ELR: ఉంగుటూరు గ్రామంలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు నారాయణపురం ఏఈ శ్రీరామ్ ఆదివారం తెలిపారు. కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు, కొత్త విద్యుత్తు లైన్ వేస్తామన్నారు. ఊర చెరువు దగ్గర నుంచి ప్రాథమిక పాఠశాల వన్, అంబేద్కర్ బొమ్మ దగ్గర, బాబు జగజ్జీవన్ రావు బొమ్మ ఏరియాలో నిలుపుదల చేస్తున్నామన్నారు.
WNP: సీపీఐ జిల్లా కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి విజయరాములు తెలిపారు. ఈ సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల నరసింహ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై చర్చించనున్నారు. అలాగే జిల్లాలోని ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.
SRPT: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. ఈ నెల 23వ తేదీ నుంచి కలెక్టర్ కార్యాలయంలో యథాతథంగా నిర్వహిస్తామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ASR: జీసీసీ గోడౌన్ నుంచి రేషన్ సరుకులను త్వరితగతిన రేషన్ దుకాణాలకు సరఫరా చేయాలని కొయ్యూరు మండల తహసీల్దార్ పీ.మురళీ బాబు సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం ఆయన కృష్ణదేవి పేటలో ఉన్న గోడౌన్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం రేషన్ సరుకులను తనిఖీ చేశారు. రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రకాశం: ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో ఆదివారం 117 మందికి రూ. 75 లక్షలు విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అందజేశారు. పేద కుటుంబాల ఆరోగ్యానికి భరోసాగా ఉండేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎరిక్షన్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎరిక్షన్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
కోనసీమ: ఐ.వీ.ఆర్.ఎస్ సర్వేలో మండపేటకు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం లభించడం పట్ల ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఉత్తమ ఫలితాలు సాధించలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం వరుసగా రెండు సార్లు మండపేట మున్సిపాలిటీకి అవార్డు దక్కడం ఆనందంగా ఉందన్నారు.
గుంటూరు: పొన్నూరు మండలం వెల్లలూరులోని శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానంలో నిర్వహించిన వార్షిక మహోత్సవం, పొంగళ్ల నైవేద్య కార్యక్రమంలో ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. అమ్మవారికి నూతన వస్త్రాలు, పండ్లు సమర్పించి ఆశీర్వచనం పొందారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో సుమారు 92% నీరు ఉండటం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ఇందులోని ‘లైకోపీన్’ రక్తపోటును తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పుచ్చకాయలో ఉండే విటమిన్ A, Cలు చర్మాన్ని కాంతివంతంగా, జుట్టును దృఢంగా మారుస్తాయి. ఇందులోని పీచు పదార్థం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. అలాగే ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.
ADB: నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక ఏకలవ్య ఆదర్శ పాఠశాలలో ఆదివారం గురుకుల ప్రవేశ పరీక్షా ప్రశాంతంగా ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు తరలిరాగ.. పాఠశాల వద్ద రద్దీ ఏర్పడింది. విద్యార్థులకు అన్ని ఏర్పాట్లతో పరీక్షను నిర్వహించామని సిబ్బంది పేర్కొన్నారు. ఈ మేరుకు పరీక్షా ముగించుకున్న విద్యార్థులు తిరిగి ఇంటి బాట పట్టారు.
TPT: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయడు, కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ను మర్యదపూర్వకంగా కలిసారు. మైక్రో ఇరిగేషన్ నిధుల విడుదలపై అచ్చెన్నాయడు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసారు. త్వరితగతిన మిగిలిన రూ.645 కోట్లు కేంద్ర వాటా విడుదల చేయాలని కోరారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో నిధులు విడుదలకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
HYD: బల్కంపేట్ రేణుకా ఎల్లమ్మ తల్లిని ఆదివారం సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. పలు రకాల పుష్పాలు, ఫలాలతో అమ్మవారిని అత్యంత సుందరంగా గర్భగుడిని తీర్చిదిద్దారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించి, దీప ధూప నైవేద్యాలు సమర్పించి, మంగళహారతులు ఇచ్చారు. భక్తజన సందోహంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. దర్శనానికి సుమారు 30 నిమిషాల సమయం పడుతుంది.
VKB: దోమ మండలం మల్లేపల్లిలో ఈ నెల 24, 25న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఆలయ కమిటీ తెలిపారు. 24న ధ్వజస్తంభ ప్రతిష్ఠ, ధ్వజారోహణ, ఆంజనేయస్వామి అభిషేకం, గణపతి, నరసింహస్వామి హోమం, మంగళహారతి, ప్రసాద వితరణ, ఊరేగింపు, సుప్రభాతం, అభిషేకం, చండిహోమం నిర్వహించబడతాయి. 25న స్వామివారి కళ్యాణం, మంగళహారతి కార్యక్రమాలు జరగనున్నాయి.
CTR: సదుంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనను కలిశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారికి ఆయన సూచించారు. పలువురు తమ సమస్యలు విన్నవించగా, పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
PPM: విజయనగరం తోటపాలెం ఎస్సీ కాలనీకి చెందిన అంబేద్కర్ వాది, బహుజననాయకులు బోక ఆంజనేయులు ఆదివారం విజయవాడజై భీమ్ రావు భారత్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జై బీమ్ పార్టీలో చేరారు. ఏపీ రాష్ట్ర జై భీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపకులు జాడ శ్రావణ్ కుమార్, విజయనగరం జిల్లా ఇంచార్జ్ దుర్గారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.
PDPL: మంథని మండలంలోని చిల్లపల్లి గ్రామంలోని సీసీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర ఘటనలపైనా అవి నిర్ధారణలో సహాయం చేయలేవనే సమస్య తలెత్తింది. ప్రస్తుత పరిస్థితిలో కెమెరాలు నేలవైపు మళ్లీ ఉన్నాయి. స్థానికులు అధికారులు వెంటనే చర్య తీసుకుని కెమెరాలను సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని కోరుతున్నారు.