KRNL: KUDA అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. మంత్రాలయంలోని నాన్ లేఔట్ ప్లాట్లలో అనుమతులు లేకుండా సాగుతున్న నిర్మాణాలను పరిశీలించి నిర్మాణదారులను హెచ్చరించారు. బీపీఎస్ విధానం ద్వారా దరఖాస్తు చేసి ప్రభుత్వానికి రుసుము చెల్లించి మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.