NGKL: అమ్రాబాద్ మండలంలోని నల్లమల అడవి ప్రాంతంలోని రాయల గండిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని క్రీ.శ 1536లో చింతగుండ రంగారావు నిర్మించారు. ఈ ప్రాంతానికి రంగా రయుని గండి అని పేరు పెట్టగా కాలక్రమేన అది “రాయలగండి” గా ప్రసిద్ధి చెందింది. ఈ చెన్నకేశవ స్వామి ఆలయంలో మాల దాసరి వర్గానికి చెందిన వారు పూజలు నిర్వహించడం విశేషం.
CTR: మందస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి సంఘం డస్క్ బెంచీలను వితరణగా అందజేశారు. సుమారు రూ. 90 వేలు విలువగల 60 డస్క్ బెంచీలను పాఠశాలకు అందజేసి దాతృత్వాన్ని చాటారు. HM శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అసోసియేషన్ ఫౌండర్ ప్రొఫెసర్ మోహన్ ఆచారి నిధుల సమీకరణ జరిపి చేస్తున్న కృషి ఆదర్శప్రాయం అని కొనియాడారు.
✦ TG: ఢిల్లీ AI సమ్మిట్లో పాల్గొననున్న CM రేవంత్✦ నిజమాబాద్లో PCC చీఫ్ మహేష్ పర్యటన✦ AP: ఢిల్లీ పర్యటనకు CM చంద్రబాబు✦ ఏడో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు✦ T20 WC: ఆస్ట్రేలియా, ఒమన్ మధ్య చివరి గ్రూప్ మ్యాచ్✦ ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్: IND vs SL సెమీస్
SRPT: మేళ్లచెరువు మండలంలో జాతర సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఉత్కంఠ భరితంగా ముగిసింది. ఫైనల్ పోరులో విజయనగరం, వైజాగ్ జట్లు తలపడగా, విజయనగరం జట్టు విజేతగా నిలిచి లక్ష రూపాయల నగదు బహుమతిని కైవసం చేసుకుంది. విజేతకు ట్రోఫీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు.
NTR: తిరువూరు లోని కేడీసీసీ బ్యాంక్ కార్యాలయం వద్ద నియోజకవర్గ పరిధిలోని తిరువూరు, గంపలగూడెం, ఏ కొండూరు, విసన్నపేట మండలాల సహకార సంఘాల ఉద్యోగులు నిరవధిక సమ్మెలో భాగంగా 4వ రోజు నిన్న ధర్నా చేశారు. జీవో నెం 36 అమలు చేయాలని, 2019 నుంచి 2024 వరకు పెండింగ్లో ఉన్న పీఆర్సీలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
ప్రకాశం: ఇంటర్ పరీక్షల నేపథ్యంలో అంబేడ్కర్ గురుకులాల విద్యార్థులతో కొండేపి ఏమ్మెల్యే, మంత్రి స్వామి అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల పట్ల భయం లేకుండా రాయాలని సూచించారు. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. గురుకుల విద్యార్థుల కొరకు పరీక్షలు రాసేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
GNTR: ఆచార్య నాగార్జున వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరును తొలగించడాన్ని గురువారం వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. 2009లో పాలకమండలి తీర్మానం ప్రకారమే ఆ పేరు పెట్టారని ఆయన గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు.
JN: జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ను మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి కలిశారు. కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి వెళ్లిన ఆమె, పట్టణ అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ను కోరారు. అనంతరం డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, ఆర్డీవో గోపీరాంలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ శివరాజ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
ATP: రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ఉర్దూ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే పని చేస్తాయని డీఈఓ ప్రసాద్ బాబు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రంజాన్ మాసం ముగిసిన తర్వాత పాఠశాలలు యథావిధిగా నడుస్తాయని వివరించారు.
AKP: జనన మరణాల నమోదుపై ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలులోకి తీసుకువచ్చిందని డీఎం అండ్ హెచ్వో డాక్టర్ హైమావతి గురువారం తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం జనన మరణాల రిజిస్ట్రేషన్ను 21 రోజుల్లో ఉచితంగా నమోదు చేయించుకోవచ్చునని సూచించారు. 21 రోజుల నుంచి 30 రోజుల్లో నమోదు చేస్తే రూ.25, 30 నుంచి ఏడాదిలోపు రూ.250 అపరాధ రుసుం చెల్లించాలన్నారు.
PLD: పిడుగురాళ్లలో మద్యం సేవించి ఆటో నడిపిన వ్యక్తికి కోర్టు 7 రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ వెంకట్రావు తెలిపారు. నిందితుడిని పోలీసులు సివిల్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈ తీర్పునిచ్చారు. పట్టణంలో రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ వాహనదారులను గురువారం రాత్రి హెచ్చరించారు.
E.G: రాజమండ్రిలోని SKVT ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 20, 21 తేదీలలో ‘యువతలో ఆవిష్కరణలు, వ్యాపార నైపుణ్యాల అభివృద్ధి’పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. బి.వి. తిరుపణ్యం తెలిపారు. ఈ సదస్సులో అధ్యాపకులు పరిశోధనా పత్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. డిగ్రీ, ఆపై చదువుతున్న విద్యార్థులు పాల్గొని అవసరమైన మెలకువలు నేర్చుకోవచ్చన్నారు.
SKLM: శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ గురువారం సీఎం చంద్రబాబును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు, బోధి బట్టి డ్రైనేజీ సమస్యలు తదితర అంశాలపై సీఎంతో చర్చించారు. వంశధార కాలువలు, డ్రైనేజీ పనుల కోసం రూ. 31.10 కోట్ల నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు.
PPM: నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా ఆరోగ్య సర్వేలు చేపట్టాలని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు స్పష్టం చేశారు. అడ్డాపుశీల లో ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుత ఎన్.సి.డి, ఆర్.బి.ఎస్.కె సర్వే, స్క్రీనింగ్లపై వైద్య సిబ్బందిని ఆరా తీసి ఆన్లైన్ నమోదు నివేదికలు పరిశీలించారు.