BDK: జూలూరుపాడు మండలం వినోబా నగర్ గ్రామ సమీపంలో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీసే ప్రయత్నాలను చేస్తున్నారు.
KNL: అస్పరి (మ) జోహారాపురంలో మతిస్థిమితం లేని ఓ మహిళ(35)పై బుధవారం హనుమంతు అనే కామాంధుడు అత్యాచారానికి పాల్పడినట్లు ట్రైని DSP ఉషశ్రీ తెలిపారు. మహిళను ఆశ్రమంలో విడిచిపెడతానని తల్లిదండ్రులకు నచ్చజెప్పి తీసుకెళ్లిన అతను.. ఆశ్రమానికి తీసుకెళ్లకుండా, ముత్తుకూరులోని తన ఇంటికి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
KMR: ఎల్లారెడ్డి మండలం రేపల్లేవాడి గ్రామానికి చెందిన పిట్ల స్వప్న (25) బుధవారం మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మెదక్ జిల్లాకు కోచ్చారం నుంచి ద్విచక్ర వాహనంపై తన మరిది శ్రీనివాస్తో స్వప్న వస్తుండగా బైక్ డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా శ్రీనివాస్ చికిత్స పొందుతున్నారు.
MDK: జనవరి నెలలో గజ్వేల్ పట్టణంలోని సమీకృత మార్కెట్లో మోటార్ సైకిల్ దొంగతనం కేసులో నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్ష విధిస్తూ గజ్వేల్ న్యాయమూర్తి ప్రియాంక తీర్పును వెలువరించినట్లు గజ్వేల్ సీఐ సైదా తెలిపారు. జగిత్యాల పట్టణం జాంబాగ్కు చెందిన మహమ్మద్ అక్తర్(44) ఈ మోటార్ సైకిల్ దొంగతనం కేసులో నేరం రుజువు కావడంతో ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష విధించారు.
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. బెహిబాగ్ ప్రాంతంలోని కడ్డర్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: మహిళా మృతికి కారణమైన నిందితుడికి మిర్యాలగూడ ఐదో అదనపు న్యాయమూర్తి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. మిర్యాలగూడ మండలం జైత్ర తండాకు చెందిన సైదులు లక్ష్మమ్మను ట్రాక్టర్తో బుద్ధి చంపేశాడు. అప్పటి మిర్యాలగూడ ఎస్ఐ కేసు నమోదు చేయాగా.. సీఐ రమేష్ బాబు దర్యాప్తు చేసి కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు జీవిత ఖైదు విధించింది.
ATP: యాడికి మండలం బోయరెడ్డిపల్లి వద్ద ఉన్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో క్రిష్టిపాడుకు చెందిన శివకేశవ అనే కార్మికుడు మృతి చెందగా.. షణ్ముఖ రెడ్డి, దీపక్ సింగ్, ధన్వార్ సింగ్, కంబగిరి స్వామికి త్రీవ గాయాలయ్యాయి. వీరు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సత్యసాయి: గోరంట్ల మండల గుంతపల్లి వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి పుట్టపర్తి మండలం పెడబల్లి తండాకు చెందిన మహేశ్ నాయక్గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తి అదే తండాకు చెందిన రాజేశ్ నాయక్ అని తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
AP: అనంతపురం యాడికి మండలం బోయరెడ్డిపల్లిలోని ఓ సిమెంట్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిశ్రమలోని ఇటుకలు కాలిపోయాయి. కార్మికులపై ఈ కాలిన ఇటుకలు పడడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. వీరి పరిస్థితి విషమంగా ఉన్...
JGL: జిల్లా కేంద్రంలోని సబ్ జైలులో ఖైదీ క్యాతం మల్లేశం (43) గుండెపోటుతో గురువారం ఉదయం మృతి చెందినట్లు జైలు అధికారులు ప్రకటించారు. మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన క్యాతం మల్లేశం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గురువారం ఉదయం గుండెపోటు రావడంతో సబ్ జైలు నుంచి హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు.
ముంబై తీరంలో జరిగిన ఘోర ప్రమాదంలో 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అలాగే, ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున సీఎం సహాయనిధి నుంచి పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు. పీఎం సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.
KRNL: ఆదోనిలోని నాటుసారా, మట్కా నిర్వాహకులపై సిబ్బందితో కలిసి వన్ టౌన్ సీఐ కే.శ్రీరామ్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2,000 లీటర్ల బెల్లం ఊట, 110 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. రూ.లక్ష మట్కా డబ్బులు స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
VZM: గుంతల కారణంగా బైక్పై నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన బొబ్బిలి సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. సీతానగరం మండలం చిన్నబోగిలి గ్రామానికి చెందిన దుప్పాడ ఉషారాణిగా గుర్తించారు. సంఘటన స్థలం వద్దకు పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
NLR: సంగం మండలం పెరమన వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు వైపు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న సిమెంట్ లారీ.. బద్వేల్ వైపు నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని వెంటనే 108 వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
GNTR: తాడేపల్లిలో ఈతకు దిగి వ్యక్తి మృతిచెందిన ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. సీతానగరం కృష్ణా నదిలో కానూరుకు చెందిన రామకృష్ణ ఈతకు దిగి మరణించినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.