MHBD: కోతుల దాడిలో మహిళ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో శుక్రవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తగూడ మండల సమీపంలోని గాదే వాగు అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారిలో బైక్పై వెళ్తుండగా మహిళపై ఒక్కసారిగా కోతులు దాడి చేశాయన్నారు. ఈ దాడిలో మహిళా మృతి చెందిందని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MHBD: కొత్తగూడ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల కేంద్రం సమీపంలోని గాదే వాగు అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులపై కోతులు దాడి చేశాయి. ఈ క్రమంలో బైకు అదుపుతప్పి కింద పడగా మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MHBD: కురవి మండలం గుండ్రాతిమడుగు రైతువేదిక క్లస్టర్ ఏఈవో కళ్యాణ్ సస్పెన్షన్కు గురయ్యారు. ఇటీవల ఆయన ముగ్గురు రైతుల బీమా డబ్బులు తన ఖాతాలోకి మళ్లించి మోసం చేశాడని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు విచారణ చేపట్టగా నేరం రుజువైంది. ఈ క్రమంలో ఏఈవోను విధుల నుంచి తొలగిస్తున్నట్టు గురువారం వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి వెల్లడించారు.
RR: రాజేంద్రనగర్ ఎర్రబోడలో శుక్రవారం ఉదయం ఫ్లిప్ కార్ట్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గోడౌన్లో ఉండే వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. భారీ అగ్నిప్రమాదం దాటికి పొగలు దట్టంగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
RR: రాజేంద్రనగర్ ఎర్రబోడలో శుక్రవారం ఉదయం ఫ్లిప్ కార్ట్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గోడౌన్లో ఉండే వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. భారీ అగ్నిప్రమాదం దాటికి పొగలు దట్టంగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: పశ్చిమగోదావరి జిల్లాలో విస్తుగొలిపే ఘటన చోటుచేసుకుంది. పార్శిల్లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తులసి అనే మహిళకు ఎలక్ట్రిక్ సామాగ్రి అంటూ దుండగుడు పార్శిల్ తీసుకొచ్చాడు. పార్శిల్ బాక్స్లో కుళ్లినస్థితిలో ఏ వ్యక్తి మృతదేహం ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలాన్ని ఎస్పీ నయీమ్ అస్మి పరిశీలించారు. ఉండి మండలంలోని యండగండిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
HYD: సికింద్రాబాద్లో మరో అగ్నిప్రమాదం సంభవించింది. మోండా మార్కెట్లో సంఘటన జరిగిన 24 గంటల్లో మహంకాళి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. తాజ్ మహల్ ట్రై స్టార్ హోటల్ ఎదురుగా ఉన్న పాన్ షాప్లో మంటలు చెలరేగాయి. స్పాట్కి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. షాప్లో దేవుడికి పెట్టిన దీపం అంటుకొని మంటలు ఏర్పడినట్లు గుర్తించారు.
MDK: రామాయంపేట మున్సిపల్ పరిధిలోని కేసీఆర్ కాలనీలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభం నుంచి బ్లాక్ లోనికి వచ్చే మెన్ సర్వీస్ వైర్లు అంటుకోవడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. కాలనీలో ఉన్న 12వ బ్లాకులో కొన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో మంటలు చెలరేగి పలు గృహోపకరణాలు దగ్ధమయ్యాయి.
మధ్యప్రదేశ్లోని భోపాల్లో దారుణం చోటుచేసుకుంది. వైద్య పరీక్షల నిమిత్తం ల్యాబ్కు వెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. దుస్తులు మార్చుకునే గదికి వెళ్లగా సీలింగ్లో మొబైల్ ఫోన్ కనిపించడంతో ఆమె షాక్కు గురైంది. వెంటనే తన భర్తకు ఈ విషయాన్ని తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో మహిళకు సంబంధించిన వీడియోలు కూడా ఆ ఫోన్లో రికార్డు చేసినట్లు గుర్తించిన పోలీసులు ని...
ELR: ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహమ్మద్ షాజహాన్ (47) తన ఇంటి వైపుకు వెళుతూ రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా షాజహాన్ మృతి చెందాడు.
AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బొర్రాగుహలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పినట్లు రైల్వే సిబ్బంది వెల్లడించారు. దీంతో కొత్తవలస-కిరణ్ డోలు మార్గంలోని ప్యాసింజర్ రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నంద్యాలలో అక్రమంగా కుందూ మొరుసును తరలిస్తున్నారు. అక్రమార్కులకు కుందూ మొరుసు కాసుల వర్షం కురిపిస్తుంది. ఉదయం నుంచి రాత్రివరకు కుందూలో యదేచ్చగా తవ్వకాలు జరుపుతున్నారని పీవీ నగర్ వాసులు తెలిపారు. రోజు 20 ట్రాక్టర్లలో మొరుసు తోలుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ మొరుసు ధర రూ.1,600 నుంచి రూ.2,000 వేల వరకు అమ్ముతున్నారు.
కృష్ణా: విజయవాడ రూరల్ మండలంలోని గూడవల్లి జాతీయ రహదారి వెంబడి ఓ కారులో షోరూం పక్కన హోటల్లో గురువారం రాత్రి ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్స్ పేలి మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల షాపులు, నివాసాలలో జనాలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ATP: గుత్తి పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై బైక్పై అక్రమంగా నాటుసారా తరలిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 60 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. బైక్ను సీజ్ చేశారు. 2,200 లీటర్ల నాటుసారా బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఎక్సైజ్ సీఐ మోహన్ రెడ్డి కేసు నమోదు చేశారు.
E.G: మనస్థాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం రమణక్కపేటలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. పదవ తరగతి చదువుతున్న చింతపల్లి నైపుణ్య (16) అనే విద్యార్థిని పరీక్షల సమయం దగ్గర పడుతుందని, చదువుపై దృష్టి పెట్టాలని తల్లి మందలించడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగింది.