Amitabh : బిగ్ బీ అమితాబచ్చన్ బంధువుకి ఓ వ్యక్తి కుచ్చుటోపీ పెట్టాడు. కాగా... ఈ కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్య శ్రీధర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు.. హైదరాబాద్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఆలయ పున:నిర్మాణం తర్వాత జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు ఆలయ పాలక మండలి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి రానుండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం వారాంతాల్లో భక్తులు భారీగా వస్తున్నారు. ఇక ఉత్సవాలకు ఆలయం కిటకిటలాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు సరిపడా ఏర్పాట్లు ఉండేందుకు పాలక మండలి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టింది.
నిత్యం కేసీఆర్ వార్త మహారాష్ట్రలో వినిపిస్తుండడంతో అక్కడి ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే మరాఠా ప్రాంతంలోని నాందేడ్ లో సభ నిర్వహించడంతో మరాఠా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీపై ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఫడ్నవీస్ హాజరవడం కూడా మరాఠా ప్రజలు మరచిపోలేదు.
బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో 23 రోజుల పాటు చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం కన్నుమూసిన నందమూరి తారకరత్న మృత దేహాన్ని నిన్న హైదరాబాద్ లోని ఆయన నివాసానికి తరలించారు. నేడు ఉదయం.. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు.
గతంలో నీళ్ల ట్యాంకులు, గుంతల్లో పడడం.. నూనె, సాంబారు తదితర వాటిల్లో పిల్లలు పడిన సంఘటనలు జరిగాయి. కానీ వాషింగ్ మెషీన్ లో బాలుడు పడిన సంఘటన బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. అయినా పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో కొంత జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. పనులు చేస్తున్నప్పుడు పిల్లలపై కూడా కన్నేసి ఉండాలి. లేదంటే ఘోర ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉంది. స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే మనకే మేలు.
రోడ్డుపై కూతురును పట్టుకుని ఆపాలని కోరుతున్నా వాహనదారులు ఆపకపోవడంతోనే పాప ప్రాణం గాల్లో కలిసింది. అదే ఎవరో ఒకరు వాహనం నిలిపి ఉంటే పాప బతికి ఉండేది. శ్రీశైలం మల్లికార్జున స్వామిని వెళ్లి కోరికలు కోరే వారు తాము నిర్వర్తించాల్సిన కనీస ధర్మం చేయకపోతే ఏ దేవుడు కరుణించడు. పైగా ఆపదలో ఆదుకునేవారే దేవుడు అంటారు. అలాంటిది దేవుడుగా మారాల్సిన వాళ్లు మానవత్వం లేకుండా మారుతున్నారు.
Balayya-NTR :నందమూరి తారకరత్న కన్నుమూత అభిమానులను శోక సంద్రంలో పడేసింది. సినిమాల పరంగా అనుకున్నంత స్థాయిలో విజయాలు అందుకోలేకపోయినప్పటికీ.. నటనపరంగా ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తునే వచ్చారు తారక రత్న. ఈ మధ్యే విలన్గా బాబాయ్ బాలయ్య సినిమాలో నటించేందుకు సరికొత్తగా మేకోవర్ అయ్యాడు.
దేశ రాజధాని ఢిల్లీలో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఇంటిపై దాడి చేసిన గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటన పైన పోలీసులకు ఫిర్యాదు చేసిన అసదుద్దీన్. న్యూఢిల్లీలోని అశోకా రోడ్ ప్రాంతంలోని ఆయన నివాసంపై దాడి చేసిన దుండగులు, రాళ్లు విసిరి కిటికీల అద్దాలు పగలగొట్టారు. ఢిల్లీలోని ఆయన నివాసం పై ఈ తరహా దాడి జరగడం ఇది నాలుగోసారి.
KTR Tweet : ఆసిస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా జట్టు ఘన విజయం సాధించింది. మొత్తం నాలుగు టెస్టుల సీరిస్లో ఇప్పటికే ఇండియా రెండు టెస్ట్ మ్యాచ్లను సొంతం చేసుకున్నది. మొదటి టెస్ట్ మ్యాచ్ను మూడు రోజుల్లోనే ముగించగా రెండో టెస్ట్ మ్యాచ్ను సైతం టీమిండియా మూడు రోజుల్లోనే కైవసం చేసుకోవడం విశేషం. ఇక ఈ మ్యాచ్లో స్పిన్నర్లు కీ రోల్ ప్లే చేయగా, విరాట్ కోహ్లీ తన కెరీర్లో ...
పార్టీ సింబల్ విషయంలో తమకు ఏం జరిగిందో అన్ని పార్టీలు చుసాయని, ఇప్పటికైనా బీజేపీతో కలవాలనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరిచింది అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గం అసలైన శివసేన గా గుర్తించిన ఎన్నికల కమిషన్ ఆ వర్గానికి పార్టీ సింబల్ విల్లు - బాణం గుర్తును కేటాయించింది
సామాజిక మాధ్యమాలు ఇలా వసూళ్ల దందాకు తెరలేపాయి. ప్రజలను సామాజిక మాధ్యమాలను వినియోగించుకునేలా అలవాటు చేసిన సంస్థలు ఇప్పుడు అదే ప్రజలను పీల్చుకు తినేలా చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా లేనిది ప్రజలు ఉండలేకపోతున్నారు. సోషల్ మీడియా మాయలో పడి తమ జీవనశైలినే ప్రజలు మార్చుకున్నారు. గంటల కొద్దీ సామాజిక మాధ్యమాల్లో ఉంటూ వృత్తి, వ్యక్తిగత పనులపై శ్రద్ధ కనబర్చలేకపోతున్నారు. ఒక వ్యసనంలా సోషల్ మీడియా విని...
తారకరత్న అకాల మరణం నందమూరి కుటుంబంలో, చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నిన్న హైదరాబాద్ లోని తారకరత్న నివాసానికి వెళ్లి నివాళి అర్పించారు. ఆయన పార్థివదేహాన్ని చూసి బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ సహా పలువురు భావోద్వేగానికి గురయ్యారు. తారకరత్న అంత్యక్రియలు నేడు సాయంత్రం (సోమవారం, 20 ఫిబ్రవరి) మహాప్రస్థానంలో జరగనున్నాయి
అసలు గవర్నర్, ప్రభుత్వం మధ్య విబేధాలకు కౌశిక్ రెడ్డినే కారణం. కౌశిక్ రెడ్డితోనే గవర్నర్, ప్రభుత్వం మధ్య విబేధాలు ప్రారంభమయ్యాయి. కౌశిక్ రెడ్డిని సామాజిక సేవ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని సీఎం కేసీఆర్ గవర్నర్ కు కోరారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్ కు అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్ తమిళిసైకు పంపించారు. ప్రభుత్వ తీర్మానాన్ని గవర్నర్ కొన్నాళ్లు అంటిపెట్టుకున్నారు. ఎంతకీ స్...
ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. సీఎం జగన్ పాలనలో విద్యార్థులకు రక్షణ లేదని ఆరోపించారు. ర్యాగింగ్ ను అరికట్టాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. జగన్ పాలనలో గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని తెలిపారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కళాశాలలో ఆగడాలు పెరిగిపోతున్నాయని.. వెంటనే కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.