింగ్, రాత పరీక్ష కోచింగ్, మెడికల్ అవగాహన, స్టడీ మెటీరియల్ సదుపాయాలు కల్పిస్తారు. 17.5-22 ఏళ్ల మధ్య, 10వ తరగతి ఉత్తీర్ణులైన పురుషులు ఫిబ్రవరి 23లోపు రుద్రమదేవి స్టేడియంలో ఉదయం 6-8 గంటల మధ్య నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

February 21, 2026 / 08:45 AM IST

విదేశీ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

SRD: విదేశాల్లో చదువు కోసం డా. BR.అంబేద్కర్ విదేశీ విద్యానిధి కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని SC అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి ఇవాళ తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను www.telanganaepass.gov.in లో మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. విదేశాల్లో చదువుకునేందుకు రూ.20 లక్షలు అందిస్తామన్నారు.

February 21, 2026 / 08:45 AM IST

జడ్చర్ల బాలికల గురుకులలో కలెక్టర్ తనిఖీ

MBNR: జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లి ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో భోజనం చేసి వసతులను పరిశీలించారు. పదో తరగతి పరీక్షల మెలకువలు నేర్పించి, సందేహాలు గ్రూప్ డిస్కషన్ ద్వారా పరిష్కరించాలని సూచించారు. పరీక్షల్లో ఆత్మవిశ్వాసంతో రాయాలని విద్యార్థులను ధైర్యపరిచారు.

February 21, 2026 / 08:44 AM IST

అభివృద్ధికి నోచుకోని జగనన్న లేఔట్

కృష్ణా: నాలుగేళ్ల క్రితం నాగాయలంక మండలంలోని భావదేవరపల్లిలో 559 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నివేశనా స్థలాలను కేటాయించింది. నాగాయలంక, భావదేవరపల్లి గ్రామాలకు చెందిన వారికి సెంటున్నర భూమి ఇచ్చి రాళ్లు వేశారు. ఈ కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తే ఒక ఊరుగా మారుతుందని ప్రజలు ఆశించారు. కానీ నేటికీ నిర్మాణాలు జరగకపోవడంతో పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి.

February 21, 2026 / 08:43 AM IST

GGHలో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించిన MLA

GNTR: గుంటూరు నల్లచెరువులో వీధి కుక్కల దాడికి గురైన బాలుడిని తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ శుక్రవారం అర్ధరాత్రి హుటాహుటిన GGHకు వెళ్లి పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించి, మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

February 21, 2026 / 08:42 AM IST

నేరడిగొండ హైవేపై సోలార్ బ్యాటరీలో మంటలు

ADB: నేరడిగొండ మండల కేంద్రలో పోలీస్ స్టేషన్ ఎదుట NH-44పై కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడానికి సోలార్ బ్యాటరీలు ఏర్పాటు చేశారు. ఆకస్మాతుగా ఆ బ్యాటరీలలో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీ మొత్తం కాలి బూడిదయింది. సమాచారం తెలుసుకున్న NH-44 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు.

February 21, 2026 / 08:42 AM IST

సాగర్ కాలువలో వృద్ధుడి మృతదేహం లభ్యం

KMM: కొద్దిరోజుల క్రితం తప్పిపోయిన గోపాలపురం వాసి షేక్ నాగుల్ మీరా (65) శుక్రవారం సాగర్ కాలువలో మృతి చెంది కనిపించారు. టేకులపల్లి బ్రిడ్జి సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కాలువ నుంచి వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 21, 2026 / 08:42 AM IST

భద్రకాళి బండ్‌లో టెలిస్కోప్ ఏర్పాటు

వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్ ప్రాంతంలో కార్తికేయ పట్టణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక టెలిస్కోప్ ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి ఈ టెలిస్కోప్ ద్వారా అంతరిక్షంలోని గ్రహాలను వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, నగర కమిషనర్ చావత్ బాజ్‌ పాయ్ గ్రహాలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 08:42 AM IST

మాదకద్రవ్యాల వల్ల జీవితాలు నాశనం

ASR: హుకుంపేట మండలం సూకూరులో శుక్రవారం SI దుర్గా ప్రసాద్ పర్యటించారు. గ్రామస్థులతో సమావేశమయ్యారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలు అధికారులకు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ వల్ల జీవితాలు నాశనం అవుతాయన్నారు. నాటుసారా తయారీ, క్రయ విక్రయాలకు దూరంగా ఉండాలన్నారు.

February 21, 2026 / 08:41 AM IST

నేటి నుంచి పల్నాటి తిరుమల ‘నేతి వెంకన్న’ ఉత్సవాలు

PLD: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పల్నాటి తిరుమలలో ‘నేతి వెంకన్న’ ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. స్వామివారు పైకప్పు లేకుండా ప్రకృతి ఒడిలో భక్తులకు దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత. ఫాల్గుణ మాసంలోని నాలుగు శనివారాలతో పాటు ఉగాది వరకు ఈ వేడుకలు కొనసాగుతాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

February 21, 2026 / 08:41 AM IST

రాజకీయ సవాళ్లతో కామారెడ్డిలో హై టెన్షన్..!

KMR: జిల్లా కేంద్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నెల 16వ తేదీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, MLA KVRపై అవినీతి ఆరోపణలు చేయగా, దానికి కౌంటర్‌గా షబ్బీర్ అలీపై MLA ప్రత్యారోపణలు చేశారు. దీంతో ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోగా.. MLA డిగ్రీ కళాశాల ఆస్తులపై నేడు బహిరంగ చర్చకు రావాలని పిలుపునివ్వడంతో నాయకులు తరలి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

February 21, 2026 / 08:40 AM IST

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

GDWL: ధరూరు మండలం జాంపల్లి శివారులో శుక్రవారం పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఎస్సై నందికర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో రూ.37 వేల నగదు, 2 బైకులు, 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మిగతా వారు పరారీలో ఉన్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

February 21, 2026 / 08:36 AM IST

పేకాట స్థావరంపై దాడి.. నలుగురు అరెస్ట్

కృష్ణా: గూడూరు మండలం చిట్టి గూడూరులో పేకాట స్థావరంపై ఎస్సై దివ్య ప్రకాశ్ తన సిబ్బందితో కలిసి శుక్రవారం ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 16,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

February 21, 2026 / 08:36 AM IST