రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పారామెడికల్ పోస్టులకు సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసింది. ఈ పరీక్షలు మార్చి 11, 12, 13 తేదీలలో జరగనున్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పరీక్షలు నేటి నుండి మార్చి 13 వరకు జరగనున్నాయి. అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని బోర్డు సూచించింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ సాయంత్రం బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఉదయంతో పోల్చితే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.980 తగ్గి రూ.1,61,130కు చేరగా, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.900 తగ్గి రూ.1,47,700గా నమోదైంది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
TG: తెలంగాణలో ఇటీవల గ్రూప్-1 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులే.. ఇవాళ విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో చాలా మంది సత్తా చాటారు. గుడెల్లి సృజన గ్రూప్1 లో డీఎస్పీ పదవి సాధించి.. ఇప్పుడు యూపీఎస్సీలో 55వ ర్యాంకుతో మెరిసింది. కొలిపాక శ్రీ కృష్ణ 150వ ర్యాంకు, ఎం. వెంకటేష్ 358వ ర్యాంకు, బి. విక్రమ్ 472వ ర్యాంకు, విక్రమ్ సింహా రెడ్డి 541వ ర్యాంకు, నవీన్ 715వ ర్యాంకు సాధించారు.
దేశ అత్యున్నత ఉద్యోగమైన సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అనూజ్ అగ్నిహోత్రి మొదటి ర్యాంకుతో మెరిశాడు. రాజేశ్వరి సువే రెండో ర్యాంకు, ఆకాన్ష్ ధుల్ మూడో ర్యాంకు సాధించగా.. రాఘవ్ ఝన్ఝన్ వాలాకు నాలుగో ర్యాంకు వచ్చింది. తెలుగువారిలో సృజన 55వ ర్యాంకు, DSK ప్రచేత్ 193, వర్షిత్ రెడ్డికి 259, పవన్ కుమార్ రెడ్డి 297వ ర్యాంకు సంపాదించాడు.
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరొలా.. తన ఎడ్జ్ 70 ఫ్యూజన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 7S జెన్ 4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత హోలోయూఐ, 6.78 అంగుళాల సూపర్ HD 1.5K అమోలెడ్ డిస్ ప్లే, 144Hz, వెనక వైపు 50 MP+13 MP కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరా, 7000mah బ్యాటరీతో వస్తుంది. 8GB+128GB వేరియంట్ ధరను రూ.26,999గా కంపెనీ నిర్ణయించింది.
టాటా మెమోరియల్ సెంటర్(TMC)లో 3 క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినెన్స్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి గడువు ఇవాళ్టితో ముగియనుంది. బీ ఫార్మాసీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గల 35 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.27,000 జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ షాక్ ఇచ్చింది. రిలయన్స్ పవర్తో పాటు దాని అనుబంధ సంస్ధలపై ఈడీ ఏకకాలంలో దాడులు చేసింది. నగదు అక్రమ చలామణి కేసులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సోదాలు పూర్తయిన తర్వాత ఈడీ అధికారిక ప్రకటనను విడుదలు చేసే అవకాశం ఉంది.
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(NCDC)లో 14 స్పెషలిస్ట్ గ్రేడ్-3(పబ్లిక్ హెల్త్) పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. డిప్లొమా, డిగ్రీ, MBBSలో ఉత్తీర్ణత గలవారు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గలవారు తమ అప్లికేషన్ను ఢిల్లీలోని NCDC కార్యాలయానికి ఆఫ్లైన్లో పంపాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.1,23,500 జీతంగా చెల్లిస్తారు.
సత్యసాయి: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 15న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. హిందూపురంలోని సప్తగిరి డిగ్రీ, పీజీ కళాశాలలో జరిగే ఈ మేళాలో 90కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 5,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. యువతీ యువకులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
TG: పదో తరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థుల హాల్ టికెట్లు విడుదలైన విషయం తెలిసిందే. విద్యార్థులు తమ హాల్ టికెట్లను 80969 58096 వాట్సాప్ నంబర్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ సేవలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. మొదటి రోజు 30 వేల మంది విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి, ఇంటర్తో పాటు 7-10 తరగతుల్లో మిగిలిన సీట్ల కోసం అర్హులైన బాలికలు ఏప్రిల్ 1 వరకు అప్లై చేసుకోవచ్చు. విద్యార్థుల సెలక్షన్ జాబితా ఏప్రిల్ 13న రిలీజ్ కానుండగా.. 13-17 తేదీల్లో వెరిఫికేషన్ జరుగుతుంది.
TG: డీఈఈసెట్కు సంబంధించి మే 21, 22 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. MAR 15 నుంచి APR 15 వరకు దరఖాస్తుల స్వీకరణ, APR 17, 18న ఎడిట్ ఆప్షన్, MAY 15 తర్వాత హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రైమరీ ‘కీ’ మే 25న, అదేరోజు అభ్యంతరాల స్వీకరణ. JUNE 1-6 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, JUNE 6-8 వెబ్ ఆప్షన్, 9న ఎడిట్ ఆప్షన్కు అవకాశం, 14న సీట్లు కేటాయిస్తారు.
న్యూయార్క్, షికాగో, నెవార్క్ నుంచి ముంబై, ఢిల్లీకి వచ్చే విమాన టికెట్ల ధరలు పెరిగాయి. న్యూయార్క్ (జేఎఫ్కే విమానాశ్రయం) నుంచి ఢిల్లీకి వచ్చే విమానాల్లో ప్రస్తుతం రూ.1.34 లక్షల నుంచి రూ.2.25 లక్షల వరకు ఉన్నాయి. సాధారణ రోజుల్లో రూ.45 వేల నుంచి రూ.లక్ష మధ్య ఉంటాయి. షికాగో-ముంబై రూట్లో టికెట్ ధరలు ఏకంగా 150 శాతం పెరిగి రూ.1.9 లక్షల నుంచి రూ.2.8 లక్షల వరకు చేరాయి.
కోణార్క్ రైల్వే కార్పొరేషన్ లిమిటేడ్లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్, డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మొత్తం 190 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 21లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు konkanrailway.comను సంప్రదించండి.
ఫిన్టెక్ సంస్థ ఫోన్పే, రాబోయే తొలి పబ్లిక్ ఆఫర్ కోసం సంస్థ విలువను దాదాపు రూ.81,000-94,500 కోట్లుగా పరిగణించాలని ఆశిస్తోంది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.10,000 కోట్లకు పైగా సమీకరించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2023లో ఫోన్పే 12 బిలియన్ డాలర్ల విలువ వద్ద, 100 మిలియన్ డాలర్లు సమీకరించింది.