• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

KDP: కారు ఢీకొని జింక మృతి

KDP: చెన్నూరు-కాజీపేట సరిహద్దులోని సీ. కొత్తపల్లి సమీపంలో సోమవారం రోడ్డు దాటుతున్న ఓ జింకను గుర్తుతెలియని కారు ఢీకొనడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. ఆహారం కోసం కొండ ప్రాంతం నుంచి జాతీయ రహదారిపైకి వచ్చిన జింక, వేగంగా వస్తున్న వాహనానికి బలయ్యింది. సమాచారం అందుకున్న ఖాజీపేట అటవీ అధికారులు జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

February 23, 2026 / 09:15 PM IST

ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్-2026 పోటీలు

VSP: ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు విశాఖలోని గురజాడ కళా క్షేత్రంలో జరుగుతున్నాయి. ఈ పోటీలలో 20 నుంచి 65 సంవత్సరాల వయస్సు కలిగి, 50కేజీల నుంచి 100 కేజీల వరకు బరువు కలిగిన పురుషులు పాల్గొన్నారు. ఇందులో గెలిచిన విజేతలకు గోల్డ్ మెడల్‌తో పాటు నగదును అందించనున్నారు.

February 23, 2026 / 09:00 PM IST

తిరుమలలో నాఖా బందీ

TPT: తిరుమలలో భక్తుల భద్రత దృష్ట్యా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ విస్తృత స్థాయి నాఖాబందీ కార్యక్రమం నిర్వహించింది. ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అధికారి మురళీ కృష్ణ ఆదేశాల మేరకు బాలాజీ నగర్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. సుమారు 90 మంది సిబ్బంది 6 బృందాలుగా ఏర్పడి బాలాజీ నగర్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టి అనుమతి లేని వ్యక్తులపై దృష్టి సారించారు.

February 23, 2026 / 08:48 PM IST

‘జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు’

VZM: నీతి ఆయోగ్, భారత ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన “సిటీ రీజియన్స్ యాజ్ గ్రోత్ హబ్” ప్రాజెక్టులో భాగంగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ కింద అమలు చేసే ప్రాజెక్టులను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ కమిటీని సోమవారం ఏర్పాటు చేశారు.

February 23, 2026 / 08:48 PM IST

KUDA అనుమతులు తప్పనిసరి: ఛైర్మన్

KRNL: KUDA అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. మంత్రాలయంలోని నాన్ లేఔట్ ప్లాట్లలో అనుమతులు లేకుండా సాగుతున్న నిర్మాణాలను పరిశీలించి నిర్మాణదారులను హెచ్చరించారు. బీపీఎస్ విధానం ద్వారా దరఖాస్తు చేసి ప్రభుత్వానికి రుసుము చెల్లించి మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

February 23, 2026 / 08:44 PM IST

‘న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి’

కర్నూలు: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేసి, కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద న్యాయవాదులు మానవహారం, ధర్నా నిర్వహించారు. విధి నిర్వహణలో ఉన్న న్యాయవాది ఎం. పవన్ కుమార్‌పై అనుచితంగా ప్రవర్తించిన ఘటనను ఖండిస్తూ పెద్ద ఎత్తున న్యాయవాదులు ఆందోళనకు దిగారు.

February 23, 2026 / 08:44 PM IST

కరాటేలో బంగారు పతకం సాధించిన విద్యార్థి

WG: విశాఖపట్నంలో నిర్వహించిన 31వ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ లో మోగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రతిభ చాటారు. 9వ తరగతి చదువుతున్న ఆర్. వేణు అండర్-17 విభాగంలో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి బంగారు పతకం సాధించినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు కె. సూర్య తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

February 23, 2026 / 08:43 PM IST

మహిళా అక్షరాస్యతపై కలెక్టర్ ఆదేశాలు

నంద్యాల: జిల్లాలో 1,00,686 మంది మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు శాఖల సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ రాజకుమారి ఇవాళ ఆదేశించారు. ప్రతి వాలంటీర్‌కు 10 మంది చొప్పున అనుసంధానం చేసి మే 28న జరిగే ప్రీ–ఫైనల్ పరీక్షకు వంద శాతం హాజరు కల్పించాలని ఆమె సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ వెల్లడించారు.

