• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చిలకలూరిపేటలో వీధి కుక్క బీభత్సం

PLD: చిలకలూరిపేట సుగాలి కాలనీలో మంగళవారం వీధి కుక్క దాడిలో ప్రవీణ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇంటి సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా కుక్క అకస్మాత్తుగా దాడి చేయడంతో ముఖం, పెదవులపై రక్తగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

March 24, 2026 / 12:19 PM IST

‘ఉద్యాన రంగంలో రాణించే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు’

మన్యం: ఉద్యానవన రంగంలో రాణించే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి ఉద్ఘాటించారు. విభిన్న రంగాల్లో మార్పు వచ్చినా ఉద్యాన రంగానికి తిరుగులేదని అన్నారు. మంగళవారం డా. వై.ఎస్.ఆర్.ఉద్యాన విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో పట్టణంలోని ఉద్యాన కళాశాల 12వ అంతర కళాశాల సంస్కృతిక, సాహిత్య సమ్మేళనం 2025-26 ఘనంగా ప్రారంభించారు.

March 24, 2026 / 12:18 PM IST

తాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలి: కమిషనర్

VZM: బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి మంగళవారం పట్టణంలోని పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో కాలువలలో ఉన్న పైపులను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. తాగునీరు కలుషితం కాకుండా మురుగునీటి కాలువలలో ఉన్న పైపులను తొలగించాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య పనుల్లొ నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

March 24, 2026 / 12:17 PM IST

ప్రభాకర్ రావును పరామర్శించిన ఎమ్మెల్యే

SKLM: కొత్తూరు మండలం బలద గ్రామానికి చెందిన ఇరింగిల ప్రభాకరరావు అనారోగ్యంతో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గ్లోబల్ న్యూరో కేర్ ఆసుపత్రిలో బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ప్రభాకరరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

March 24, 2026 / 12:15 PM IST

రాయదుర్గంలో వలకి చిక్కిన ఎలుగుబంటి

ATP: రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఓ గది బాత్రూంలో ఎలుగుబంటి చొరబడింది. అధికారులు చాకచక్యంతో బాత్రూం గడిని వేసి వలలో బంధించి కళ్యాణదుర్గంకు సురక్షితంగా తరలించారు. ఒక్కసారి ఎలుగుబంటి జనావాసంలో పల్చల్ చేయడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వలకు ఎలుగుబంటి చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

March 24, 2026 / 12:15 PM IST

హైవే కనెక్టివిటీ రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే

కృష్ణా: నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం వేగవంతం చేసినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ రామానగరంలో రూ. 45లక్షలతో నిర్మిస్తున్న హైవే కనెక్టివిటీ రోడ్డును పరిశీలించారు. ఉపాధి, సాస్కి నిధులతో నియోజకవర్గంలో గ్రామీణ రహదారులు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో పంచాయతీ రాజ్ శాఖ డీఈఈ పగడాల సురేష్ ఉన్నారు.

March 24, 2026 / 12:15 PM IST

నిరాహార దీక్షలో పాల్గొన్న UTF ఉపాధ్యాయులు

W.G: UTF రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అసెంబ్లీ కేంద్రాలు వద్ద ఒకరోజు నిరాహార దీక్షలో భాగంగా ఉండిలో UTF రణభేరిని మంగళవారం నిర్వహించింది. తక్షణమే 12 వ PRC వేసి IR 29 శాతం ప్రకటించాలని కోరుతూ నిరాహార చేస్తున్నట్టు UTF జిల్లా కార్యదర్శి P.క్రాంతి కుమార్, ప్రెసిడెంట్ విజయరామరాజు తెలిపారు. ఉండి, ఆకివీడు, పాలకోడేరు మండలాల ఉపాధ్యాయులు, పెన్షనర్స్ పాల్గొన్నారు.

March 24, 2026 / 12:15 PM IST

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఏపీడీ

KRNL: పెద్దకడబురు(M) చిన్నకడబూరు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను APD లోకేశ్వర్, క్లస్టర్ టీఏ గిడ్డయ్య తనిఖీ చేశారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏప్రిల్ 1 నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ పథకం గురించి వేతనదారులకు అవగాహన కల్పించాలని ఎఫ్ఏ కవితకు సూచించారు. పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రతి కార్మికుడికి వివరించాలన్నారు.

March 24, 2026 / 12:14 PM IST

అరకు కేంద్రంలో యుటీఎఫ్ నిరాహార దీక్ష

ASR: యుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి 3.0 కార్యక్రమంలో భాగంగా అరకు నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నాయకులు వివరించారు. పీఆర్సి కమిషన్‌ను తక్షణమే నియమించాలని, IR ప్రకటించాలని, పాత డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

March 24, 2026 / 12:08 PM IST

అనంతవరంలో కార్డాన్ సెర్చ్ నిర్వహణ

PLD: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా క్రోసూరు మండలం అనంతవరంలో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో 80 మంది పోలీసులు మంగళవారం కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలు, గొడ్డళ్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. నేర రహిత సమాజం కోసం ప్రజలు సహకరించాలని డీఎస్పీ కోరారు.

March 24, 2026 / 12:07 PM IST

జిల్లాలో పెరగనున్న MLA సీట్లు..!

VSP: రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కి పెరుగుతాయనే ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 15 MLA సీట్లు ఉండగా.. అవి 23-24కి చేరే అవకాశం ఉంది. అదే విధంగా అరకు పార్లమెంట్ పార్వతీపురంతో కలిసి ఉండగా.. కొత్తగా మరో MP స్థానం పెరగొచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

March 24, 2026 / 12:04 PM IST

బాధిత కుటుంబాన్న పరామర్శించిన జనసేన నేతలు

SKLM: నరసన్నపేట మండలం యారబాడు గ్రామానికి చెందిన కోరుకొండ శాంతారావు తల్లి ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేన పార్టీ నేతలు పిసిని చంద్రమోహన్, పతివాడ గిరీశ్వరరావు, కొవగాపు గౌతమ్, తదితరులు మంగళవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

March 24, 2026 / 12:04 PM IST

సింహాచలం చందనోత్సవ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

విశాఖ: ఏప్రిల్ 20న జరగనున్న సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక చందనోత్సవంపై జిల్లా ఇంఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చిలను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గణబాబు పాల్గొన్నారు.

March 24, 2026 / 12:02 PM IST

‘రాష్ట్ర హోంమంత్రి సేవలు ఎనలేనివి’

AKP: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యదర్శి కోరాడ చందర్రావు మంగళవారం నక్కపల్లిలో అభినందనలు తెలియజేశారు. పాయికరావుపేట నియోజకవర్గం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృషిచేసి ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన కొనియాడారు. ప్రజలందరూ ఆమె సేవలను ఎన్నడూ మర్చిపోరని పేర్కొన్నారు.

March 24, 2026 / 12:01 PM IST

అంగన్వాడీ పోస్టులకు నోటీఫికేషన్ విడుదల

PLD: నరసరావుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు సీడీపీఓ కాంతా కుమారి తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తల 2 పోస్టులు, సహాయకురాళ్ల 7 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన మహిళలు అర్హులని తెలిపారు.

March 24, 2026 / 12:01 PM IST