KMR: జుక్కల్ మండల కేంద్రంలోని ఆలయానికి సంబంధించిన 3 పెద్ద ఆవులను, 9 ఆవు దూడలు ఎవరో గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారని జుక్కల్ గ్రామస్తులు ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. జుక్కల్ మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయ ఆవులు అపహరణకు గురయ్యాయని అన్నారు. 9 ఆవుల విలువ దాదాపుగా రూ. 90 వేలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
PLD: రొంపిచర్ల మండలం వి.రెడ్డిపాలెం ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రిన్సిపాల్ డా.రవినాయక్ ప్రకటన చేశారు. 5వ తరగతి చదువుతున్న వారు దీనికి అర్హులు. ఫీజు ఓసీ, బీసీలకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.125. దరఖాస్తుకు ఈ నెల 31 ఆఖరు తేదీ. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష ఉంటుంది.
AKP: వీ.మాడుగుల(మం) జాలంపల్లి పంచాయతీలో మంగళవారం గిరిజనులు ఆందోళన చేపట్టారు. జీడి పిక్కలకు కేజీ రూ.200 మద్దతు ధర ప్రకటించి, రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 80 కేజీల బస్తాకు రూ.18,000 ఇవ్వాలని కోరారు. జీడి కార్పొరేషన్ ఏర్పాటు, పంట రుణాలు, భీమా, ప్రాసెసింగ్ యూనిట్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
కోనసీమ: మండపేట మండలం ఇప్పలపాడు గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీ లోకి చేరికలు హాస్యాస్పదంగా ఉన్నాయని జిల్లా వైసీపీ పార్టీ ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు పేర్కొన్నారు. గోరంత దానిని కొండంతగా తెలుగుదేశం పార్టీ నాయకులు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పనపాడు గ్రామంలో వంద మందికి పైగా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు చేస్తున్న ప్రచారం బూటకమన్నారు.
ప్రకాశం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను సచివాలయంలో మంగళవారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల చర్ల జనార్ధన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలు నియోజకవర్గం మరియు ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం స్పందిస్తూ, ప్రకాశం జిల్లా అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.
HNK: నడికూడ (M) చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను ఇస్రో సైంటిస్ట్ అనుమాండ్ల సుకృత సందర్శించారు. సుకృత మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు పిల్లలకు చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథంతో విద్యాబోధన చేయాలని, అప్పుడే విద్యార్థులలో కొత్త ఆలోచనలు వస్తాయని, విద్యార్థుల పరిశోధనలే దేశ ప్రగతికి సోపానాలవుతాయని అన్నారు. ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.
TG: రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల ప్రమాద బీమా, ఆరోగ్య పథకాలు అమలు చేస్తామని వెల్లడించింది. మొత్తం 652 ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్సలు, 1,998 వ్యాధులకు క్యాష్ లెస్ సదుపాయం కల్పించినట్లు పేర్కొంది. దీంతో ఉద్యోగ, పెన్షనర్ సంఘాల నేతలు CM రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీకాకుళంలోని పలు ప్రాంతాల్లో అతిసారం కేసులు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ నేతృత్వంలో వైద్య, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ఇంటింటి సర్వే నిర్వహించారు. 24 గంటల అంబులెన్స్ సదుపాయం, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 52 కేసులు నమోదైనట్లు తెలిపారు.
CTR: జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది విస్తృత స్థాయిలో “విజిబుల్ పోలీసింగ్” కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన కూడళ్లలో, సెంటర్లలో, మార్కెట్ ప్రాంతాల్లో, పోలీసులు ప్రజలతో మమేకమై రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం వంటి అంశాలపై ప్రత్యేకంగా సూచనలు ఇచ్చారు.
HYD: జీహెచ్ఎంసీ పరిధిలో 4500 స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తున్నట్లుగా కమిషనర్ కర్ణన్ తెలిపారు. 18,557 మంది శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నారని, నగరంలో రోజుకు 7,810 టన్నుల గార్బేజి విడుదలవుతున్నట్లు TG చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకి సమాచారం అందించారు. GHMC వ్యాప్తంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, దర్శకుడు శివ కాంబినేషన్లో వచ్చిన ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ వంటి చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ కాంబో మరో ప్రాజెక్ట్తో రాబోతోంది. అజిత్తో మరో సినిమా తీయబోతున్నట్లు శివ తాజాగా ప్రకటించాడు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తానని పేర్కొన్నాడు.
KDP: ఇవాళ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 97 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మంగళవారం జిల్లాలో 62 కేంద్రాల్లో 15,159 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 14,777 మంది విద్యార్థులు హాజరయ్యారు. 382 మంది గైర్హాజరయ్యారు. ఇందులో 14,011 మంది జనరల్ విద్యార్థుల్లో 13,691 మంది హాజరవ్వగా.. 320 మంది గైర్హాజరయ్యారు.
RR: కేశంపేట మండలం కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల సందర్భంగా కొత్తపేటలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని కేశంపేట ఎంపీడీవో రవిచంద్ర కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయని, విద్యార్థులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా పరీక్షలు రాయాలన్నారు.
RR: నందిగామ కన్హ శాంతి వనంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఇండియా స్కిల్ రిజనల్ కాంపిటీషన్ నేడు ముగింపుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్తో పాటు నగదు ప్రోత్సాహం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత విద్యతో పాటు ఏదో ఒక కొత్త రంగంలో నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు.
W.G: భీమవరం కలెక్టరేట్ నుంచి మంగళవారం రైల్వే కన్స్ట్రక్షన్ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులతో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అనుమతులు లభించిన నవాబ్ పాలెం (378), పత్తిపాడు (376), ఆరుగొలను (379) లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిల (RUB) నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.