KNRL: విద్యార్థులు అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని సెట్కూర్ సీఈవో డాక్టర్ వేణుగోపాల్ సూచించారు. గురువారం ఉలిందకొండలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అని అడిగి తెలుసుకున్నారు. బాలికల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని అయన తెలిపారు.