కోనసీమ: కొత్తపేట మండలం మోడేకుర్రు పరిధిలోని 11 కేవీ లైను మరమ్మతుల నిమిత్తం గురు, శుక్ర, శని వారాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు రాంబాబు తెలిపారు. ఆయా రోజుల్లో కడలివారిపాలెం, యలమంచిలి వారిపేటలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
PLD: చిలకలూరిపేట పట్టణంలో చోరీకి గురైన 10 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటిని అర్బన్ సీఐ పి.రమేష్ బుధవారం బాధితులకు అప్పగించారు. పట్టణంలో పోయిన సెల్ఫోన్లపై వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేసి వీటిని పట్టుకున్నారు. చోరీలను అరికట్టి, ప్రజల ఆస్తులను రక్షించేందుకు తమ సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని సీఐ తెలిపారు.
GNTR: రాజధాని ప్రాంతం తుళ్లూరులోని స్కిల్ హబ్ భవనంలో గురువారం సీఆర్డీఏ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా ద్వారా సుమారు 500కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి ఆపై చదువుకున్న వారు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
E.G: రాజమండ్రి నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ బదిలీ అయ్యారు. ఈ మేరకు పోలీస్ శాఖ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులులో ఆయన హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని తెలియజేసింది. అలాగే ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. ప్రస్తుతం డీఎస్పీ శ్రీకాంత్ కు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదని సమాచారం.
GNTR: తెనాలి పురపాలక సంఘ మెప్మా విభాగం ఆధ్వర్యంలో పాత రత్న టాకీస్ సమీపంలోని రైతు బజార్ ఎదుట ఏర్పాటు చేసిన ‘తృప్తి’ క్యాంటీన్ గురువారం ప్రారంభం కానుంది. మున్సిపల్ ఛైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ రామ అప్పల నాయుడు ఈ క్యాంటీన్ను ప్రారంభించనున్నారు. మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది.
KDP: బద్వేలు పట్టణంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ లలితమ్మ (59) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. కొద్దిరోజులుగా ఆమె అనారోగ్యంతో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల కార్యాలయ ఉద్యోగులు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
కృష్ణా: గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో డ్రైనేజ్ సమస్యపై ఉందని వచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీడీవో ఇమ్రాన్ బుధవారం పరిశీలించారు. గ్రామంలోని పలు వీధుల్లో డ్రైనేజ్ నీరు నిల్వ ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేయగా, సమస్య తీవ్రతను స్వయంగా పరిశీలించిన ఎంపీడీవో సంబంధిత పంచాయతీ సిబ్బందికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ELR: చింతలపూడి మండలం ఫాతిమాపురం చెక్ పోస్ట్ వద్ద బుధవారం రాత్రి భారీ వృక్షం పడి విద్యుత్ వైర్లు తెగిపోయాయి. సకాలంలో స్పందించిన ఎలక్ట్రికల్ సిబ్బంది రాత్రంతా అక్కడే ఉండి తెల్లవారుజామున 3 గంటల వరకు విద్యుత్ లైన్లను పునరుద్ధరించారు. దీంతో రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
SS: అమరావతిలో జరుగుతున్న శాసనసభ్యుల క్రీడా మహోత్సవం ‘ఆట విడుపు’లో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సందడి చేశారు. బుధవారం జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఆమె పాల్గొని ఉత్సాహంగా బ్యాటింగ్, బౌలింగ్ చేశారు. నిత్యం రాజకీయాలు, పాలనా వ్యవహారాలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులకు ఈ క్రీడలు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయని మంత్రి పేర్కొన్నారు.
కృష్ణా: ఉంగుటూరు మండలం ఇందుపల్లి జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. చిన్నారులపై నేరాలకు పోక్సో చట్టం కింద కఠిన శిక్షలు ఉంటాయని ఎస్సై గోవింద్ తెలిపారు. మైనర్లు వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని వివరించారు. అపరిచితులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని సూచించారు.
NDL: పాణ్యం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి సెల్ఫోన్ దొంగిలించి, దుండగులు ఫోన్ పే యూపీఐ ద్వారా పలు దఫాలుగా రూ.3,18,000 నగదు కాజేశారు. బుధవారం బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. మహాశివరాత్రి సందర్భంగా కాల్వబుగ్గ ఉత్సవాలకు వెళ్లిన సమయంలో రథోత్సవం ముగించుకుని వస్తుండగా ఫోన్ అపహరించారు. బాధితుడు పాణ్యం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కర్నూలు కాంగ్రెస్ జిల్లా కమిటీ నూతన కార్యవర్గం ఏర్పాటుకు ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు క్రాంతి నాయుడు తెలిపారు. మార్చి 10లోగా కార్యవర్గాన్ని ప్రకటిస్తామన్నారు. యువకులు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు, సామాజిక సేవకులు బయోడేటాలతో జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు.
W.G: నరసాపురం డీఎస్పీ శ్రీవేదను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 2018 బ్యాచ్కు చెందిన 25 మంది డీఎస్పీలను పోలీస్ కార్యాలయంకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ భారీ బదిలీల జాబితాలో నరసాపురం డీఎస్పీ శ్రీవేద పేరు కూడా ఉంది. డీఎస్పీగా శ్రీవేద అనేక సవాళ్లతో కూడిన కేసులను ఛేదించారు.
PPM: పట్టణంలో మార్చి 1న జరగబోయే కౌలు రైతుల మహా సభలు విజయవంతం చెయ్యాలని రైతు సంఘం జిల్లా నాయకుడు రెడ్డి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం మక్కువ మండలం తురుమామిడి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కౌలు రైతులు కౌలు కార్డులు మంజూరు చెయ్యాలని, అన్నదాత సుఖీభవ పథకం వర్తింపు, బ్యాంకు రుణాలు, తదితర సమస్యల పరిష్కారం కోసం ఈ సభలు నిర్వహిస్తున్నామన్నారు.