TG: హనుమకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్లో పడి తల్లి, ఇద్దరు కూతుర్లు ప్రాణాలు కోల్పోయారు. ఐనవోలు మండలం పున్నెల్ క్రాస్ దగ్గర ఈ ఘటన జరగ్గా.. మృతులను ఫర్హత్(30), ఉమెరా(7), ఆయేషా(5)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పంజాబ్ చండిగఢ్లోని బీజేపీ కార్యాలయం ఎదుట భారీ పేలుడు సంభవించింది. పార్క్ చేసి ఉంచిన ఓ స్కూటీలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరిగింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
SRPT: రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడు జ్యోతుల రామకృష్ణ (54) మృతి చెందిన ఘటన నెలకొంది. సీఐ వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సూర్యాపేట నుంచి బొప్పారం వెళ్తుండగా అచ్యుత తండా సమీపంలో అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ బైక్ ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన రామకృష్ణ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
KMR: నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కీసరి శ్రీనివాస్ (25) ఉదయం కాలకృత్యాల కోసం స్థానిక ఊర చెరువు వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి సోదరుడు రాజారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
WNP: నాగవరం శివారులో అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో సభావత్ మన్యం (55) మృతి చెందాడు. సైకిల్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన అతడిని వనపర్తి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ భాస్కర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హృషికేష్ తెలిపారు.
TG: HYD మధురనగర్లోని ఓ బ్యాంక్లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో భవనం మొత్తం దట్టమైన పొగతో కమ్ముకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. కూకట్పల్లిలోని ఓ ఆసుపత్రిలో మృత శిశువు కలకలం రేపింది. వాష్రూమ్లో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం లభ్యమైంది. మగబిడ్డకు జన్మనిచ్చిన ఓ గర్భిణీ.. ఫ్లష్ ట్యాంక్లో పసికందును పడేసింది. ఘటనపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరులో సహజీవనం చేస్తున్న టెకీ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతుడిని TG సిద్దిపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుంట బాబురెడ్డి(31)గా గుర్తించారు. అతడు ఆత్మహత్య చేసుకున్న అనంతరం అతడితో సహజీవనం చేస్తున్న యువతి(31) సైతం బలవన్మరణానికి పాల్పడింది. వారు ఉంటున్న భవనంలోని 17వ అంతస్తుపై నుంచి ఆమె దూకి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
UPలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు ముఖేశ్ పటేల్కు ప్రయాగ్రాజ్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చారు. ఉరిశిక్షతో పాటు నిందితుడికి కోర్టు రూ.25,000 జరిమానా విధించింది. ఆ జరిమానా చెల్లించని పక్షంలో నిందితుడు ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది.
UPలోని అమ్రోహాలో అమానవీయ ఘటన జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని రూహి అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపింది. ఆహారంలో మత్తుమందు ఇచ్చి, గొంతు కోసి హతమార్చింది. ఎవరికీ అనుమానం రాకుండా దోపిడీ అని నమ్మించేందుకు రాత్రంతా శవం పక్కనే పిల్లలతో కలిసి నిద్రపోయింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. ప్రస్తుతం నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు.
NLR: బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష పడింది. సంగం మండలం మక్తాపురానికి చెందిన డి. బుజ్జిబాబుకు 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు, రూ. 42 వేల ఫైన్ విధిస్తూ జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్పు చెప్పారు. 2024 మార్చి 30వ తేదీన రాత్రి బుజ్జిబాబు బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు.
TG: హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులకు మరోసారి భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల నుంచి ఏకంగా రూ.25 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు.. డ్రగ్ నెట్వర్క్ కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.
బీహార్ నలంద జిల్లాలోని శీతలా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతి మంగళవారం మాదిరిగానే అమ్మవారిని పూజించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగ్గా.. మరో 12 మంది గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. సహాయకచర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మహిళలను మోసం చేస్తున్న శ్రీకాకుళం జిల్లా వాసి కె.లక్ష్మీ నాయుడును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ నరసింహ్మమూర్తి తెలిపారు. ఈ నెల 14న ఓ మహిళను హోటల్కు పిలిచి మత్తుమందు ఇచ్చి నగలు, నగదు, ఫోన్తో పరారయ్యాడు. అతనిపై 52 కేసులు, రెండు హత్య కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
AP: సైబర్ నేరగాళ్లు విజయవాడలోని 3 వేర్వేరు బ్రాంచుల్లో యాక్సిస్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టారు. ఏలూరు రోడ్, గుణదల, బెంజిసర్కిల్ బ్రాంచుల్లో ఫేక్ ఆధార్, అడ్రస్, పే స్లిప్స్తో బ్యాంకు ఖాతాలు తెరిచి.. క్రెడిట్ కార్డుల ద్వారా రూ.5.28 కోట్లు దోచేశారు. ఎంతకూ తీసుకున్న క్రెడిట్ రీపే చేయకపోవడంతో బ్యాంకు అధికారులు ఆయా అడ్రస్లకు వెళ్లగా.. అసలు విషయం బయటపడింది.