ATP: జిల్లా వర్కింగ్ జర్నలిస్టులకు ఈ నెల 17న ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నిత్యం కంప్యూటర్లపై పని చేయడం వల్ల జర్నలిస్టులకు కంటి సమస్యలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NGKL: తాడూర్ మండలం నాగదేవపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధిలో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు ప్రభుత్వం గ్రామ స్థాయిలో సౌకర్యాలను పెంచుతున్నదని తెలిపారు.
RR: శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో మెరుగైన మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేసామని PAC ఛైర్మన్ గాంధీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ఆల్విన్కాలనీ డివిజన్ వాంబే గృహ సముదాయంలో రూ.37.50 లక్షల అంచనాతో నూతనంగా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఆయనతో పాటు మాజీ కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్, జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు.
AP: సీఎం చంద్రబాబుపై ప్రతి కేసును రీ ఓపెన్ చేయించి తీరుతానని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ అన్నారు. ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్లా అమ్మేస్తున్నారని, ఇది అన్యాయమని ప్రశ్నించిన తనపై కేసులు పెడుతున్నారని వాపోయారు. తన బినామీలకు ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిలో అతిపెద్ద భాగస్వామి పవన్ కళ్యాణ్ అంటూ ధ్వజమెత్తారు.
జగిత్యాల పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో గురువారం 2026-27 బడ్జెట్ సమావేశం మున్సిపల్ ఛైర్ పర్సన్ తమిళనాడు వాణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు బాధ్యతాయుతంగా పని చేయాలని, వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
SRD: డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలట్గా జిల్లా ఎంపికైనట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. సమావేశంలో కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు.
MDK: గ్రామపంచాయతీ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి సమస్యలు పరిష్కరించాలని గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు కడారి నర్సమ్మ కోరారు. గురువారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు.
KNR: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని, విధులు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి గ్రామాల స్వయం సమృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాలోని సర్పంచులకు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
NLG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా చిట్యాల మండలం నేరడలో గురువారం మటన్, చికెన్ షాపుల వద్ద పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధంపై దుకాణ దారులకు సర్పంచ్ మిర్యాల వెంకటేశం, ఉప సర్పంచ్ మిర్యాల మహేందర్ తగు సూచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు గ్రామస్తులు సహకరించాలని కోరారు.
విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుంచి 10 వరకు ఐదు రోజుల వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను గురువారం ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కే. రాంబాబు పాల్గొన్నారు.
తిరుపతిలో తీతీదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్, చీర్ల చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. AD బిల్డింగ్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఎండకాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు.
BPT: అద్దంకి మండలంలో విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం ప్రాముఖ్యత, వ్యాధుల నివారణ వంటి అంశాలపై వివరించారు. ప్రతిరోజూ శుభ్రత పాటించడం, సమయానికి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని విద్యార్థులకు సూచించారు.
GDWL: 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణలో భాగంగా ఇవాళ జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గుచూపాలని, ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆదాయం పెంచుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. ప్రభుత్వ రాయితీలు, పథకాలపై ప్రజా ప్రతినిధులకు ఆయన వివరించారు. అలాగే పీఎం ధనధాన్య యోజన ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
KDP: ప్రొద్దుటూరులో రిపోర్టర్ల వేధింపులు తట్టుకోలేక బియ్యం వ్యాపారి నజీర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. నిద్రమాత్రలు మింగిన ఆయనను ప్రాణాపాయ స్థితిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యూట్యూబ్, టీవీ ఛానెల్ రిపోర్టర్లు, ఓ హోంగార్డు డబ్బుల కోసం వేధిస్తున్నారని సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు సమాచారం.
KNRL: విద్యార్థులు అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని సెట్కూర్ సీఈవో డాక్టర్ వేణుగోపాల్ సూచించారు. గురువారం ఉలిందకొండలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అని అడిగి తెలుసుకున్నారు. బాలికల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని అయన తెలిపారు.