ఓ బాలుడు దొంగా పోలీస్ వంటి హైడ్ అండ్ సీక్ (Hide and Seek) గేమ్ ఆడుతూ ఏకంగా తన దేశాన్ని దాటి, మరో దేశానికి వెళ్లిన ఆసక్తికర సంఘటన బంగ్లాదేశ్ (Bangladesh)లో జరిగింది.
ప్రధాని (prime minister of india) నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ (PM Kisan) స్కీమ్ కింద భారత ప్రభుత్వం రూ.16,800 కోట్లను విడుదల చేయడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి (Vijaya Sai Reddy) సోషల్ మీడియా (Social Media) అనుసంధాన వేదిక ట్విట్టర్ (Twitter)లో కొనియాడారు.
తెలంగాణను కొత్త రాష్ట్రంగా భారతదేశ మ్యాప్ లో తీసుకువచ్చిన కేసీఆర్ కు, నాటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు. తెలంగాణను కేసీఆర్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకువచ్చారో అందరికీ తెలుసు. తెలంగాణ సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ ది. తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా నిలుపుతున్న కేటీఆర్ కు ధన్యవాదాలు.
కేంద్ర ప్రభుత్వం తమ నడ్డి విరుస్తోందని ప్రజలు వాపోతున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తమపై గుదిబండ మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ల సేవలో మునిగి తేలుతున్న మోదీ ప్రజలపై మాత్రం మోయలేని భారం మోపుతున్నారని విమర్శిస్తున్నాయి. బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంటున్నాయి.
పరారీలో ఉన్న స్వయంప్రకటిత గాడ్-మ్యాన్ నిత్యానంద కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసకు (United States of KAILASA) చెందిన ప్రతినిధులు జెనీవాలో స్థిర అభివృద్ధిపై చర్చ సందర్భంగా పాల్గొన్నట్లుగా వార్తలు వచ్చాయి.
భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకల సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ పాలక మండలి సిద్ధమైంది. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాల మేరకు పాలకమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తున్నది. ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది.
గుంటూరు జిల్లాలో రైతు భరోసా పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నీ అబద్దాలు చెప్పారని, అసలు వాస్తవాలను దాచి, తామేదో చేసినట్లు చెప్పుకుంటున్నారని తెలుగు దేశం పార్టీ విమర్శలు గుప్పించింది.
దాడికి పాల్పడిన వారికి ఇదే నా హెచ్చరిక. వంద మందిని తీసుకొచ్చి మా సభపై దాడి చేయిస్తావా? దమ్ముంటే నువ్వు రా బిడ్డా.. ఎవరినో పంపించి వేషాలు వేస్తున్నారు. నేను అనుకుంటే నీ థియేటర్ కాదు.. నీ ఇల్లు కూడా ఉండదు. అంబేడ్కర్ చౌరస్తాకు రా.. నిన్ను పరిగెత్తించకపోతే ఇక్కడే గుండు కొట్టించుకుని పోతా
ఓ కార్యక్రమంలో భాగంగా ఓ వ్యక్తి చేసిన నెక్ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. ఈ వీడియోను ఓ డాక్టర్ నెట్టింట పోస్ట్ చేయగా..ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది.
స్టార్ హీరో రామ్ చరణ్, తన భార్య ఉపాసన కామినేని వారి బిడ్డకు అమెరికాలో జన్మనివ్వబోతున్నట్లు వచ్చిన పుకార్లపై ఉపాసన క్లారిటీ ఇచ్చింది. అవన్నీ నిజాలు కాదని ఇండియాలోనే తాను చిన్నారికి జన్మనివ్వనున్నట్లు స్పష్టం చేసింది.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) తమ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. తనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయకుంటే తాను వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని తేల్చి చెప్పారు. తనకు ఇతర పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ ఉద్దేశం లేదన్నారు. అయితే తనకు బీజేపీ నాయకత్వం తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు.
తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్స్ తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మరోవైపు గ్రూప్ 4 ఉద్యోగాల్లో అనేక జిల్లాలలో తమకు పోస్టులను కేటాయించడంలో అన్యాయం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు.
భాగ్యనగరంలో ఇటీవల కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు ప్రదీప్ వార్త సంచలనంగా మారింది. అయితే ఈ బాలుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తాజాగా జీహెచ్ఎంసీ ప్రకటించింది. వీటిలో కార్పొరేటర్ల నెల జీతం నుంచి రూ.2 లక్షలు, మిగతావి జీహెచ్ఎంసీ నుంచి ఇస్తామని వెల్లడించింది.
సైఫ్ (saif) రూపంలో ర్యాగింగ్ భూతానికి బలైన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) విద్యార్థిని ప్రీతి నాయక్ వేధింపుల పర్వం గురించి కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ (Kakatiya Medical College) మోహన్ దాస్ స్పందించారు.