ATP: రాయదుర్గం నియోజకవర్గ YCP పరిశీలకులుగా డాక్టర్ బత్తల హరిప్రసాద్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడిగా ఉన్న ఆయనకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
సత్యసాయి: జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పబ్లిక్ పరీక్షల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపిస్తే చాలు.. ఎటువంటి ఛార్జీ లేకుండా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణించవచ్చు.
E.G: గృహ నిర్మాణ పనుల్లో క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, పనులు మరింత వేగవంతం చేయాలని రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. గురువారం కార్యాలయంలో వెలుగుబంద, కానవరం, నిడిగట్ల లేఅవుట్లలో నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా అధికారులు, గుత్తేదార్లు గృహాలను త్వరగా పూర్తి చేయాలన్నారు.
భారత్తో T20 WC సెమీస్లో అద్భుత ఇన్నింగ్స్(105) ఆడిన ఇంగ్లండ్ ప్లేయర్ జాకబ్ బెథెల్ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో తన ఫస్ట్ క్లాస్(టెస్ట్ ఫార్మాట్), లిస్ట్-A(వన్డే), T20 సెంచరీలను సాధించిన తొలి- ఏకైక క్రికెటర్గా నిలిచాడు. సాధారణంగా ప్లేయర్లు తమ తొలి సెంచరీ(3 ఫార్మాట్లు)ని డొమెస్టిక్, ఫ్రాంచైజీ క్రికెట్లో నమోదు చేస్తుంటారు.
JN: హైదరాబాద్లో ఉంటూ బైనాన్స్ యాప్ ద్వారా మ్యూల్ ఖాతాలు సృష్టించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న జనగామ జిల్లాకు చెందిన మహేష్ను పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. నిందితుడు నాలుగు బ్యాంకు ఖాతాల ద్వారా అక్రమ ఆర్థిక లావాదేవులు నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.
BDK: చండ్రుగొండలో గురువారం రాత్రి ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న 2లారీలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు ఇరు క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ క్రమంలో ఇద్దరు డ్రైవర్లు స్టీరింగ్ సీట్ల మధ్య ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులు క్యాబిన్ల నుంచి డ్రైవర్లను బయటకు తీసి చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు.
WG: ఇరగవరం మండలం తూర్పువిప్పర్రులో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచాను ఎస్సై జానా సతీష్ గురువారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామ శివారు నారాయణపురం గ్రామానికి చెందిన మామిడిశెట్టి శ్రీను తూర్పువిప్పర్రులో గోనెసంచుల ఫ్యాక్టరీలో బాణసంచా అక్రమంగా నిల్వ ఉంచినట్లు వచ్చిన సమాచారంతో ఈ దాడి చేశారు. ఈ మేరకు సుమారు రూ.30 వేలు విలువ చేసే బాణాసంచాను స్వాధీనం చేసుకున్నారు.
శ్రీకాకుళం ప్రభుత్వ ఐటీఐలో ఇవాళ ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అరవిందు ఫార్మా, అన్నపూర్ణ ఫైనాన్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ వంటి పలు సంస్థలు పాల్గొని, 230 ఖాళీలను భర్తీ చేయనున్నాయి.18–35 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అవసరమైన పత్రాలతో హాజరుకావాలని కోరారు.
కడప: నగరంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించి నిధులు విడుదల చేయాలని CM చంద్రబాబును MLA మాధవి రెడ్డి కోరారు. అమరావతిలో TDP పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డితో కలిసి MLA మాధవరెడ్డి సీఎంను కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులపై వినతిపత్రం అందజేశారు. కడప అభివృద్ధికి సహకరించాలని సీఎం దృష్టికి తీసుకొని వెళ్లారు.
MHBD: ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాల కేంద్రాల్లో ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు గురువారం బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అభివృద్ధి ప్రదాతకు రాజ్యసభ ఖరారు చేయడం చాలా ఆనందంగా ఉందని పలువురు కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
NGKL: కుమ్మేరలో పెత్తందారుల దాడిలో పసిపాప మృతి చెందిన ఘటనపై ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రజక సామాజిక ప్రజాసంఘాల JAC ఆధ్వర్యంలో నిర్వహించిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ట్యాంక్ బండ్ వద్ద ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు, అరెస్ట్ చేసి లేక్ వ్యూ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు.
ASF: జిల్లాలోని ఇంటర్ మీడియట్, పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు టెలిమానస్ సేవలు ఎంతో ఉపయోగపడతాయని DMHO సీతారాం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు మానసికంగా ఎలాంటి ఒత్తిడులకు లోను కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టెలి మానస్ సేవలను ప్రారంబించడం జరిగిందన్నారు.
కర్నూలు: జిల్లాలో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మహిళా దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. మహిళా పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళలకు ప్రశంసా పత్రాలు అందచేసి సన్మానించాలని సూచించారు.
VZM: నియోజకవర్గాల్లో MLAలు గుర్తించిన పనులు, ప్రాజెక్టులపై శాఖల వారీగా నివేదికలు సమర్పించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఆయా పనులకయ్యే ఖర్చు, లబ్ధి పొందే ప్రజల వివరాలతో పాటు ఇప్పటికే మంజూరై నిధులు రాని పనుల వివరాలను కూడా సమర్పించాలని సూచించారు.
WGL: జిల్లాలో టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గురువారం సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి 7,840 పొలం బాట, 938 ప్రజాబాట కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ఆన్లైన్ బిల్లుల చెల్లింపుతో పాటు 79016 28348 వాట్సాప్ చాట్ సేవను అందుబాటులోకి తెచ్చారు.