బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,860 పెరిగి రూ.1,25,840కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,700 పెరిగి రూ.1,15,350 పలుకుతోంది. అలాగే, కిలో వెండి ధర రూ.3,000 పెరిగి రూ.1,72,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.