ADB: మావల మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇచ్చోడ నుంచి ఆదిలాబాద్కు వెళ్తున్న కార్కు మావల జాతీయ రహదారిపై కుక్క అడ్డు వచ్చింది. దానిని తప్పించబోయే క్రమంలో పక్కనున్న చెట్ల పొదల్లోకి కారు దూసుకు పోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న పవన్, ప్రవీణ్కు తీవ్ర గాయాలయ్యాయి.
NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి సంగం వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీ, జొన్నవాడ వైపు నుంచి పాల క్యాన్లతో బుచ్చి వైపు వస్తున్న ఆటోను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని విచారణ చేపట్టారు.
TPT: వరదయ్యపాలెంలో శుక్రవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. ఓ కంటైనర్ అదుపుతప్పి పక్కనే ఉన్న ఓ గుడిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆలయంలో ముగ్గులు వేస్తున్న గీత(40) స్వల్పగాయాలతో బయటపడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VSP: చోడవరం పాత బస్టాండ్ వద్ద శుక్రవారం రాత్రి మేనల్లుడిని మేనమామ హత్య చేశాడు. స్థానికంగా రెల్లివీధిలో నివాసం ఉన్న మేనల్లుడు ఎస్ ప్రేమ కుమార్ మేనమామ బంగారు దుర్గ చిత్తు కాగితాలు ఏరుకొని వాటిని విక్రయిస్తూ రోజు మద్యం తాగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఇద్దరి మధ్య డబ్బులు విషయంలో గొడవ జరిగింది. మద్యం మత్తులో మేనల్లుడిని చంపినట్టు తెలిపారు.
గద్వాల్: మల్దకల్ మండలం పావనం పల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వెదురు బొంగులు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
SKLM: పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ అశోక్ బాబు తెలిపారు. శుక్రవారం రాత్రి జలుమూరు మండలం నారాయణ వలస సంత నుంచి ఆలమండకు అక్రమంగా రవాణా అవుతున్న 14 పశువులతో వెళుతున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. క్రమంలో పశువులను టెక్కలి లోని భవానీపురం గోశాలకు తరలించామని పేర్కొన్నారు.
కడప: సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి అప్పుల బాధలు భరించలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైతు K.నాగేంద్ర(35) తన భార్య వాణి(35), పిల్లలు భార్గవ్ (16), గాయత్రి (14) ముగ్గురికి ఉరివేసి చంపి తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
NRML: నిద్రమత్తులో టోల్ ప్లాజా డివైడర్ను లారీ ఢీకొన్న ఘటన శుక్రవారం అర్ధరాత్రి సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద జరిగింది. స్థానికుల వివరాల మేరకు అమరావతి నుండి ఓ లోడుతో వస్తున్న(TN 28 BX 6935)టోల్ ప్లాజా వద్దకు రాగానే డివైడర్ను ఢీ కొట్టిందని, డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
SKLM: ప్రయాణించిన బస్సు కిందనే పడి ఒకరు మృతి చెందిన ఘటన రాజాంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజాం బస్టాండ్లో బురాడ గ్రామానికి చెందిన రాజు శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్సులో రాజాం చేరుకున్నాడు. బస్సు నుండి దిగుతుండగా అదుపుతప్పి అదే బస్ టైర్ కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
KDP: పెండ్లిమర్రి మండల పరిధిలోని కొండూరు గ్రామంలో మణికంఠ అనే యువకుడు శుక్రవారం విద్యుత్ షాక్తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. తన ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తూ షాక్కు గురై చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేశారు.
NDL: బనగానపల్లె మండలం, దద్దనాల కాలువ దగ్గర తెల్లవారుజామున రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రమేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని స్వగ్రామం కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాగా పోలీసులు గుర్తించారు. మరొక లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
HYD: ఉద్యోగం రాలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రేవంత్ (25) అమీర్పేట్లో టెక్నికల్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా రాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం అవుషాపూర్ సమీపంలో షిర్డీ ఎక్స్ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
NLR: బాలయపల్లి మండలం పెరిమిడి గ్రామ సమీపంలో సిమెంట్ బస్తాలతో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారం ప్రకారం కలవకూరు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనుల కోసం సిమెంట్ తరలిస్తున్న వాహనం పెరిమిడి గ్రామ సమీపంలో భారీ గుంతలను తప్పించబోయి ప్రమాదానికి గురైందని తెలిపారు.
ATP: గుత్తి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో శుక్రవారం రాత్రి ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కలిసి విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహనాలు తనిఖీల్లో భాగంగా లైసెన్సు లేని 20 వాహనాలకి జరిమానా విధించారు. ప్రతి ఒక్క వాహనదారుడు వాహన పత్రాలను తమ దగ్గర ఉంచుకోవాలని, లేకుంటే తగిన చర్యలు చేపడతామని తెలిపారు.
అన్నమయ్య: ఆటో బోల్తా పడి ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు శుక్రవారం గుర్రంకొండ ఎస్సై మధు రామచంద్రుడు తెలిపారు. కదిరాయచెరువుకు చెందిన ఓ ఆటోడ్రైవర్ గుర్రంకొండ నుంచి తన ఆటోలో ప్రయాణికులతో బయలుదేరాడు. మార్గమధ్యలో సరిమడుగు క్రాస్ వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దిగువ సరిమడుగుకు చెందిన రైతు రెడ్డప్ప(70)తో పాటు మరో ఐదుగురు గాయపడ్డారు.