• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వైసీపీ నాయకులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం

KRNL: రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో సర్పంచ్, MPTC స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆలూరు MLA విరుపాక్షి ఇవాళ సూచించారు. హొళగుందలో వైసీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. హొళగుంద ప్రజలు YCP పార్టీకి మెజారిటీ ఇస్తూ ఆదరిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో త్రాగునీరు, రహదారుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

February 25, 2026 / 05:28 PM IST

‘రైతాంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి’

ATP: గుంతకల్లు మున్సిపాలిటీ వద్ద రైతాంగ సమస్యలపై చేస్తున్న సామూహిక అధ్యక్షులు బుధవారం 6వ రోజుకు చేరాయి. శిబిరంలోని దీక్షాపరులకు గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి మద్దతు తెలిపి తమ సంఘీభావం తెలిపారు. నియోజకవర్గంలోని చెరువులకు హంద్రీనీవా సాగునీటి జలాల సాధనే ప్రధాన లక్ష్యం అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు.

February 25, 2026 / 05:27 PM IST

‘ప్రభుత్వ భూముల రక్షణ బాధ్యత తహసీల్దార్లదే’

PPM: జిల్లాలోని ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడాల్సిన ప్రాథమిక బాధ్యత తహసీల్దార్లదేనని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం రెవిన్యూ అధికారులకు ఉండే సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ప్రతీ సమస్యను సావధానంగా పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురైతే చూస్తూ ఊరుకోకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

February 25, 2026 / 05:26 PM IST

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆదాయం వివరాలు

కోనసీమలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం వివిధ సేవల ద్వారా రూ.2.68 లక్షలు ఆదాయం లభించిందని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఉదయం నుండి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. దర్శనం చేసుకున్న భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరించారు.

February 25, 2026 / 05:25 PM IST

ఈనెల 26న ప్రజా వేదిక

ASR: ఈనెల 26వ తేదీన అనంతగిరిలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ అరకు నియోజకవర్గ ఇంఛార్జ్ సియ్యారి దొన్నుదొర బుధవారం అన్నారు. ఉదయం 10:30కు ప్రారంభమయ్యే ప్రజా వేదికకు 24 పంచాయితీల ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో సమర్పించవచ్చన్నారు. గ్రీవెన్స్‌కు వచ్చే వారంతా ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలన్నారు.

February 25, 2026 / 05:22 PM IST

ఈ నెల 28నే ఫించన్ల పంపిణీ

VZM: వంగర మండలంలో ఈ నెల 28నే NTR భరోసా పెన్షన్‌ పంపిణీ చేయనున్నట్లు MPDO రాజారావు బుధవారం తెలిపారు. ఈ మేరకు మండలానికి 290 పెన్షన్లు విడుదల చేయగా రూ.2,67,64500 మంజూరైనట్లు పేర్కొన్నారు. అదేరోజు శతశాతం పింఛన్‌ పంపిణీ పూర్తిచేయాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. టెంపరరీ మైగ్రేషన్‌ అయిన వారికి సమాచారం అందించి ఇంటీ దగ్గర ఉండేటట్లు చూసుకోవాలన్నారు.

February 25, 2026 / 05:22 PM IST

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గోడ పత్రిక ఆవిష్కరణ

అనకాపల్లి సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మార్చి 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు చేసే రిలే నిరాహార దీక్షలు జయప్రదం చేయాలని కోరుతూ గోడపత్రికలు విడుదల చేశారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ,బీసీ మహిళ వసతి గృహాలు ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణీంద్ర డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి ఒకే ఒక మహిళా వసతి గృహం ఉందన్నారు.

