• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పోలీస్ వ్యవస్థను రాజకీయాలకు వాడుతున్నారు: అంబటి

AP: లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ‘నా ఇల్లు, ఆఫీస్‌పై దాడి చేశారు. 5 నుంచి 12 గంటల వరకు దాడి జరుగుతూనే ఉంది. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. జిల్లా ఎస్పీ కనీసం పట్టించుకోలేదు. పార్టీలకు అతీతంగా ప్రజలు ఆలోచించాలి’ అని కోరారు

February 22, 2026 / 01:51 PM IST

‘విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి’

MNCL: వచ్చే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.

February 22, 2026 / 01:47 PM IST

BRS నేతలు విషం చిమ్ముతున్నారు: MLC వెంకట్

TG: మూసీ ప్రాజెక్టుపై BRS నేతలు విషం చిమ్ముతున్నారని, మూసీ ప్రక్షాళన BRSకు ఇష్టం లేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. రెచ్చగొట్టి లబ్ధి పొందాలని మాజీ మంత్రి హరీష్ రావు యత్నిస్తున్నారని ఆరోపించారు. మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, నిర్వాసితులు ప్రతిపక్షా వలలో పడొద్దని సూచించారు.

February 22, 2026 / 01:46 PM IST

ఐపీఎస్‌ సునీల్‌ కుమార్‌ సస్పెన్షన్‌ పొడిగింపు

AP: ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్, 1969లోని రూల్3(3) ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. క్రిమినల్ కేసు పూర్తి లేదా పదవీ విరమణలో ఏది ముందైతే అప్పటి వరకు సస్పెన్షన్ కొనసాగనుంది. సునీల్ కుమార్‌పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.

February 22, 2026 / 01:45 PM IST

అక్రమ వ్యాపారాలకు అండగా ఉన్న పోలీసులపైచర్యలు: ఎస్పీ

VKB: అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా SP స్నేహ మెహ్ర తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల సమావేశంలో వెల్లడించారు. అక్రమ ఇసుక వ్యాపారం కొనసాగుతుందని ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. అక్రమ వ్యాపారాలకు అండగా ఉన్న పోలీస్ సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

February 22, 2026 / 01:41 PM IST

కాలువలో శవమై తేలిన బీజేపీ నేత

TG: జగిత్యాల జిల్లా సుద్ధపల్లిలో విషాదం చోటుచేసుకుంది. బీజేపీ నేత రమణ అనుమానాస్పద స్థితిలో కాలువలో శవమై తేలారు. గతంలో BRS పార్టీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయన.. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఆయనపై మూడు రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే, ప్రమాదమా లేక హత్యా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

February 22, 2026 / 01:41 PM IST

వేదనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా కుంభాభిషేకం

TPT: నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. వేలాది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆధికారులు, స్థానిక సంఘాల వారు భక్తుల కోసం అన్ని సౌకర్యాలను అందించారు. కుంభాభిషేకం ద్వారా ఆలయంలో పవిత్రత, ఆధ్యాత్మిక ఉత్సాహం మరింత పెరిగినట్లు భక్తులు తెలిపారు.

February 22, 2026 / 01:40 PM IST

మోడల్ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు మొదలు

KDP: నర్సాపురంలోని ఏపీ మోడల్ పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో 6వ తరగతి ప్రవేశాలకు ఆర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ సౌజన్య పేర్కొ న్నారు. ఈనెల 23 నుంచి మార్చి 31వ తేదీ వరకు అన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మొత్తం 100 సీట్లు ఉంటాయని దరఖాస్తుచేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 12వ తేదీ ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుందన్నారు.

February 22, 2026 / 01:40 PM IST

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఆదివారం కొంతం కిష్టమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. పేద కుటుంబానికి చెందిన కిష్టమ్మ కుటుంబ సభ్యులకు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు తమ వంతు సహాయంగా రూ. 5000 ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు.

February 22, 2026 / 01:38 PM IST

గూడూరులో నీళ్ల గోస?

VKB: దోమ మండలం గూడూరు గ్రామంలో గత 15 రోజులుగా నీళ్లు రాక గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. గ్రామానికి రావాల్సిన మంచి నీటి బోరు మోటార్ పడైపోయిందని తెలిపారు. గ్రామస్థులు సర్పంచ్, సెక్రటరీ, వర్డ్ మెంబర్స్‌కు తెలియజేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు త్వరగా సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

February 22, 2026 / 01:37 PM IST

డీసీసీ అధ్యక్షుల సమావేశానికి సిగ్నల్స్ రాక అవస్థలు

VKB: కేంద్రంలోని అనంతగిరి హరిత రిసార్ట్లో DCC అధ్యక్షుల సమావేశం జరుగుతోంది. ఆ ప్రాంతంలో వివిధ కంపెనీల సిగ్నల్స్ రాకపోవడంతో DCC అధ్యక్షుడు ఆందోళన చెందుతున్నారు. అడవి ప్రాంతంలో సిగ్నల్స్ లేకపోవడంతో ఎవరికి ఫోన్ చేయలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం DCC అధ్యక్షుల మధ్య గుసగుసలాడుతోంది.

February 22, 2026 / 01:37 PM IST

తెలంగాణ ఉద్యమకారుడికి ఘన నివాళి

SRPT: తిరుమలగిరిలోని 2వ వార్డుకి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, మాజీ వార్డు మెంబర్ పులిగిల్ల యాదగిరి గుండెపోటుతో మరణించడంతో ఆదివారం ఆయన పార్థివదేహానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సంకేపల్లి నరోత్తం రెడ్డి, జయచందర్, యాదగిరి, నరేష్ ఉన్నారు.

February 22, 2026 / 01:35 PM IST

ఆలయానికి పోటెత్తిన భక్తులు

RR: చేవెళ్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అఖండ హారతి జాతర ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. జాతర ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి ప్రజలు బారులు తీరడంతో వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో రద్దీగా మారింది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

February 22, 2026 / 01:34 PM IST

గ్రేటర్‌కు అత్యంత నాణ్యతతో నీటి సరఫరా

HYD: నగర వాసులకు అత్యంత నాణ్యతతో నీటి సరఫరా చేసేందుకు జలమండలి సిద్ధమైంది. దీనికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆటోమేటిక్ సోలార్ ఎలక్ట్రో క్లోరినేషన్ పద్ధతిని ఉపయోగించనున్నారు. వివిధ నదుల నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసిన తర్వాత ఇంటింటికీ సరఫరా చేసేటప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. దీని ద్వారా నాణ్యమైన నీటిని సరఫరా అవుతుందని అధికారులు అన్నారు.

February 22, 2026 / 01:33 PM IST

నూతన రైస్ మిల్లును ప్రారంభించిన మంత్రి సీతక్క

MLG: వెంకటాపూర్ మండలం రామంజాపూర్ గ్రామంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ స్టేట్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి నూతనంగా నిర్మించిన రైస్ మిల్‌ను ఇవాళ రాష్ట్ర మంత్రి సీతక్క రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ రైస్ మిల్ వ్యాపారంలో రాణించి నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అశోక్ కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.

February 22, 2026 / 01:32 PM IST