• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

1300 పోస్టులు.. రెండ్రోజులే గడువు!

ఐడీబీఐ బ్యాంకు 2026-27 సంవత్సరానికి దేశవ్యాప్తంగా 1,300 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిలో జూనియర్ అసిస్టెంట్ మేనేజ‌ర్ గ్రేడ్ ‘O’ 1100 పోస్టులు, 200 అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘A’ ఖాళీలున్నాయి. హైదరాబాద్ జోన్లో 65 పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు మార్చి 19లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

March 17, 2026 / 01:08 PM IST

AP PGECET దరఖాస్తు గడువు పొడిగింపు

AP PGECET-2026 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు మార్చి 20లోపు రిజిస్ట్రేషన్‌లు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మొదట మార్చి 16 వరకు గడువు పొడిగించగా తాజాగా మరో అవకాశం ఇచ్చింది. అభ్యర్థులకు ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో ప్రవేశ పరీక్ష జరుగనుంది.

March 17, 2026 / 11:08 AM IST

ఐవోసీఎల్‌ రిఫైనరీస్‌లో అప్రెంటిస్ ఖాళీలు

అతిపెద్ద భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, రిఫైనరీస్‌లో 109 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. బొంగైగావ్, గౌహతి రీజియన్‌లలో ట్రేడ్ అప్రెంటిస్/టెక్నీషియన్ అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థులు మార్చి 22లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.

March 17, 2026 / 10:52 AM IST

దేశంలోనే టాప్‌-10 రుణ ఎగవేతదారులు వీరే

దేశంలో బ్యాంకులకు టాప్-10 ఉద్ధేశపూర్వక ఎగవేతదారుల నుంచి రూ.40,635 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ జాబితాలో ABG షిప్‌యార్డ్ (రూ.6,695 కోట్లు), గీతాంజలి జెమ్స్(రూ.6,236 కోట్లు), బీటా నాప్తాల్(రూ.5,268 కోట్లు), రాకేష్ కుమార్ కుల్దీప్ వాధ్వాన్(రూ.4,291 కోట్లు) ఉన్నట్లు ఆమె వెల్లడించారు.

March 17, 2026 / 10:32 AM IST

ALERT: రైల్వేలో 11,127 ఉద్యోగాలు

నిరుద్యోగులకు భారత రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా RRB ఆధ్వర్యంలో మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్(ALP) పోస్టులను భర్తీ చేయనున్నారు. 2026 మే 15 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. దరఖాస్తులకు చివరి తేది 2026 జూన్ 14. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. RRB అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

March 17, 2026 / 08:43 AM IST

కొత్త లేబర్ కోడ్‌ల వల్ల భద్రత కరవు: IFTU

GDWL: కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కార్మికుల మౌలిక హక్కులను కాలరాస్తున్నాయని ఐఎఫ్టీయూ గద్వాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్ అన్నారు. సోమవారం గద్వాల కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన అనంతరం ఆయన కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. దీనివలన కాంట్రాక్ట్ విధానం పెరిగి కార్మికులకు భద్రత కరువవుతుందన్నారు.

March 16, 2026 / 05:01 PM IST

శ్రీ చౌడేశ్వరి జ్యోతుల మహోత్సవానికి ఎస్సైకు ఆహ్వానం

సత్యసాయి: సోమందేపల్లి మండలంలో ఈనెల 20న శ్రీ చౌడేశ్వరి మాత పంచమ జ్యోతుల మహోత్సవం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ ధర్మకర్త ఈశ్వరయ్య సోమవారం మండల ఎస్సై రమేశ్ బాబును మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వానించారు. జ్యోతుల మహోత్సవం వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయనను కోరారు.

March 16, 2026 / 03:20 PM IST

రైల్వేశాఖలో భారీగా ఉద్యోగాలు

అప్రెంటిస్ ఖాళీల భర్తీకి  రైల్వేశాఖ(SCR) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,801 యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల కోసం APR 11లోగా దరఖాస్తు చేసుకోవాలి. కనీసం 50శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (NCVT/SCVT) సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ముందుగా (RDAT/NAPS) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ పోస్టులకు అప్లై చేయాలి.

