• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘రైతు సంఘర్షణ సమావేశం విజయవంతం చేయండి’

GWDL: నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు ధరూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయానికి గురి చేసిందన్నారు. అలాగే జిల్లాలో రైతుల సమస్య పరిష్కారానికై ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సమావేశంను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశానికి మహిళలు, రైతులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

February 22, 2026 / 02:17 PM IST

కరెంట్ షార్ట్ సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధం

MHBD: గూడూరు మండలం గండసోములుతండాలో ఆదివారం కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. స్థానికుడు బోడ ధన్యకు చెందిన పెంకుటిల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమై బూడిదైపోయింది. ఈ ఘటనలో సుమారు రూ. 2 లక్షల విలువైన ఆస్తి నష్టపోయింది. ప్రభుత్వం బాధితుల ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

February 22, 2026 / 02:17 PM IST

భోజనం తర్వాత సోంపు తింటున్నారా?

ప్రతిరోజూ భోజనం తర్వాత కొద్దిగా సోంపు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. సోంపులో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. సోంపు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు నోటి దుర్వాసనను పోగొడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఔషధం.

February 22, 2026 / 02:16 PM IST

విస్తృతంగా వాహనాలు తనిఖీ

AKP: ఎస్.రాయవరం మండలం జేవీపాలెం వద్ద ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహనాలు తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. రహదారి నిబంధనలు పాటించని వారికి అపరాధ రుసుం విధించారు. ప్రమాదాల జరగకుండా చూసేందుకు వాహనాల తనిఖీలు చేపడుతున్నామని ఎస్సై విభీషణరావు తెలిపారు. పరిమిత వేగంతో వాహనాలు నడపాలన్నారు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించాలని సూచించారు.

February 22, 2026 / 02:15 PM IST

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ATP: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని, పాత దరఖాస్తుదారులు రసీదులు తీసుకురావాలని సూచించారు. పరిష్కారం కాని ఫిర్యాదుల కోసం 1100 కాల్ సెంటర్ లేదా ఆన్‌లైన్ వెబ్‌సైట్ సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

February 22, 2026 / 02:15 PM IST

‘రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

ATP: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని, పాత దరఖాస్తుదారులు రసీదులు తీసుకురావాలని సూచించారు. పరిష్కారం కాని ఫిర్యాదుల కోసం 1100 కాల్ సెంటర్ లేదా ఆన్‌లైన్ వెబ్‌సైట్ సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

February 22, 2026 / 02:15 PM IST

కోడిపందాల స్థావరంపై దాడి… ఏడుగురు అరెస్ట్

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామ శివారులో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీస్ సిబ్బందితో కలిసి కోడిపందాల స్థావరంపై ఎస్సై సత్యనారాయణ ఈరోజు దాడి చేశారు. కోడి పందాలు నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3,150 నగదు, 6 సెల్ ఫోన్లు, ఒక కోడిపుంజు, 5 కోడి కత్తులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

February 22, 2026 / 02:15 PM IST

బస్సాపూర్లో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ

NZB: బస్సాపూర్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ఆర్ఆజీఎస్ కింద మంజూరు చేసిన రూ.10 లక్షల నిధులతో ఈ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ఉపసర్పంచ్ వంశీ పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి నిధులు వెచ్చించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

February 22, 2026 / 02:14 PM IST

మహేశ్వరంలో పర్యటించిన కేఎల్ఆర్

RR: మహేశ్వరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో నియోజకవర్గ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న లక్ష్మారెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమీర్పేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ పర్యటనలో సర్పంచ్‌లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 22, 2026 / 02:14 PM IST

‘దేశ ప్రతిష్టపై దాడులను సహించం’

KRNL: పత్తికొండలో బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో, న్యూఢిల్లీలో జరిగిన ఇండియా AI ఎక్స్‌పో సందర్భంగా భారతమండపంపై దాడిని ఇవాళ మండల అధ్యక్షుడు కరణం నరేష్ తీవ్రంగా ఖండించారు. దేశ గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

February 22, 2026 / 02:13 PM IST

ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో వసతులు కల్పించాలి: PDSU

సత్యసాయి: రేపటి నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని PDSU జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ డిమాండ్ చేశారు. కనేకల్ అంబేద్కర్ పాఠశాల వద్ద ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక బస్సులు నడపాలని, వాహనదారులు విద్యార్థులకు లిఫ్ట్ ఇచ్చి పరీక్షా కేంద్రాలకు చేర్చి సహకరించాలని కోరారు.

February 22, 2026 / 02:13 PM IST

ప్రభాస్ ‘మున్నా’ రీ-రిలీజ్.. ఎప్పుడంటే?

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో వచ్చిన ‘మున్నా’ మూవీ 2007లో రిలీజై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా రీ-రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. 2026 మార్చి 6న ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇలియానా నటించింది.

February 22, 2026 / 02:10 PM IST

MLA రాజాసింగ్ అరెస్ట్

TG: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టయ్యారు. బాన్సువాడ వెళ్తున్న ఆయన్ని పెద్దశంకరంపేట వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సమీపంలోని పీఎస్‌కు రాజాసింగ్‌ను తరలించారు. బాన్సువాడ, కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావును తార్నాకలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు.

February 22, 2026 / 02:09 PM IST

రేపు జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్

మెదక్ జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 23న ఉదయం 10:30 గంటలకు జిల్లా స్థాయి భౌతిక, రసాయన శాస్త్ర టాలెంట్ టెస్ట్ జరగనుంది. ఈ విషయని మెదక్ డివిజన్ అధ్యక్షుడు ఎల్.మల్లారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మండల స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు ఈ పోటీలకు అర్హులని పేర్కొన్నారు.

February 22, 2026 / 02:09 PM IST

ఉయ్యాలవాడకు మార్టేరులో ఘన నివాళి

W.G: బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని ఉమ్మడి గోదావరి జిల్లాల రెడ్డి సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి కృష్ణారెడ్డి కొనియాడారు. ఆదివారం మార్టేరులో ఆయన వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసిన ధీరుడు నరసింహారెడ్డి అని కొనియాడారు.

February 22, 2026 / 02:05 PM IST