మంచి బాడీ షేప్స్, కండలు తిరిగిన మజిల్స్, సిక్స్ ప్యాక్ కోసం యువకులు ఎక్కువగా జిమ్ సప్లిమెంట్లను వాడుతూ ఉంటారు. అయితే వీటి వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు. ఇటీవల ఢిల్లీలో ఓ 22 ఏళ్ల యువకుడు దీర్ఘకాలంగా జిమ్ సప్లిమెంట్స్ వాడుతూ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స చేయించుకున్నాడు.
కర్ణాటకలో ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారుల మధ్య లొల్లి అక్కడి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. IAS అధికారిణి రోహిణి సింధూరి వ్యక్తిగత ఫోటోలను.. IPS అధికారిణి డీ రూప మౌద్గిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు లొల్లి మొదలైంది. వీరి గొడవ ఎంటో తెలుసుకోవాలంటే కింది వార్తను చదివాల్సిందే.
30 Years Prudhvi : సినీ నటుడు తారకరత్న తుదిశ్వాస విడిచారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన ఆయన గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. 23 రోజులు వెంటిలేటర్ పై చికిత్స పొందిన ఆయన శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతి పై అందరూ విచారం వ్యక్తం చేశారు.
కాలేజ్ అమ్మాయిలు డాన్స్ చేస్తుంటే మధ్యలో మహిళా ప్రొఫెసర్లు కూడా వచ్చి జాయిన్ అయితే ఎలా ఉంటుంది. క్రేజీ కాదా. అవును. ఈ వీడియోలో అదే జరిగింది. ఢిల్లీలోని జీసెస్ & మేరీ కాలేజ్ విద్యార్థినులు ఫ్లాష్ మాబ్ చేస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Viral News : పులిని వేటాడం గురించి విని ఉంటారు. కానీ... పులిని చంపి.. దానిని వండుకొని తినడం గురించి ఎప్పుడైనా విన్నారా..? అసలు ఎవరైనా తింటారా అని ఆశ్చర్యపోకండి. నిజంగానే తిన్నారు. ప్రకాశం జిల్లా అక్కపాలెంలో ఈ సంఘటన చోటుచేసుకోగా.... ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, మరో 60 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో చోటుచేసుకుంది.
హైదరాబాద్(Hyderabad) లో వేసవి తాపం ప్రారంభమైంది. ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ వారం ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెడతాం లోన్ కావాలని తెలంగాణ ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసిందన్నారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెడతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. మరోవైపు సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం వాటా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రైవేటు పరం చేస్తుందని నిలదీశారు.
Crime : తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ 47ఏళ్ల వ్యక్తి 16 ఏళ్ల మైనర్ బాలికను బెదిరించాడు. ఆమె అంగీకరించలేదని.. మెడపై కత్తి పెట్టి... జుట్టుపట్టుకొని లాక్కెళ్లాడు. ఈ అమానుష ఘటన ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ లో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు.
Balayya - Tarak : నందమూరి తారకరత్న మరణం అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 23 రోజుల పాటు మరణంతో పోరాడి 39 ఏళ్లకే తుదిశ్వాస విడిచారు నందమూరి తారకరత్న. అది కూడా నాలుగు రోజుల్లో పుట్టిన రోజు ఉండగా.. తారక రత్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం.. మరింత కలిచివేసింది.
శివసేన పార్టీ(shiv Sena), గుర్తు (symbol) విషయమై ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray) గ్రూపు భారత అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టును (supreme court) ఆశ్రయించింది. అయితే అక్కడ కూడా షాక్ తగిలింది. శివసేన, ఎన్నికల గుర్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం స్పష్టం చేసింది. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఉద్ధవ్ థాక్రే. అయితే ఈ కేసు ఆర్...
వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులు ఆదరించారు. ఇక మరో దర్శకుడు దొరైతో కలిసి భగవాన్ అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించాడు. వీరిద్దరూ కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందారు. దాదాపు 30 నుంచి 40 సినిమాల దాకా వీరిద్దరూ కలిసి పని చేశారు. 2000 సంవత్సరంలో దొరై కన్నుమూయగా.. తాజాగా భగవాన్ తుదిశ్వాస విడిచారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం, అదానీ కుంభకోణం బయటకు రావడంతో బీజేపీ నిరాశకు గురవుతోంది. వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు ఈడీ సోదాలు చేపట్టింది. పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్న సమయాన దాడులు జరిగాయి. అయితే ఇవేవీ మమ్మల్ని అడ్డుకోలేవు’ అని పేర్కొన్నారు.