• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి: మంత్రి

MLG: ములుగు కలెక్టరేట్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగు కలెక్టరేట్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి నేడు మంత్రి సీతక్క పరిశీలించారు. ములుగు జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండేలా భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని, పనులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

February 25, 2026 / 04:11 PM IST

‘అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు మంజూరు చేస్తాం’

JGL: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మెట్ పల్లి మున్సిపల్ ఛైర్మన్ మైలారపురి లింబాద్రి అన్నారు. మెట్పల్లిలోని ఏడో వార్డులో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్మన్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారుల కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యమన్నారు.

February 25, 2026 / 04:10 PM IST

రెవెన్యూశాఖపై మంత్రి పొంగులేటి సమీక్ష

TG: రెవెన్యూశాఖపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. త్వరలో తహశీల్దార్, RDO ఆఫీసులకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని తెలిపారు. తొలిదశలో 60 తహశీల్దార్, 5 ఆర్డీవో ఆఫీసులకు కొత్త భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ముగింపు పలుకుతామని చెప్పారు. రెవెన్యూ వ్యవస్థను ఆధునీకరిస్తామన్నారు.

February 25, 2026 / 04:10 PM IST

CITU అంగన్వాడీ సమస్యలపై వినతిపత్రం

KRNL: పత్తికొండలో CITU అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షల క్రమంలో ఇవాళ పీడీ వద్ద ఐసీడీఎస్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. సీఐటీయూ నాయకులు ఉద్యోగుల అవగాహన, సమస్యలను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు త్వరిత పరిష్కారం చేపట్టాలని సీఐటీయూ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగి ప్రతినిధులు పాల్గొన్నారు.

February 25, 2026 / 04:10 PM IST

ఉద్యోగాలు కల్పించాలని భూ నిర్వాసితుల ధర్నా

MNCL: కాసిపేట మండలంలోని దుబ్బగూడెం KK ఓసీ ఓపెన్ కాస్ట్ లో తమకు ఉద్యోగాలు కల్పించాలని ఓపెన్ కాస్ట్ సింగరేణి ముంపుకు గురైన భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. బుధవారం ఓపెన్ కాస్ట్‌లో విధుల సమయంలో వాహనాలు రాకపోకలను నిలిపివేసి ధర్నా చేశారు. సమస్యలను అతిత్వరలో పరిష్కారిస్తమని ఓపెన్ కాస్ట్ యాజమాన్యం చెప్పడంతో ధర్నా విరమించారు.

February 25, 2026 / 04:10 PM IST

పవన్‌ను ఉద్దేశించి పూనమ్ సంచలన ట్వీట్

నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ‘రాజకీయాల కోసం హిందూ సంప్రదాయ దుస్తులు ధరిస్తూ, సొంత పిల్లలకు మూడు నెలలకే విదేశాల్లో బాప్టిజం ఎందుకు ఇప్పించారు? ఇది రాజకీయ డ్రామానా?’ అని ఆమె ప్రశ్నించింది. ఇవి కేవలం సందేహాలేనని ఆమె అన్నా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించే ఈ విమర్శలు చేశారని నెట్టింట చర్చ నడుస్తోంది.

February 25, 2026 / 04:10 PM IST

తీరిన తాగునీటి సమస్య..!

CTR: పుంగనూరు మండలంలోని ఇటుక నెల్లూరు ఎస్సీ కాలనీలో కొద్ది రోజులుగా తాగునీటి సమస్య నెలకొంది. స్థానికులు అధికారులతో పాటు పలువురు నాయకుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. స్పందించిన అధికారులు గ్రామంలో నూతన బోరు డ్రిల్ చేసి సమస్యను పరిష్కరించారు.

February 25, 2026 / 04:09 PM IST

సీఎస్ విజయానంద్ కీలక ఆదేశాలు

AP: సీఎస్ విజయానంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 2018 గ్రూప్-1లో ఎంపికై ప్రాధాన్య పోస్టుల్లో కొనసాగుతున్న అధికారులను వెంటనే రిలీవ్ చేయాలని సీఎస్ ఆదేశించారు. వీరంతా తక్షణమే సంబంధిత HODలకు రిపోర్ట్ చేయాలని, దీనికి సంబంధించి ఇవాళ రాత్రి 7 గంటల్లోపు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు.

February 25, 2026 / 04:09 PM IST

ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలు

NZB: ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలు అందించేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహింప చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీ, వినాయక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రధాన్ మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు.

February 25, 2026 / 04:06 PM IST

గత పాలకుల వల్లే రోడ్ల దుస్థితి: పుల్లారావు

PLD: గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోడ్లు దెబ్బతిని 43 వేల మంది చనిపోయారని ఎమ్మెల్యే పుల్లారావు అసెంబ్లీలో విమర్శించారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో రోడ్లకు రూ.9,900 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట-నరసరావుపేట, కోటప్పకొండ మార్గాలను విస్తరించాలని కోరారు. ఎన్.హెచ్ 167ఏ, 16 బైపాస్ సర్వీస్ రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.

February 25, 2026 / 04:05 PM IST

జిల్లా టీడీపీ కార్యాలయాన్ని సందర్శించిన ఎంపీ

NTR: విజయవాడ గొల్లపూడిలో నిర్మించనున్న జిల్లా టీడీపీ కార్యాలయాన్ని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు అనురాధతో కలిసి ఎంపీ కేసినేని చిన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. జిల్లా పార్టీ కార్యాలయం పార్టీ కార్య కలాపాలకు కేంద్రంగా, కార్యకర్తలకు మార్గదర్శ వేదికగా ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్రంగా నిలిచేలా నిర్మాణం చేస్తున్నామని తెలిపారు.

February 25, 2026 / 04:05 PM IST

‘మహిళల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి’

KNR: మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. లైంగిక వేధింపుల నిర్మూలన చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బుధవారం KNR కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారిత కేంద్రం ద్వారా అవగాహన శిబిరం నిర్వహించారు.

February 25, 2026 / 04:05 PM IST

‘విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనే ధ్యేయం’

KMR: పెద్ద కొడప్గల్ మండలం బాబుల్ గావ్ ప్రాథమిక పాఠశాలలో నూతన మరుగుదొడ్డి నిర్మాణానికి బుధవారం సర్పంచ్ రవి కుమార్ భూమి పూజ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఈ పని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బీర్ గోండా, కాంగ్రెస్ అధ్యక్షుడు విఠల్ రెడ్డి పాల్గొన్నారు.

February 25, 2026 / 04:04 PM IST

ఈనెల 27 నుంచి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

PDPL: అంతర్గాం మండలం మూర్ముర్‌లో నిర్మించిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈనెల 27న విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ తెలిపారు. మార్చి 1, 2 తేదీలలో స్వామివారి కళ్యాణ మహోత్సవం, అనంతరం జాతర కొనసాగుతుందని పేర్కొన్నారు. గత 66 ఏళ్లుగా గోపు వంశీయులు కొమురన్న పేరుతో ఈ జాతరను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

February 25, 2026 / 04:03 PM IST

స్థల వివాదం ఘటనలో ఒకరిపై కేసు నమోదు: ఎస్ఐ

ATP: పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో సోమవారం జరిగిన స్థల వివాదంతో నాగన్న అనే వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన ఘటనలో ముత్యాలు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. బుధవారం ఎస్ఐ మీడియాతో మాట్లాడారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు.

February 25, 2026 / 04:03 PM IST