TG: ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు అందించే నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ దరఖాస్తుల గడువును ఈనెల 30 వరకు పొడిగించినట్లు TGBIE ప్రకటించింది. ఫ్రెష్, రెన్యూవల్ రెండింటికీ వర్తిస్తుంది. 2025 పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్లో ఉన్న విద్యార్థులు ఫ్రెష్ దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో స్కాలర్ షిప్ పొందినవారు 2025-26 విద్యాసంవత్సరానికి scholarships.gov.in ద్వారా రెన్యూవల్ చేసుకోవచ్చు.