ATP: జనాభా లెక్కల సేకరణపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని జిల్లా రెవెన్యూ అధికారి మాలోల సూచించారు. అనంతపురం శ్రీనివాస్ నగర్లో బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి, ఇళ్ల గణన ప్రక్రియను పర్యవేక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికల కోసమే ఈ ప్రక్రియ చేపడుతున్నామన్నారు. ప్రజలు అధికారులకు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించాలని కోరారు.
KDP: కమలాపురం నూతన తహసీల్దార్గా పామిలేటి శ్రీనివాస రెడ్డి బుధవారం ఉదయం తన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక రెవెన్యూ అధికారులు, కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు రెవెన్యూ పరంగా తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా తనను కలవచ్చని తెలిపారు.
AKP: ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం వద్ద పెనుగొల్లు గ్రోయిన్ పునర్నిర్మాణ పనులకు ఎంపీపీ వెంకటలక్ష్మి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ పనులకు హోంమంత్రి వంగలపూడి అనిత రూ.99 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. పనులు పూర్తయితే 1,200 ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందన్నారు.
కృష్ణా: చల్లపల్లి మండలం కొత్తమాజేరు పల్లెపాలెంలో బుధవారం నూతన కమ్యూనిటీ హాలు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ఎంపీ లాడ్స్ నిధులు రూ.30 లక్షలతో ఈ భవనం నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పూజలు చేసి పనులు ప్రారంభించారు. మండలి వెంకట్రామ్, తోట కనకదుర్గ, విమల్ కృష్ణ, నాగార్జున పాల్గొన్నారు.
ASR: డుంబ్రిగుడ మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ టవర్లకు ఇంకా నెట్వర్క్ ప్రారంభం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ నాయకుడు వంతాల గురు నాయుడు అన్నారు. ఈ సమస్యపై బిఎస్ఎన్ఎల్ అధికారులకు వినతిపత్రం బుధవారం అందజేశారు. ఫైబర్ కేబుల్ తెగిపోవడం వల్ల ఆలస్యం జరిగిందని అధికారులు తెలిపారు.
ప్రకాశం: పొన్నలూరు మండలం మాలపాడు గ్రామంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. ఏదైనా ఇబ్బంది, అసౌకర్యం కలిగితే వెంటనే తల్లిదండ్రులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై సూచించారు.
కోనసీమ: వేసవిలో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండడం అవసరమని జిల్లా ఫైర్ ఆఫీసర్ పార్థసారథి అన్నారు. ఈ సంవత్సరం జనవరి నుండి నేటి వరకు 66 అగ్ని ప్రమాదాలు జరిగాయన్నారు. కోట్లల్లో నష్టం వాటిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు పలు ఆసుపత్రులు, పరిశ్రమలు తనిఖీలు చేసి, ప్రమాదాలు జరగకుండా పూర్తి అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
VSP: బొలిశెట్టి సత్యనారాయణకు జనసేన పార్టీతో ఎటువంటి సంబందం లేదని జనసేన కార్యలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బొలిశెట్టి తన వ్యక్తిగత సిద్ధాంతాలను అనుసరించి పదవి బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అంగీకరించినట్టు తెలిపింది. పర్యావరణానికి సంబంధించి హైకోర్టులో కొనసాగుతున్న పిల్ నేపథ్యంలో జనసేన నుంచి ఆయన వైదొలిగిన విషయం తెలిసిందే.
VZM: జిల్లా వ్యాప్తంగా మే 1 నుంచి 31 వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఆసక్తి గల గుర్తింపు పొందిన క్రీడా సంఘాలు, శిక్షకులు తమ ప్రతిపాదనలను ఈ నెల 28లోపు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో సమర్పించాలన్నారు. వివరాలకు 8074116276, 9491767327 నంబర్లను సంప్రదించాలని కోరారు.
SKLM: నిరుద్యోగులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాసలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్య శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళాను బుధవారం నిర్వహించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం జాబ్ మేళాలను నిర్వహిస్తుందన్నారు.
W.G. భీమవరం కొలువైన శ్రీ శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ వద్ద మహాలక్ష్మీ, నగేష్ పాల్గొని మాట్లాడుతూ.. 26 రోజులకు హుండీ లెక్కించగా రూ. 25,63,619 నగదు 30 గ్రాముల బంగారం, 55 గ్రాములు వెండి విరాళంగా లభించింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు.
KRNL: ఆస్పరి మండలంలో బుధవారం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పర్యటించారు. మండలంలోని గ్రామాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సమస్యలను ప్రజలు వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తమ సమస్యలు వినిపించుకున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు.
సత్యసాయి: సీఎ చంద్రబాబు దూరదృష్టితో హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు ఎడారి ప్రాంతాలకు చేరడంతో రాయలసీమ పచ్చని పంటలతో కళకళలాడుతోందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. బుక్కపట్నం మండలంలోని మారాల, సీకాయ కుంటపల్లి, కృష్ణాపురం గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించారు.
E,G: రంగంపేట మండలం చిన్న దొడ్డిగుంటలో మంచినీటి సమస్య పరిష్కారం కానుంది. అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సహకారంతో బోర్వెల్ యూనిట్ మంజూరైంది. బుధవారం రంగంపేట మండల తెలుగు యువత అధ్యక్షుడు వెలమర్తి సుధాకర్ చేతుల మీదుగా దీనికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో కొండేపూడి నాని, సూర్య భాస్కర రావు, త్రిమూర్తులు, బత్తుల శ్రీను, వరప్రసాద్ పాల్గొన్నారు.
ATP: పట్టపగలే గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లిన ఘటన గుత్తిలోని సుదర్శన్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద నెలకొంది. గ్యాస్ వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ లైన్లో నిలబడగా గుర్తు తెలియని వ్యక్తులు క్యూలైన్లో పెట్టిన గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లారు. బాధితులు జయమ్మ, లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.