VKB: దేశ సామాజిక ఆర్థిక సమస్యల పరిష్కారానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం వికారాబాద్ అనంతగిరిలో తెలుగు ఉభయ రాష్ట్రాల DCC అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. రోహిత్ వేముల ఘటనలో రాహుల్ స్పందించిన తీరు ఆయన సామాజిక స్పృహకు నిదర్శనమని చెప్పారు.
BDK: మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జితేష్ వీ. పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో పబ్లిక్ పరీక్షల నిర్వహణకు నియమించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కర్నూలు: న్యాయవాది పవన్ కుమార్పై జరిగిన పోలీస్ దాడిని ఖండిస్తూ ఎమ్మిగనూరు న్యాయవాదులు విధులను బహిష్కరించి సోమవారం నిరసన తెలిపారు. స్థానిక కోర్టు నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రషీదుల్లా మాట్లాడుతూ, సంబంధిత సిఐపై వెంటనే సస్పెన్షన్ విధించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ ప్రొఫెషనల్ సింగర్గా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్.. అర్జిత్ సింగ్ను కలిసి పాటలు పాడటం ఆపొద్దంటూ స్వయంగా కోరాడు. ముర్షిదాబాద్లోని అర్జిత్ సింగ్ నివాసానికి వెళ్లిన అమీర్.. ‘నువ్వు పాటలు పాడటం ఆపేస్తే మేము ఏమైపోతాం?’ అంటూ రిక్వెస్ట్ చేయడం విశేషం.
BHNG: రైతులకు యూరియా నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజాపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేష్ మాట్లాడుతూ.. యాప్లో యూరియా బుక్ చేసుకుందామనుకుని ఓపెన్ చేసే క్రమంలో సెకండ్లలో యూరియా ఖాళీ అయిపోతుందన్నారు. దీంతో రైతులకు యూరియా లభించడం లేదన్నారు.
TPT: సత్యవేడు ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్రాల్లో పిల్లలకు అందిస్తున్న భోజనానికి ప్రభుత్వం చెల్లిస్తున్న మెనూ చార్జీలు సరిపోవడం లేదని CITU నాయకుడు రమేష్ పేర్కొన్నారు. వేతనాలు పెంపు, ఖాళీ పోస్టుల భర్తీ, ఉచిత గ్యాస్ సరఫరా తదితర డిమాండ్లు నెరవేర్చాలని కోరారు.
NZB: విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 46 మంది లైసెన్స్ సర్వేయర్లకు NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం కలెక్టరేట్లో సర్టిఫికెట్లను అందజేశారు. కలెక్టర్ వారికి పలు సూచనలు చేశారు. లైసెన్స్డ్ సర్వేయర్లు బాధ్య తాయుతంగా సేవలు అందించాలని సూచించారు. ఎలాంటి అవినీతి ఆరోపణలకు తావు లేకుండా నిజాయతీగా సర్వే నివేదికలు అందజేశాయన్నారు.
AKP: దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన, విధి నిర్వహణలో గాయపడిన మాజీ సైనికులు కుటుంబాల సంక్షేమానికి ఉద్దేశించిన సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ దీనికి రూ.2.42 లక్షల విరాళాన్ని కలెక్టర్కు మెప్మా పీడీ సరోజినీ సోమవారం అందజేశారు.
AKP: నర్సీపట్నం ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కిల్లాడ వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా జయంతి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాలకొండయ్య మాట్లాడుతూ.. సంత్ గడ్గే బాబా అణగారిన వర్గం రజక కులం నుంచి వచ్చిన మహోన్నత పురుషుడు అని కొనియాడారు. భారతదేశంలో రాజకీయపార్టీలు స్వచ్ఛంద సంస్థలు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకున్నాయన్నారు.
NLG: దేవరకొండ మండలం తాటికోల్ లో వెంచర్ డెవలప్మెంట్ పేరుతో ఈత చెట్లు నరికివేశారని బీసీ సంఘం, గౌడ సంఘం నాయకులు ఎక్సైజ్ అధికారికి సోమవారం పిర్యాదు చేశారు. గౌడ సంఘాల జేఏసీ జిల్లా ఛైర్మన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గౌడ కులస్తులు ఉపాధి కోల్పోతారని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆధ్వర్యంలో అధికారులకు క్లాడ్ (Claude) AI సాంకేతికతపై అవగాహన సదస్సు నిర్వహించారు. పరిపాలనలో వేగం, ఖచ్చితత్వం పెంచేందుకు ఎక్సెల్, నివేదికల తయారీలో ఈ AI సాధనాలను ఉపయోగించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పథకాల పర్యవేక్షణలో AI టూల్స్ కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.
కృష్ణా: చల్లపల్లి అభివృద్ధికి ఎంపీ విజయేంద్ర ప్రసాద్ సహకారం అభినందనీయం అని స్వచ్ఛ చల్లపల్లి కన్వీనర్ డాక్టర్ డీ.ఆర్.కే.ప్రసాద్ అన్నారు. గ్రామంలో స్వచ్ఛ సుందర చల్లపల్లి గురించి తెలుసుకుని చల్లపల్లి అభివృద్ధికి ఆయన తమ ఎంపీ లాడ్స్ ద్వారా రూ.50 లక్షలు కేటాయించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాదులో డా.డి.ఆర్.కె.ప్రసాదు, డాక్టర్ పద్మావతి కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రకాశం: పెద్దారవీడు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరించే స్వర్ణ రథాలను స్థానిక టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. గ్రామాల పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని, తడి చెత్త-పొడి చెత్త విడివిడిగా సేకరించి తమ ఇండ్ల వద్దకే వస్తున్న స్వచ్ఛ రథాలలో వేసి పరిశుభ్రతకు సహకరించాలన్నారు.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత డిసెంబర్లో నిర్వహించిన 2/2 బీపీఈడీ (మూడో సెమిస్టర్) రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి శివప్రసాదరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ఫలితాలను, రీవాల్యుయేషన్ మరియు ఫీజు చెల్లింపు వంటి ఇతర పూర్తి వివరాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో చూడొచ్చన్నారు.
పెద్దపల్లి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పుష్పలత అనే మహిళ స్థానిక శాంతినగర్ కాలనీ వీధి రోడ్డుపై చేపడుతున్న అక్రమ కట్టడాలను తొలగించాలని కలెక్టర్కు ఆర్జీ సమర్పించారు. ఇది వరకు ఫిర్యాదులు ఉన్నప్పటికీ చాటు మార్గంగా నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మునిసిపల్ కమిషనర్కు లేఖ రాస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.