సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని తన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మంగళవారం పార్టీ నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. వార్డు, పంచాయతీల పరిశీలకులు, మండల, పట్టణ కన్వీనర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం నుంచి ప్రజా సమస్యల పోరాటం వరకు భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
ATP: మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని మంగళవారం శింగనమల నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు నుంచి పార్టీ బలోపేతం వరకు పలు అంశాలపై వీరు చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయడం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి వ్యూహాలపై సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపారు.
GNTR: కాకుమాను మండలం కొండపాటూరు శ్రీ పోలేరమ్మ తిరునాళ్ల ఏర్పాట్లపై మంగళవారం అధికారులు సమీక్షించారు. మార్చి 31న మల్లెపూల పూజ, ఏప్రిల్ 3న కుంకుమ పూజ, 7న తిరునాళ్లు జరగనున్నాయి. సమావేశంలో గ్రామస్తులు రోడ్లు, విద్యుత్, ట్రాఫిక్ సమస్యలను ప్రస్తావించారు. ఉన్నతాధికారులతో చర్చించి వెంటనే వీటిని పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
కడప: ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్మిస్తున్న ‘స్టార్టప్ కడప’ సెంటర్ పనులను మంగళవారం కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి, నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సెంటర్ యువత నైపుణ్యాల వృద్ధికి, ఉపాధికి, నూతన వ్యాపార అవకాశాలకు గొప్ప వేదికగా మారుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
KRNL: కమ్మలదిన్నె గ్రామానికి చెందిన టీడీపీ నేత ఈరన్న అనారోగ్యంతో బాధపడుతుండగా, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి ఆయనను ఇవాళ పరామర్శించారు. ఈరన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర బీసీ సాధికారిక సభ్యుడు మల్లికార్జున, సొసైటీ ఛైర్మన్ అంజినయ్య, ఆశన్న ఉన్నారు.
E.G: రాజమండ్రిలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఫ్యామిలీ కోర్ట్ జడ్జి ఎం.మాధురి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇంచార్జ్ బి.పద్మ మంగళవారం మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. వివిధ కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందిస్తున్న న్యాయవాదుల నుంచి సంబంధిత కేసుల పురోగతి వివరాలు తెలుసుకున్నారు. అన్ని కేసులు సత్వర పరిష్కారం కావాలన్నారు.
BPT: జిల్లావ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల నేపథ్యంలో మంగళవారం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు డీఎస్పీలు, సీఐలు క్షేత్రస్థాయిలో పరీక్షా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా సాగేందుకు వీలుగా కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ షాపులను మూసివేయించారు.
NDL: డోన్ టౌన్ సీఐ ఇంతియాజ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇవాళ సీపీఐ నాయకులు మాజీ ఎమ్మెల్సీ విల్సన్, జిల్లా కార్యదర్శి రంగం నాయుడు కలిసి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ శ్యాముల్ జవహర్కు వారు వినతిపత్రం అందజేశారు. సీఐ ఇంతియాజ్ మండల సీపీఐ నాయకుడు నారాయణపై అన్యాయంగా దాడి చేశాడని వారు అన్నారు.
VZM: మైనర్ డ్రైవింగ్ చట్టపరమైన చిక్కులు తప్పవని, 18 సంవత్సరాలు వయస్సు కలిగిన వ్యక్తులు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం అని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ మంగళవారం తెలిపారు. అటువంటి వ్యక్తులు డ్రైవింగ్ చేయడం వలన ఎదురుగా వచ్చే వాహనాలకు ప్రమాదాల బారిన పడతారని ఆయన స్పష్టం చేశారు. వాహనాలు నడపడంలో తగినంత అనుభవం ఉండాలన్నారు.
ASR: రెవెన్యూశాఖలో పనితీరు మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా సిబ్బంది పనితీరును అంచనా వేయనున్నట్లు తెలిపారు. మంగళవారం రంపచోడవరం నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. ఐవీఆర్ఎస్ కాల్స్లో నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
అనంతపురం నగరంలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం విభిన్న ప్రతిభావంతుల అర్హత ఎంపిక శిబిరం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి మూడు చక్రాల పెట్రోల్ వాహనం కోసం దరఖాస్తు చేసుకున్న 132 మందిని అధికారులు పరిశీలించారు.
అన్నమయ్య: నందిపల్లె సమీపంలో నూతనంగా నిర్మించిన నందీశ్వరాలయంలో వైభవంగా హోమాలు,ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వైసీపీ రాష్ట్ర ప్రధాన శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఆలయ నిర్మాణంలో ఎన్ఆర్ఐ మారం శ్రీకాంత్ రెడ్డి భక్తిశ్రద్ధలను ఆయన ప్రశంసించారు. ఈ నెల 25న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని మాజీ సీఎం జగన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.
సత్యసాయి: ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని హిందూపురం డీఎస్పీ మహేష్ వాహనదారులకు సూచించారు. మంగళవారం లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌలసముద్రం టోల్ ప్లాజా రోడ్డుపై వాహనాలు తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, ఎస్సై నరేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రకాశం: సీఎస్ పురం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని జిల్లాసమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి అనిల్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులతో 100 డేస్ యాక్షన్ ప్లాన్ అమలు తీరును సమీక్షించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించి, అన్ని వివరాలను సమయానికి నమోదు చేయాలని ఆదేశించారు.
GNTR: ఫిరంగిపురం మండలం రేపూడిలోని మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం, వీవీప్యాట్స్ గోడౌన్ మ గుంటూరు జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గోడౌన్లో భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని తనిఖీ చేశారు. అనంతరం సీసీటీవీల పనితీరును కూడా పరిశీలించారు.