తెనాలిలో (Tenali) నాలుగో సంవత్సరం వైయస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ (PM Kisan) నిధులను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి (Andhra Pradesh Chief Minister) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) మంగళవారం విడుదల చేశారు. ఆయన తన తాడేపల్లి ప్యాలెస్ (tadepalli palace) నుండి తెనాలికి (Tenali) హెలికాప్టర్ పైన రావడం చాలామందిని విస్మయపరిచింది. దీనిపై జనసేన (Janasena) పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నా...
వెంటనే తమకు తెలిసిన కుటుంబసభ్యులు, బంధువులకు ఫోన్ లో సమాచారం అందించింది. వారు వెంటనే ఇంటికి చేరుకుని అలేఖ్యను కిందకు దించారు. అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. ఆమె 11 ఏళ్ల కుమారుడు విజయవాడలోని ఓ హాస్టల్ లో ఉంచి చదివిస్తున్నది.
Prahlad Modi : ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ఆస్పత్రి పాలయ్యారు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కాగా.. అకస్మాత్తుగా ఆయన అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు ఆయనను.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.
once again chief minister:ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ తానే సీఎం అవుతానని చెప్పారు. ఆ దేవుడు తనను దీవించాడని.. అర్థం చేసుకోవాలని కోరారు. మంచి మనసుతో చేసే పరిపాలనను ఆ దేవుడు కూడా ఆశీర్వదిస్తాడని అన్నారు. అందుకే వర్షాలు సమృద్దిగా పడుతున్నాయని పేర్కొన్నారు.
వేసవి కాలం (Summer) కావడంతో ఇప్పుడు దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించడంపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఈసారి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తే అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
Telangana News : తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది. భూపాలపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్లెక్సీ తో మొదలైన వైరం.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కేసీఆర్ పర్యటనలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ , ఫ్లెక్సీలను ఇంకా తీయలేదని కాంగ్రెస్ శ్రేణులు నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు.
Sourav Ganguly : రిషభ్ పంత్ ఎప్పుడెప్పుడు మైదానంలోకి అడుగుపెడుతాడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ షాకిచ్చాడు. పంత్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడానికి కనీసం రెండేళ్లు అయినా పడుతుందని ఆయన చెప్పడం గమనార్హం.
తెలంగాణ పల్లె నేపథ్యంలో ఉంది. దర్శి పక్కన హీరోయిన్ గా కావ్య కల్యాణ్ రామ్ నటిస్తుండగా సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్ ను చూస్తే కొమురయ్య పాత్ర చుట్టూ సినిమా తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. పల్లెటూరులో ఉన్న కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్ర కథ కొనసాగుతున్నది.
వరుసగా దాడులు చేస్తుండడంతో కలకలం రేపుతున్నది. అధికార పార్టీనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐటీతో పాటు ఈడీ (Enforcement Directorate) దాడులు కూడా తరచూ జరుగుతున్నాయి.
వరుస భూకంపాలు(Earthquakes) ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మంగళవారం పలు చోట్ల భూకంపాలు(Earthquake) చోటుచేసుకున్నాయి. మణిపూర్లోని నోనీలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2.46 గంటలకు నోనీలో భూ ప్రకంపనలు జరిగాయి. రిక్టర్ స్కేలు(Richter scale)పై 3.2 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్ లో కూడా భూకంపాలు(Earthquakes) వచ్చాయి.
జగన్ ఎక్కడ పర్యటిస్తే అక్కడ ప్రజలు తీవ్ర కష్టాలు పడాల్సిన పరిస్థితి. దీనిపై ప్రతిపక్షాలు సీఎం జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెనాలి పర్యటన సమయంలో కూడా అవే దృశ్యాలు కనిపించాయి. కానీ ఈసారి వైసీపీ మరింత రెచ్చిపోయి చివరకు మొక్కజొన్న కంకులకు కూడా పార్టీ రంగులు (YCP Colors) వేయడం గమనార్హం.
ఐదు రోజులు మృత్యువుతో పోరాడి ఆదివారం మెడికో ప్రీతి(Medico Preeti) కన్నుమూసిన సంగతి తెలిసిందే. వరంగల్ ఎంజిఎం(MGM) ఆస్పత్రిలో మెడిసిన్ చేస్తున్న ప్రీతి సీనియర్ వేధింపుల వల్ల ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హైదరాబాద్ నిమ్స్(NIMS)లో ఆమెకు వైద్య చికిత్స అందించినా కోలుకోలేకపోయింది. తాజాగా ప్రీతి కేసు(Preeti Case)లో తెరపైకి మరో కొత్త కారణం బయటికొచ్చింది.
భర్తతో గొడవపడి జీవితం మీద విరక్తితో పాపతో సహా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. వెంటనే స్పందించిన దిశా పోలీసులు ఆమె భర్తను పిలిపించి మాట్లాడారు. అతడికి సర్దుబాటు చేశారు. ఏదైనా సమస్యలు ఉంటే పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని దిశా పోలీసులు హితవు పలికారు.
డొక్కు వాహనం తనకు వద్దని మంచి కండిషన్ లో ఉన్న వాహనం కేటాయించాలని రాజా సింగ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఆయన చేస్తున్న ఆందోళనకు ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి తాజాగా ఇన్నోవా వాహనం కల్పించింది. అయితే ఈ వాహనం కూడా పాతదే. 2017 మోడల్ కావడం గమనార్హం. దీనిపై రాజా సింగ్ స్పందిస్తూ వాహనం ఏదైనా పర్లేదు. కానీ మంచి కండీషన్ లో ఉంటే చాలని పేర్కొన్నాడు.
వరుస భూకంపాలు(Earthquakes) ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా టర్కీ(Turkey)లో మరోసారి భూకంపం సంభవించింది. మలాట్యా ప్రావిన్స్ లోని ఎసిల్యర్ట్ నగరంలో సోమవారం భారీ భూకంపం(Earthquakes) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది. ఈ భూకంపం వల్ల అనేక భవనాలు కుప్పకూలాయి. భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.