February 23, 2026 / 08:41 PM IST

మల్లేశ్వర స్వామి నిత్య అన్నదానానికి రూ. లక్ష విరాళం

GNTR: పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థాన నిత్య అన్నదాన పథకానికి బాపట్ల జిల్లా సూరేపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ రావు సోమవారం రూ. లక్ష విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ మాట్లాడుతూ.. స్వామివారి అన్నదాన పథకానికి, ఆలయ అభివృద్ధికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పించి సహకరించాలని కోరారు.

February 23, 2026 / 08:40 PM IST

సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

AKP: కోటవురట్ల మండలం బీకెపల్లిలో 10 సీసీ రోడ్లు హోంమంత్రి వంగలపూడి అనిత చొరవతో మంజూరైనట్లు మండల టీడీపీ అధ్యక్షుడు లింగన్నాయుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. పది రోడ్ల నిర్మాణానికి రూ.52 లక్షలు నిధులు విడుదలైనట్లు తెలిపారు. రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలన్నారు.

February 23, 2026 / 08:38 PM IST

అనారోగ్య బాధితునికి ఆర్థిక సహాయం అందజేత

కోనసీమ: రామచంద్రపురం మండలం వేగాయమ్మపేటకు చెందిన చొల్లంగి సుబ్రహ్మణ్యం గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతనికి విశాఖపట్నంకు చెందిన వ్యాపారవేత్త పోతంశెట్టి ఆంజనేయులు రెడ్డి మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా సోమవారం రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారు. మంత్రి మాట్లాడుతూ.. తానే కాకుండా తన మిత్రులు కూడా సహాయం చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు.

February 23, 2026 / 08:37 PM IST

మాజీ సీఎంను ఆహ్వానించిన మాజీ సీఎం

WG: మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడు సందీప్ వివాహ రిసెప్షన్ మార్చి 9న రాజమహేంద్రవరంలో జరగనున్న నేపథ్యంలో, జగన్‌ను కుటుంబ సమేతంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. శేషుబాబుతో పాటు ఆయన సతీమణి శశికళ, రవిశంకర్ నారాయణ (IRS), సిద్ధార్థ తదితరులు జగన్‌ను కలిసి ఆత్మీయంగా ఆహ్వానించారు.

February 23, 2026 / 08:36 PM IST

మాజీ సీఎంను ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్సీ

WG: మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడు సందీప్ వివాహ రిసెప్షన్ మార్చి 9న రాజమహేంద్రవరంలో జరగనున్న నేపథ్యంలో, జగన్‌ను కుటుంబ సమేతంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. శేషుబాబుతో పాటు ఆయన సతీమణి శశికళ, రవిశంకర్ నారాయణ (IRS), సిద్ధార్థ తదితరులు జగన్‌ను కలిసి ఆత్మీయంగా ఆహ్వానించారు.

February 23, 2026 / 08:36 PM IST

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి: ఎమ్మెల్యే

NTR: మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో రూ.20 లక్షలతో తాగునీటి పైపులైన్ నిర్మాణానికి, చిలుకూరులో రూ.25 లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్వచ్ఛంధ్ర-స్వర్ణాంధ్ర లక్ష్యంతో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ప్రధాన ధ్యేయంతో కృషి చేస్తునమన్నారు.

February 23, 2026 / 08:36 PM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ‘అనంత’*

అనంతపురం: రంజాన్ మాసంను పురస్కరించుకుని అనంతపురం నగరంలోని 2వ రోడ్ వద్ద ఉన్న బాబుద్ధిన్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, మేయర్ వసీం హాజరయ్యారు. మసీదు నందు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, మసీదు కమిటీ మెంబర్లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 08:34 PM IST