అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయాన్ని మంగళవారం చంద్రగ్రహణం కారణంగా తాత్కాలికంగా మూసివేశారు. ఆలయ ఈవో రమణారెడ్డి సమక్షంలో ఉదయం 9 గంటలకు ఆలయ ద్వారాలను మూసి ముద్ర వేశారు. రాత్రి 7 గంటలకు ఆలయ శుద్ధి కార్యక్రమం అనంతరం భక్తులకు స్వామి దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.