• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఎస్ ఎం పురంలో ఘనంగా ఎర్రం నాయుడు జయంతి వేడుకలు

SKLM: ఎచ్చెర్ల మండలం ఎస్ ఎం పురం గ్రామంలో దివంగత నేత, మాజీ మంత్రి కింజరావు ఎర్రం నాయుడు 69వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా టీడీపీ అధ్యక్షులు చౌదరి నారాయణమూర్తి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ ధనలక్ష్మి, డీసీఎంఎస్ ఛైర్మన్ అవినాష్, తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 10:25 AM IST

గుత్తిలో వ్యక్తి అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు

ATP: గుత్తి దాసరి కాలనీకి చెందిన వెంకటేష్ అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ..చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

February 23, 2026 / 10:20 AM IST

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన DSP

TPT: నాయుడుపేటలో ఇవాళ ఉదయం జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను డీఎస్‌పీ చెంచుబాబు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పరీక్షలు నిర్వహించాలని పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. తెలియని వారిని పరీక్ష కేంద్రంలోనికి పంపకూడదని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలన్నారు.

February 23, 2026 / 10:19 AM IST

నూతన ఎస్ఐగా అజయ్ కుమార్ బాధ్యతలు

TPT: సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా అజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.ఇంతకుముందు దొరవారిసత్రం ఎస్ఐగా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై సూళ్లూరుపేటకు వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడుతూ.. పట్టణ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, కాలేజీలు మరియు పాఠశాలల సమయాల్లో ఆకతాయిలపై కఠిన నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.

February 23, 2026 / 10:12 AM IST

నంద్యాలలో టమాటా రైతులకు భారీ నష్టం

NDL: నంద్యాల జిల్లాలో టమాటా సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జనవరిలో కిలో రూ. 60 పలికిన ధర ప్రస్తుతం రూ. 4కు చేరుకోవడంతో అన్నదాతలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 6 ఎకరాల్లో సాగు చేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

February 23, 2026 / 10:10 AM IST

ఇంటర్ పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశాను

ELR: గణపవరం శ్రీ చింతలపాటి బాపిరాజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. సీఐ రజిని కుమార్ పర్యవేక్షించారు. మొదటి సంవత్సరం జనరల్ విద్యార్ధులు వొకేషనల్ విద్యార్ధులు పరీక్షలు రాయునున్నారు.

February 23, 2026 / 10:05 AM IST

పొన్నూరులో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

GNTR: పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఆదేశాల మేరకు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ పోతురాజు ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు. నిడుబ్రోలు ఓవర్ బ్రిడ్జి వద్ద ప్రధాన డ్రైన్‌లోని పూడికను (సిల్ట్) సిబ్బంది తొలగించారు. పట్టణంలో దోమల నివారణ కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.

February 23, 2026 / 10:04 AM IST

మామిడి రైతుల్లో ఆందోళన

ATP: జిల్లాలో ఈ ఏడాది మామిడి పూత ఆశాజనకంగా ఉన్నా, మారుతున్న వాతావరణం రైతులను కలవరపెడుతోంది. ఫిబ్రవరిలో ఆలస్యంగా వచ్చిన పూత జూన్ నాటికి కాయలుగా మారి కోతకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎండలు పెరుగుతుండటంతో పూత మాడి రాలిపోతోంది. దీంతో ముందస్తుగా తోటలు కొన్న వ్యాపారులు, పెట్టుబడి పెట్టిన రైతులు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

February 23, 2026 / 10:01 AM IST

కంచికచర్లలో ఆటో డ్రైవర్లకు ఎస్సై కౌన్సిలింగ్

NTR: కంచికచర్ల పట్టణంలోని స్థానిక చెవిటికల్లు సెంటర్లో సోమవారం ఆటో డ్రైవర్లకు ఎస్సై నాని నరేందర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆటోలను ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ నిలిపి ఇతర వాహనాదారులకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

February 23, 2026 / 10:00 AM IST

‘ఈనెల 26 నుంచి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం’

VZM: జనసేన సభ్యత్వ నమోదు ఈనెల 26 నుంచి ప్రారంభం కానుందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తెలిపారు. ఈ సందర్బంగా భోగాపురం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రామ స్థాయి నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టాలని, ప్రతి నాయకుడు సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.

February 23, 2026 / 10:00 AM IST

బుచ్చిలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

NLR: బుచ్చి మండలంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉదయాన్నే ఎనిమిది గంటలకు పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. అధికారులు హాల్ టికెట్లు క్షుణ్ణంగా పరిశీలించి, విద్యార్థులను లోపలికి అనుమతించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

February 23, 2026 / 09:51 AM IST

కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై కేసులు

విశాఖపట్నంలో 10 రోజులుగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై 41 కేసులు నమోదు చేసినట్లు ఉప రవాణా కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. అనుమతులు లేకుండా నడపడం, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించడం, పన్నులు చెల్లించకపోవడం వంటి ఉల్లంఘనలు గుర్తించారని చెప్పారు. నిబంధనలు అతిక్రమించిన బస్సులపై రూ.3,52,870 చలానా విధించినట్లు వెల్లడించారు.

February 23, 2026 / 09:46 AM IST

కరాటేలో అన్నదేవారపేట విద్యార్థుల ప్రతిభ

E.G: తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామానికి చెందిన అబ్దుల్ కలాం స్కూల్ విద్యార్థులు కరాటేలో అద్భుత ప్రతిభ చాటారు. నిడదవోలులో జరిగిన మూడవ సౌత్ ఇండియా కరాటే ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో వీరు స్వర్ణ, రజత పతకాలు సాధించారు. ఈ పురస్కారాలను మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులకు అందజేశారు. విద్యార్థుల ప్రతిభపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

February 23, 2026 / 09:45 AM IST

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలు

ATP: గుత్తిలోని గుంతకల్లు రోడ్డులో సోమవారం బైకు అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రవికుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ఉపాధ్యాయుడిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 23, 2026 / 09:30 AM IST

రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం

అన్నమయ్య: రాజంపేట పట్టణ పరిధి మన్నూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వల్లీ దేవసేన సమేత స్వామి వారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం స్వామి వారి కళ్యాణం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ సాయంత్రం గ్రామోత్సవం ఉంటుందని వివరించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.

February 23, 2026 / 09:29 AM IST