February 25, 2026 / 05:22 PM IST

పేలుడు ఘటనలో ఇద్దరికి గాయాలు

W.G. మొగల్తూరు కుక్కలవారితోటలో బుధవారం విచారకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటికి రంగులు వేసే పనుల్లో భాగంగా చెద పట్టకుండా స్ప్రే చేస్తున్న సమయంలో ప్లాస్టిక్ మందు క్యాన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడే పనిచేస్తున్న వనం రాజేష్, వనం నారాయణ రావులకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం నిమిత్తం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

February 25, 2026 / 05:21 PM IST

కోడిపందాలు నిర్వహిస్తున్న నలుగురు అరెస్ట్

కృష్ణా: గుడివాడ మండలం బొమ్ములూరు గంగానమ్మ గుడి సమీపంలో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్సై చంటిబాబు కోడిపందాల స్థావరంపై బుధవారం దాడి చేశారు. ఈ సందర్భంగా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి ఒక కోడిపుంజు, కోడి కత్తి, రూ.1200 నగదు రెండు బైకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

February 25, 2026 / 05:20 PM IST

రేపు ఆత్మకూరులో జాబ్ మేళా

NDL: APSSDC ఆధ్వర్యంలో ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 14 కంపెనీల ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగులను ఎంపిక చేస్తారని తెలిపారు. 10వ తరగతి నుంచి పైచదువులు చదివిన వారు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.13 వేల-36 వేల వరకు వేతనం ఉంటుందని చెప్పుకొచ్చారు.

February 25, 2026 / 05:20 PM IST

అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత

SKLM: అక్రమంగా తరలిస్తున్న పశువులను మందస పోలీసులు పట్టుకున్నారు. ఇచ్చాపురం నుండి పలాస వైపు వెళ్లే రెండు బొలెరో వాహనాలలో 13 గేదెలను తరలిస్తుండగా హరిపురం జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పశువులను రక్షణ నిమిత్తం పశు సంరక్షణ కేంద్రాలకు తరలించారు. ఈ ఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై కె కృష్ణ ప్రసాద్ తెలిపారు.

February 25, 2026 / 05:19 PM IST

విశాఖలో మాజీ సీఎంకి ఘనస్వాగతం

VSP: మాజీ సీఎం, బీజేపీ కీలక నేత నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి బుధవారం విశాఖ నగరానికి చేరుకున్నారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. బాలరాజేశ్వరరావు, రవీందర్ రెడ్డి, దీపిక రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి సాలువాతో సత్కరించారు. ఆయన రాకతో విమానాశ్రయం ప్రాంగణం నినాదాలతో మార్మోగింది.

February 25, 2026 / 05:18 PM IST

మీడియా వారికి అక్రెడిటేషన్ కార్డుల అందజేత

TPT: కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ బుధవారం మీడియా ప్రతినిధులకు అక్రెడిటేషన్ కార్డులను అందజేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన జర్నలిజం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరేలా చూడాలన్నారు.

February 25, 2026 / 05:17 PM IST

గ్రామాభివృద్ధికి సమిష్టి కృషి

PLD: మాచవరంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. గ్రామాల అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని ఎంపీపీ అంజమ్మ కోరారు. వర్షాలతో ఈ ఏడాది వ్యవసాయం లాభసాటిగా సాగిందని స్పెషల్ ఆఫీసర్ కృష్ణదేవరాయలు తెలిపారు. కుక్కలు, కోతుల బెడదను అరికట్టాలని ఎంపీడీవో విష్ణు చిరంజీవి సూచించారు. అలాగే రూ.1.20కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

February 25, 2026 / 05:15 PM IST

మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన

AKP: కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్లో 6, 7, 8వ తరగతుల విద్యార్థులకు బుధవారం ఫ్రీ ఒకేషనల్ విజిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా మండలంలో గొట్టివాడ గ్రామంలో అటవీ శాఖ నర్సరీని సందర్శించారు. మొక్కల పెంపకంపై వారికి అవగాహన కల్పించారు. అనంతరం రాజుపేటలో పామాయిల్ మొక్కల పెంపకం గురించి వివరించారు. కైలాసపట్నంలో లక్క బొమ్మల తయారీ గురించి తెలుసుకున్నారు.

February 25, 2026 / 05:12 PM IST