WNP: మదనాపురం మండలం ఆత్మకూర్- మదనాపూర్ గ్రామాల మధ్య ఉన్న 90 ఏ నంబర్ రైల్వే గేటును ట్రాక్ మరమ్మతుల కారణంగా ఇవాళ్టి నుంచి ఈనెల 8 వరకు మూడు రోజులు మూసివేయనున్నట్లు రైల్వే అధికారి ప్రవీణ్, వనపర్తి రోడ్డు స్టేషన్ మాస్టర్ రామకృష్ణ తెలిపారు. ఈ కారణంగా సమీప గ్రామాల ప్రజలు, రైతులు, విద్యార్థులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
NLR: ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు DEO బాలాజీరావు తెలిపారు. గురువారం కందుకూరు వచ్చిన ఆయన పక్కా ప్రణాళికతో లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 6 తేదీ నుంచి 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు.
MBNR: పురపాలక కమిషనర్ రామానుజులు రెడ్డిని మహబూబ్నగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యవర్గ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్నగర్ కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రవీణ్, రమేష్, కమిటీ కార్యవర్గ సభ్యులు అంజయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 19న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని 17వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. దీంతో 17న వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.
BPT: జిల్లాలో ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని గురువారం కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో 3 వేల మందితో, ప్రతి నియోజకవర్గంలో 500 మందితో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వేడుకల్లో భాగంగా వివిధ శాఖల స్టాల్స్, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
AP: రాష్ట్రంలోని ఆశావర్కర్లకు కొత్త ఫోన్లు, రెండు కొత్త చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. NHM ప్రకారం ఇతర ఉద్యోగుల మాదిరి లాగానే ఇకపై సెలవులు ఇస్తామని ప్రకటించారు. దహన సంస్కారాలకు రూ.15 వేలు, బీమా సౌకర్యం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. 1363 ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు.
GNTR: సచివాలయంలో గురువారం ‘ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్’ క్యాలెండర్, డైరీని మంత్రి సవిత ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు అందేలా చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.
ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని మాచవరం వద్ద గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి చెందాడు. మృతుడు పిడుగురాళ్లకు చెందిన సాతులూరి రాంబాబు (45)గా స్థానికులు గుర్తించారు. ఈయన గత కొంతకాలంగా పచ్చాకు కూలీగా పనిచేస్తున్నాడు. స్థానికులు ఫిర్యాదు మేరకు పోలీసులు చేరుకొని మృతదేహాన ప్రభుత్వ వైద్యశాలను తరలించారు.
ఫ్యాటీ లివర్ ఇప్పుడు సాధారణ సమస్యగా మారింది. ఇది కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల ఉత్పన్నమవుతుంది. కాలేయం సరిగ్గా పనిచేయకపోతే, మొత్తం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శరీరంలో విషపదార్థాల స్థాయిలు పెరుగుతాయి. నారింజ, నిమ్మకాయ, బత్తాయి, కమలాఫలం వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. కాలేయాన్ని విష పదార్థాల నుంచి రక్షిస్తాయి.
ప్రకాశం: వెలిగండ్ల మండలం మొగులూరులో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాటి శ్రీనివాసులు రెడ్డి (60) అనే వృద్ధుడిపై అతని సొంత కుమారుడు భాస్కర్ రెడ్డి (ఆర్మీ జవాన్) విచక్షణ రహితంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తీవ్ర గాయాలపాలైన శ్రీనివాసులు రెడ్డిని కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్తి కోసమే భాస్కర్ రెడ్డి తండ్రిపై దాడి చేశాడు.
TG: గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ఆయన 1952లో గోరఖ్పూర్(UP)లో జన్మించారు. 1983లో BJPలో చేరారు. 1989, 91, 93, 96లో గోరఖ్పూర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2016-2022 వరకు యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2017-19 వరకు నరేంద్ర మోదీ క్యాబినెట్లో ఆర్థికశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 2023 నుంచి హిమాచల్ గవర్నర్గా ఉన్నారు.
‘మృత్యుంజయ్’ ప్రీమియర్ షోకి వచ్చిన వారి స్పందన చూశానని, అందరూ ఎంజాయ్ చేశారని హీరో శ్రీవిష్ణు తెలిపాడు. సిినిమా చూశాక ప్రేక్షకులు కూడా ఎంజయ్ చేస్తారని, రాజమౌళి నుంచి ఈ సినిమా చూశాక ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారని అన్నారు. రాజమౌళి నుంచి మా సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయిందన్నాడు. NTR ట్రైలర్ రిలీజ్ చేశారని, నానీ తమ మూవీ చూసి మెచ్చుకున్నారని గుర్తుచేశాడు.
1913: సినీ నటుడు కస్తూరి శివరావు జననం1917: మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు జననం1919: సాహితీవేత్త గడియారం రామకృష్ణశర్మ జననం1933: సినీ నటి కృష్ణకుమారి జననం1984: హీరో శర్వానంద్ జననం1995: స్వాతంత్య్ర సమరయోధుడు మోటూరి సత్యనారాయణ మరణం1997: హీరోయిన్ జాన్వీ కపూర్ జననం
T20 WC సెమీస్లో ఇంగ్లండ్పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘కీలకమైన మ్యాచుల్లో రాణించడం ఆనందంగా ఉంది. వాంఖడే పిచ్పై 250+ పరుగుల లక్ష్యాన్నైనా ఛేదించేందుకు ఆస్కారముందని అనిపించింది. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు జస్ప్రీత్ బుమ్రా అర్హుడని నా భావన. అతడు ప్రపంచ స్థాయి బౌలర్’ అని తెలిపాడు.
➠ తిథి: బహుళ తదియ సా.5:24 వరకు తదుపరి చవితి ➠ నక్షత్రం: హస్త ఉ.9:18 వరకు, తదుపరి చిత్త ➠ శుభ సమయాలు: ఉ.6:16-8:36, ఉ.10:11-11:10, మ.1:19-సా.4:04, సా.5:02-5:48 వరకు ➠ రాహుకాలం: ఉ.10:30-12:00 వరకు ➠ యమగండం: మ.3:00-4:30 వరకు ➠ దుర్ముహూర్తం: ఉ.8:37-9:24, మ.12:32-1:19 వరకు ➠ వర్జ్యం: సా.5:49-రా.7:32 వరకు ➠ అమృత ఘడియలు: తె.4:03 నుంచి 5:46 వరకు