కోనసీమ: రాజోలులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్థానిక నాయకులు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పరిశీలించి సభ్యత్వం పొందడం వలన జనసేన పార్టీ అభిమానులకు రూ.5 లక్షల జీవిత భీమా లభిస్తుందని, పార్టీ పదవులలో సభ్యత్వం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
నిరంతరం కళ్లజోడు ధరించడం వల్ల ముక్కుపై ఏర్పడే నల్లటి మచ్చలను సహజ చిట్కాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. కలబంద రసం లేదా కలబంద జెల్ను మచ్చలు ఉన్న చోట అప్లై చేయాలి. కీరా, బంగాళాదుంప, టమాటా రసాలను కలిపి రాసి, ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. నారింజ తొక్కల పొడిలో పాలు లేదా పెరుగు కలిపి ప్యాక్లా వేసుకుని కొంతసేపటికి క్లీన్ చేస్తే బెటర్.
TPT: నారాయణవనం మండలం తుంబూరు గ్రామపంచాయతీలో పథక సంచాలకులు పంట కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఉపాధి శ్రామికులకు 310 మంది వరకు పనులు వచ్చే విధంగా మార్కింగ్ ఇవ్వాలని, పనులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రతి శ్రామికుడు వంద రోజుల ఉపాధిని పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో హోలీ పండుగ సందడి మొదలైంది. మంగళవారం స్థానిక బస్టాండ్ వద్ద న్యాచురల్ రంగుల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. వివిధ రకాల రంగులు, పిచుకారులు, పిల్లల కోసం ప్రత్యేక వస్తువులతో వ్యాపారులు ఆకట్టుకుంటున్నారు. హోలీ సందర్భంగా కొనుగోలుదారులతో మార్కెట్ కిటకిటలాడుతోంది.
TG: CM రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థికస్థితిపై శ్వేతపత్రం విడుదలకు డిమాండ్ చేశారు. బడ్జెట్కు ముందు వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని తెలిపారు. కేంద్రం ఇప్పటివరకు రూ.12 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని చెప్పారు. BRS, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందన్నారు. రాష్ట్ర ఖజానా నిల్.. కాంగ్రెస్ నేతల జేబులు ఫుల్ అని విమర్శించారు.
నాగర్కర్నూల్ పట్టణంలోని ప్రైవేట్ స్కానింగ్ కేంద్రంలోని మూత్రశాలలో మైనర్ ప్రసవించిన ఘటన కలకలం రేపింది. పుట్టిన శిశువును చెత్తబుట్టలో వేయడానికి బాలిక తల్లి ప్రయత్నించగా సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం బాలింతను, శిశువును పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై భరోసా కేంద్రం నిర్వాహకులు చేపట్టారు.
లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం వాయిదా పడింది. మార్చి 6, 2026న విడుదల కావాల్సిన ఈ సినిమా సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా.. ఎక్కడా రాజీపడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఈ చిత్రాన్ని తాతినేని సత్య తెరకెక్కించగా.. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు.
AP: మంగళగిరిలో నిర్వహించిన ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. వన్యప్రాణులను కాపాడేందుకు హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టు ప్రారంభించారు. రాష్ట్ర అటవీశాఖ చరిత్రలో ఇదో కీలక అడుగని తెలిపారు. వన్యప్రాణులు, మనుషుల మధ్య సంఘర్షణ తగ్గించేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు పవన్ వెల్లడించారు.
KDP: ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మైదుకూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, వెంకట సుబ్బయ్య కాలనీ, సుందరయ్య నగర్ ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి, వాహన పత్రాలు లేని 21 బైకులు, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నేరాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.
AKP: కోటవురట్ల మండల సర్వసభ్య సమావేశం ఈనెల 9వ తేదీన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటలకు ఎంపీపీ అప్పలనాయుడు అధ్యక్షతన జరిగే సమావేశానికి ఎంపీటీసీలు సర్పంచ్లను ఆహ్వానించడం జరిగిందని అన్నారు. అలాగే అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని కోరారు.
ADB: నార్నూర్ మండలంలోని ఎంపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైనే చేరి తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. ఇళ్ల ముందు చెత్త, మురుగు నిల్వ ఉండటంతో ప్రజలు రోజూ ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారి రహదారులు నడవలేని స్థితికి చేరుతుందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కొరారు.
RR: చౌదరిగూడపరిధిలోని ఓ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత బ్యానర్ను MEO స్టేటస్ పెట్టడాన్ని ఖండిస్తున్నామని SFI RR జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో డిప్యూటేషన్ పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రైవేటు స్కూలుకు MEO వత్తాసు పలికితే తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను ఏ విధంగా నమ్ముతారన్నారు. MEOపై చర్యలు తీసుకోవాలన్నారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయాన్ని మంగళవారం చంద్రగ్రహణం కారణంగా తాత్కాలికంగా మూసివేశారు. ఆలయ ఈవో రమణారెడ్డి సమక్షంలో ఉదయం 9 గంటలకు ఆలయ ద్వారాలను మూసి ముద్ర వేశారు. రాత్రి 7 గంటలకు ఆలయ శుద్ధి కార్యక్రమం అనంతరం భక్తులకు స్వామి దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
NRML: నిర్మల్ పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన హోలీ వేడుకల్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల పాల్గొన్నారు. పోలీసు సిబ్బందికి, అధికారులకు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీవితం రంగుల మయంగా ఉండాలని ఈ పండుగ అందరి జీవితాల్లో రంగులు పూయాలని తెలిపారు.
MBNR: గండీడ్ మండల కేంద్రంలోని రైతువేదికలో ఏవో జీ. రాధమ్మ ఆధ్వర్యంలో ఆత్మ సహకారంతో వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై అవగాహన సదస్సు జరిగింది. ఏఈవోలు సమత, వరలక్ష్మి, శివలీల, గౌతమి పాల్గొని పంటల దిగుబడి పెంపు, ఎరువుల సమతుల్య వినియోగం, వ్యాధి నియంత్రణపై సూచనలు ఇచ్చారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై సందేహాలు అడిగి నివృత్తి చేసుకున్నారు.