March 16, 2026 / 03:04 PM IST

స్టార్‌లింక్ ఇప్పుడు కువైట్‌లో: మస్క్

స్టార్‌లింక్ ఇప్పుడు కువైట్‌లో అందుబాటులో ఉందని ఎలాన్ మస్క్ తెలిపారు. పశ్చిమాసియాలో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ నెట్వర్క్ పరిధిని విస్తరిస్తుందని ప్రకటించారు. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. అధికారిక స్టార్‌లింక్ ఖాతా కూడా కువైట్ మ్యాప్‌ను షేర్ చేస్తూ దీనిని ధృవీకరించింది. దీంతో అక్కడ హై-స్పీడ్ ఇంటర్నెట్ నెట్‌వర్క్ పరిధి మరింత విస్తరించనుంది.

March 16, 2026 / 02:22 PM IST

ఫోన్‌పే IPO వాయిదా

ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే తన ఐపీఓను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత మార్కెట్ ఒడుదొడుకుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ సీఈఓ వెల్లడించారు. ప్రపంచ మార్కెట్లు స్థిరపడిన తర్వాతే స్టాక్ మార్కెట్ లిస్టింగ్ ప్రక్రియను చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, సరైన సమయం కోసం వేచి చూడాలని సంస్థ భావిస్తోంది.

March 16, 2026 / 02:00 PM IST

రంజాన్ తోఫా పంపిణీ చేసిన మున్సిపల్ ఛైర్ పర్సన్

MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ 4వ వార్డులో గౌస్-ఏ -ఆజాం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం రంజాన్ తోఫా పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ ఛైర్ పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు హాజరై ముస్లిం సోదరిమణులకు తోఫా అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా అందిస్తున్న ముక్తార్ సామాజిక స్పృహ ఆదర్శనీయమన్నారు.

March 16, 2026 / 01:05 PM IST

మంట పుట్టిస్తున్న వంట నూనె ధరలు

వంట నూనె ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. గల్ఫ్ యుద్ధం ప్రభావంతో సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ ధర రూ.152 నుంచి ఆన్‌లైన్‌లో ఏకంగా రూ.178కి చేరింది. ఆఫ్‌లైన్‌లోనూ రూ.168 వరకు విక్రయిస్తున్నారు. ఇక పల్లీ నూనె లీటర్ రూ.220 పైనే పలుకుతోంది. సప్లై తగ్గడంతో సూపర్ మార్కెట్లు, కిరాణా షాపుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి.

March 16, 2026 / 12:54 PM IST

‘ప్రపంచ వృద్ధి రేటు పతనం.. పెరగనున్న ద్రవ్యోల్బణం!’

చమురు ధరల పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని IMF మాజీ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ హెచ్చరించారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం 60 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని, వృద్ధి రేటులో 0.4% తగ్గుదల ఉండవచ్చని అంచనా వేశారు. ఇరాన్ యుద్ధం వేళ ప్రస్తుత పరిస్థితులు ఆర్థిక మందగమనానికి దారితీస్తాయని ఆమె విశ్లేషించారు.

March 16, 2026 / 10:37 AM IST

APPLY NOW: నేటి నుంచే దరఖాస్తులు

TG: రాష్ట్రంలో 93 KGBVల్లో ఇంటర్ ప్రవేశాలకు ఇవాళ్టి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు APR 15 వరకు TGRJC CETకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.200. ప్రవేశ పరీక్ష మే 3వ తేదీన జరగనుంది. KGBVల్లో సీట్లు పొందిన బాలికలకు JEE, NEET, క్లాట్, EAPCET తదితర ప్రవేశ పరీక్షలకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు.

March 16, 2026 / 07:50 AM IST

టెన్త్ విద్యార్థులకు ALL THE BEST

AP: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో 10 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. విద్యార్థులు హాల్‌టికెట్ చూపించి RTC బస్సుల్లో పరీక్షా కేంద్రాలకు ఉచితంగా చేరుకోవచ్చు. విద్యార్థులకు ALL THE BEST

March 16, 2026 / 06:39 AM IST