KDP: చెన్నూరు-కాజీపేట సరిహద్దులోని సీ. కొత్తపల్లి సమీపంలో సోమవారం రోడ్డు దాటుతున్న ఓ జింకను గుర్తుతెలియని కారు ఢీకొనడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. ఆహారం కోసం కొండ ప్రాంతం నుంచి జాతీయ రహదారిపైకి వచ్చిన జింక, వేగంగా వస్తున్న వాహనానికి బలయ్యింది. సమాచారం అందుకున్న ఖాజీపేట అటవీ అధికారులు జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు.