• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కంచికచర్ల మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

NTR: నందిగామలోని కంచికచర్ల మార్కెట్ యార్డ్‌లో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ ఛైర్మన్ కోగంటి బాబు బుధవారం ప్రారంభించారు. వీరులపాడు, కంచికచర్ల మండలాల్లో రైతులు అధికంగా శనగలు సాగు చేసినందున నష్టపోకుండా ఉండేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వ ఉద్దేశం రైతులకు మద్దతుగా నిలబడమే అని ఆయన అన్నారు.

February 25, 2026 / 06:12 PM IST

పట్రపల్లిలో అగ్ని ప్రమాదం.. రూ.1.5 లక్షల నష్టం

అన్నమయ్య: పుంగనూరు(మం) పట్రపల్లిలో నెల్లి, అల్లనేరేడు తోటలో అగ్ని ప్రమాదం జరిగింది. డ్రిప్ పైపులు, కేబులు దగ్ధమవగా సుమారు రూ.1.5 లక్షల నష్టం జరిగినట్లు పోలీసుల అంచనా. ధూమపానం ముక్కల వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు తెలిపారు. పుంగనూరు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. తోటకు సమీపంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో అప్రమత్తం చేశారు.

February 25, 2026 / 06:10 PM IST

మార్చి 8న గురుకుల విద్యాలయ ప్రవేశ పరీక్ష

SKLM: జిల్లా పరిధిలో మార్చి 2న జరగాల్సిన డాక్టర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయ ప్రవేశ పరీక్ష మార్చి 8కి వాయిదా పడిందని నందిగాం బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ బెలమర మంజుల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026-28 విద్యా సంవత్సరానికి 6, 7 ,8 ,9 10 తరగతుల విద్యార్థులకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. వివరాలకు 9177788124 సంప్రదించాలన్నారు

February 25, 2026 / 06:10 PM IST

పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశం

కర్నూలు: జిల్లా పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా పని చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాపర్టీ కేసులలో పోలీసులు బాగా పని చేయాలని సూచించారు.

February 25, 2026 / 06:09 PM IST

అనంతపురంలో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయండి: ఎమ్మెల్యే

ATP: అనంతపురం నగర పరిసరాల్లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేసి యువత, మహిళలకు ఉపాధి కల్పించాలని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అసెంబ్లీలో కోరారు. బుధవారం సభలో ఆయన మాట్లాడుతూ.. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు పెరగాలన్నారు. తక్కువ వేతనాలతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ పార్క్ ఎంతో దోహదపడుతుందని వివరించారు.

February 25, 2026 / 06:09 PM IST

భవిష్యత్ బ్యాంకర్లకు ప్రత్యక్ష అనుభవం

KDP: జెడ్‌పీహెచ్‌ఎస్‌ఎస్‌ మైదుకూరులో BFSI వృత్తి విద్యలో భాగంగా విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన కల్పించేందుకు మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వైఎస్ఆర్‌నగర్ శాఖలో పారిశ్రామిక సందర్శన నిర్వహించారు. శాఖ మేనేజర్ పీ. శర్మిల విద్యార్థులకు బ్యాంక్ పనితీరు, ఖాతా ప్రారంభం, రుణాల ప్రక్రియ, డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై వివరించారు.

February 25, 2026 / 06:07 PM IST

ముగిసిన ఎంఈఓల శిక్షణ కార్యక్రమం

ATP: ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల మండల విద్యాశాఖ అధికారుల రెండు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. కొర్రపాడు, బుక్కరాయసముద్రం కేంద్రాల్లో నిర్వహించిన ఈ సదస్సులో కేపాసిటీ బిల్డింగ్, ఎఫ్ఎల్ఎన్ అంశాలపై అవగాహన కల్పించారు. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల ఎంఈఓలు, డైట్ అధ్యాపకులు ఇందులో పాల్గొన్నారు.

February 25, 2026 / 06:05 PM IST

‘విధుల్లో అలసత్వం వద్దు’

VZM: ముఖ్యమంత్రి ప్రజావేదికకు పక్కా ఏర్పాట్లు చేయాలని అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఇంఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి విరించారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు

February 25, 2026 / 06:05 PM IST

మార్కాపురం జిల్లాకు సీఎం వరాల జల్లు

ప్రకాశం: మార్కాపురం జిల్లా ప్రజలకు సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. మార్కాపురంలో నూతన కలెక్టరేట్‌ నిర్మాణానికి రూ.50 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు లేకుండా రక్షిత మంచి నీరు ఇస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో ఉన్న భూ సమస్యలు పరిష్కరిస్తానని, వెలిగొండ్ల ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తానని చెప్పుకొచ్చారు.

February 25, 2026 / 06:05 PM IST

రేపల్లెలో జీవనోపాధులపై పైలట్ ప్రాజెక్ట్

BPT: రేపల్లెలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం టీడీపీ నేత అనగాని శివప్రసాద్ ఆధ్వర్యంలో జీవనోపాధులపై సమీక్ష జరిగింది. మహిళా సంఘాల ద్వారా తాటి బెల్లం, ఎండు చేపలు, పండ్లను ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేసే ప్రణాళికపై వారు చర్చించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రేపల్లె నియోజకవర్గంలో ఈ పైలట్ ప్రాజెక్ట్ అమలు కానుంది.

February 25, 2026 / 06:02 PM IST

తాడేపల్లిలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ గుట్టురట్టు

GNTR: తాడేపల్లి పరిధిలోని పెనుమాకలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ‘రాధే’ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎస్.వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ఇతని వెనుక మంగళగిరికి చెందిన దిలీప్, శ్రీకాంత్ ఉన్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి రూ.10,200 నగదు, ఫోన్‌పేలో ఉన్న రూ.49 వేలు స్వాధీనం చేసుకున్నారు.

February 25, 2026 / 06:01 PM IST

చట్టాలపై విద్యార్థులకు అవగాహన

కృష్ణా: గుడివాడ పొట్టి శ్రీరాములు హై స్కూల్ విద్యార్థులకు సీఐ హనీశ్ కుమార్, శక్తి టీం సభ్యులతో కలిసి చట్టాలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే చట్టాల పట్ల, సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగి ఉంటే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవచ్చని తెలిపారు. ఏదైనా ఆపద కలిగినప్పుడు 112 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

February 25, 2026 / 06:00 PM IST

మనసా మానసిక చికిత్స కేంద్రాన్ని సందర్శించిన సివిల్ జడ్జ్

తూ.గో: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జ్ ఎన్.శ్రీలక్ష్మీ రాజమండ్రిలోని మనసా మానసిక చికిత్స కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. మానసిక చికిత్స విభాగంలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, అందుతున్న వైద్య సదుపాయాలు తెలుసుకున్నారు. మానసిక రుగ్మతల నుండి పూర్తిగా ఉపశమనం పొందిన వారిని తిరిగి వారి కుటుంబ సభ్యులతో కలిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

February 25, 2026 / 05:58 PM IST

కరెంట్ షాక్.. చెట్టుపైనే వ్యక్తి మృతి

కోనసీమ: అంబాజీపేట మండలం నందంపూడికి చెందిన నేదునూరి జనార్ధనరావు (55) బుధవారం కరెంటు షాక్‌తో మరణించారు. కొబ్బరి దింపు తీసేందుకు చెట్టు ఎక్కుతుండగా కరెంటు తీగలపై పడిన ఎండుటాకు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. షాక్‌కు గురై ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని గ్రామస్థులు కిందికి దించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 25, 2026 / 05:57 PM IST

ఆ భూములను కాపాడండి: సోమిరెడ్డి

నెల్లూరు: సర్వేపల్లిలో హైవే పక్కన రూ. 100కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని MLA సోమిరెడ్డి కోరారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘సర్వేపల్లిలో గత ఐదేళ్లు చాలా ఘోరాలు జరిగాయి. MSME పార్కు పేరుతో 50 ఎకరాలు, సూరాయపాలెంలో 30 ఎకరాలు, కొమ్మలపూడిలో 19 ఎకరాల భూమిలో స్కామ్ జరిగింది. దీనిపై ఏమైనా చర్యలు మొదలె పెడితే కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు’ అని అన్నారు.

February 25, 2026 / 05:54 PM IST