శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం తదియ: మ.3:33 తదుపరి చవితి ఉత్తరాభాద్ర: రా.9:13 తదుపరి రేవతి వర్జ్యం: ఉ.7:11 నుంచి 8:44 వరకు అమృత ఘడియలు: సా.4:32 నుంచి 6:06 వరకు దుర్ముహూర్తం: ఉ.8:46 నుంచి 9:33 వరకు తిరిగి మ.12:37 నుంచి 1:22 వరకు రాహుకాలం: ఉ.10:30 నుంచి 12:00 వరకు సూర్యోదయం: ఉ.6:29; సూర్యాస్తమయం: సా.5:59.
వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల ‘Y’ క్రోమోజోమ్ను ఎక్కువగా నష్ట పోతున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఫలితంగా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి జబ్బులతోపాటు, తక్కువ ఆయుర్దాయంతో ముడిపడి ఉందట. 60 ఏళ్లు పైబడిన పురుషులలో ‘Y’ క్రోమోజోమ్ లోపం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఆడవారితో పోలిస్తే మగవారిలో మరణాల రేటు ఎక్కువగా ఉండటానికి ఇది ఒక కారణం కావొచ్చని అంచనా వేశారు.
సామెత: ‘ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాడట’ అర్థం: కొంత మంది తను చేయాల్సిన కనీస బాధ్యతలు చేయడం కూడా ఏదో ఘనకార్యం చేసినట్లు చెప్పుకుంటారు. భార్యను పోషించడం భర్త కనీస బాధ్యత. తను, తన సంసారం కాకుండా, లోకానికి ఉపయోగపడేలా ఏదైనా చేస్తే అర్ధం ఉంది. కానీ, తన వాళ్ళకి పెట్టుకుని లోకాన్ని ఉద్దరించినట్లు మాట్లాడే వాళ్ళని ఉద్దేశిస్తూ ఈ సామెత ఉపయోగిస్తారు.
చాట్జీపీటీ, జియోహాట్స్టార్ జతకలిశాయి. ఇకపై చాట్ జీపీటీలో వినోదాత్మక కంటెంట్ గురించి సెర్చ్ చేసే వారికి జియో హాట్స్టార్ స్ట్రీమింగ్ లింక్లు కనిపించనున్నాయి. మరోవైపు జియోహాట్ స్టార్, ఓపెన్ ఏఐ కలిసి చాట్జీపీటీ పవర్డ్ వాయిస్ డిస్కవరీ ఫీచర్ను కూడా తీసుకువచ్చాయి. ఇది వ్యూయర్స్ అడిగిన దాన్ని బట్టి వినోదాత్మక కంటెంట్ను సజెస్ట్ చేయనుంది.
సిరిసిల్ల పట్టణం B.Y నగర్ లోని యశ్వసిన్ మండప్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశభక్తి, పరాక్రమం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు.
మలయాళ నటులు అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, విషాక్ నాయర్ కలిసి నటించిన మూవీ ‘చథా పచ్చ’. FEB 13న రిలీజైన ఈ మూవీ OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. WWE తరహా రెజ్లింగ్ క్లబ్ను స్థాపించే ముగ్గురు సోదరుల కథతో ఈ మూవీ దర్శకుడు అద్వైత్ నాయర్ తెరకెక్కించాడు.
KRNL: పత్తికొండ మండలంలో రైతు విశిష్ట సంఖ్య ఉంటేనే కిసాన్ పథకం వర్తిస్తుందని మండల వ్యవసాయ అధికారి వెంకట్రాముడు బుధవారం తెలిపారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన 2,143 మంది రైతుల జాబితాను రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించినట్లు చెప్పారు. నమోదు లేని రైతులు వెంటనే తమ గ్రామ రైతు సేవా కేంద్రాలను సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించారు.
CTR: సోమల మండలం కందూరు, చౌడేపల్లి వెళ్లే మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు బైకులు ఢీ కొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు చౌడేపల్లిగా స్థానికుల చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు సాక్షి మీడియా సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేశారు. తనకు వ్యతిరేకంగా, తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలు రాశారని పేర్కొన్నారు. ఇందిరా టెలివిజన్ MD భారతీరెడ్డి, ఎడిటర్ బ్యూరో చీఫ్, బోర్డు డైరెక్టర్లకు లీగల్ నోటీసులు పంపించారు. క్షమాపణ చెప్పి.. నష్టపరిహారంగా రూ.కోటి చెల్లించాలని, ఆడబ్బును అమరావతి రైతులకు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
కృష్ణా: యనమలకుదురు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. 82 రోజుల కాలానికి హుండీ ఆదాయం మొత్తం రూ.23,40,500గా వచ్చినట్లు ఆలయ ఈవో ఎన్. భవాని తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు, గ్రామస్థులు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు యనమలకుదురు శాఖ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్: గండీడ్ మండలం వెన్నాచేడ్ ఆదర్శ పాఠశాలలో 6-10 తరగతుల్లో దరఖాస్తులను ఆహ్వానించారు అని ప్రిన్సిపల్ రాయిస్ ఫాతిమా తెలిపారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7-10 తరగతుల్లో ఖాళీలు ఉన్నాయని, ఈ నెల 28లో https://tgms.telangana.gov.inలో దరఖాస్తు చేయాలని సూచించారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న ఉంటుందని పేర్కొన్నారు.
శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘విష్ణు విన్యాసం’ ఈనెల 28న విడుదల కానుంది. తాజాగా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్లో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని, అందరినీ అలరిస్తుందని అన్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ యువతకు బాగా నచ్చుతుందని, థియేటర్లలో అందరూ హాయిగా నవ్వుకుంటారని ధీమా వ్యక్తం చేశాడు.
AP: విజయవాడ నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు బయలుదేరారు. ఆయన బయలుదేరే ముందు పోలీసులు నోటీసులు ఇచ్చి సంతకం చేయించుకున్నారు. నోటీసులు ఇవ్వడంపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వడం సరికాదని, సంఘీభావం తెలిపేందుకు కార్యకర్తలు వస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో తమకు సంఘీభావం తెలపకుడదా? 18 రోజుల తర్వాత ఇంటికి వెళ్తుంటే నిర్బంధాలు ఏంటని మండిపడ్డారు.
AP: విజయవాడ నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు బయలుదేరారు. ఆయన బయలుదేరే ముందు పోలీసులు నోటీసులు ఇచ్చి సంతకం చేయించుకున్నారు. నోటీసులు ఇవ్వడంపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వడం సరికాదని, సంఘీభావం తెలిపేందుకు కార్యకర్తలు వస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో తమకు సంఘీభావం తెలపకుడదా? 18 రోజుల తర్వాత ఇంటికి వెళ్తుంటే నిర్బంధాలు ఏంటని మండిపడ్డారు.