తిరుపతి(Tirupathi)లోని పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ఆస్పత్రి(Padmavathi childrens hospital) మరో బిడ్డకు ప్రాణం పోసింది. నెల రోజుల వ్యవధిలోనే రెండవ గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసి అరుదైన రికార్డును నెలకొల్పింది. పక్కా ప్రణాళికతో గ్రీన్ ఛానల్ కూడా లేకుండా చెన్నైలో బ్రెయిన్ డెడ్(Brain Died) అయిన రెండేళ్ల బాలుడి గుండెను సేకరించి తిరుపతిలోని 13 ఏళ్ల పాపకు ప్రాణం పోసింది. ఈ విషయాన్ని టీటీడీ(TTD)...
KTR : మెడికో ప్రీతి మరణ వార్త తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి కలకలం రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీనియర్ వేధింపులు తాళలేక ప్రీతి బలవన్మరణానికి పాల్పడింది. దాదాపు ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో పోరాడి ఆమె ప్రాణాలు కోల్పోయింది.
సామాన్యులకు మళ్లీ షాక్ తగిలింది. కేవలం నెల రోజుల్లోనే వేరుశనగ నూనె(Peanut Oil) ధర మరోసారి పెరిగింది. లీటరుకు రూ.15 నుంచి రూ.20లకు చేరింది. ఫిబ్రవరి 26వ తేదికి వేరుశనగ నూనె(Peanut Oil) ధర లీటరుకు రూ.180కి చేరింది. పామాయిల్(Palm Oil) ధర చూసినట్లైతే లీటరుకు రూ.3 నుంచి రూ.5లకే పెరిగింది. దీంతో ప్రస్తుతం పామాయిల్(Palm Oil) ధర రూ.104లకు చేరింది. ఇకపోతే పొద్దుతిరుగుడు నూనె(Sunflower Oil) ధర లీటరకు రూ....
గుజరాత్లో వరుస భూకంపాలు(Earthquake) భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం రాజ్ కోట్ వద్ద భూకంపం(Earthquake) సంభవించిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం మరో రెండు సార్లు భూకంపాలు సంభవించాయి. వరుసగా రెండు సార్లు భూ ప్రకంపనలు(Earthquake) జరగడంతో ప్రజలు భయాందోళన చెందారు.
Ayyanna Pathrudu : టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి సుప్రీం కోర్టులో ఊహించని షాక్ తగిలింది. అయ్యన్నపాత్రుడుపై ఫోర్జరీ కేసు దర్యాప్తుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఫోర్జరీ సెక్షన్లు ఐపీసీ సెక్షన్ 467 కింద దర్యాప్తు చేయవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.
భారతీయ జనతా పార్టీ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ ను కేంద్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతోపాటు మమతా కుమారి, డెలినా కోంగ్డప్ లను కూడా నియమించారు. వీరు ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు.
Medico Preethi : మెడికల్ స్టూడెంట్ ప్రీతి అంత్యక్రియలు ముగిసాయి. ప్రీతి స్వగ్రామం జనగామ జిల్లా కొడగండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాలోని కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.
ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాల్లో మహిళల విషయంలో దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. మహిళలపై వివక్ష కొనసాగుతోంది. ఈ దేశాల్లో పాలకుల నుంచి మహిళలు, బాలికల పట్ల కఠిన రూల్స్ ఎదురవుతున్నాయి. తాజాగా ఇరాన్ లో బాలికలను విద్యకు దూరం చేసేందుకు వారిపై విష ప్రయోగం చేసిన ఘటన వెలుగుచూసింది.
fire accident at renigunta:ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో గల రేణిగుంటలో (renigunta) భారీ అగ్నిప్రమాదం జరిగింది. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో మంటలు చెలరేగాయి. ఫాక్స్ లీక్ కంపెనీలో (fox leak company) ప్రమాదం సంభవించి.. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీ అధికారుల సమాచారంతో వెంటనే అక్కడికి మూడు ఫైరింజన్లతో (fire engines) అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. ఆ మంటలను (fire) ఆర్పివేస్తున్నారు...
మహారాష్ట్రలో రైతుల తరఫున మాణిక్ కదమ్ ప్రాతినిధ్యం వహించనున్నారు. దేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలో సంభవిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. దీంతో వారిని ఆకట్టుకునేందుకు ముందుగా కిసాన్ సెల్ పైనే కేసీఆర్ దృష్టి సారించారు.
ప్రముఖ నటి రష్మిక మందాన్న (Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దక్షిణాదిన, బాలీవుడ్ లో సినిమా ప్రియులందరికీ ఆమె పేరు సుపరిచితం.
తెలంగాణ ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. తెలుగు దేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు వరి అన్నం తెలిసిందన్న ఆయన వ్యాఖ్యలపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. పదకొండవ శతాబ్ధం నాటికే కాకతీయుల కాలంలో...
love harassment to rakshita:మెడికో ప్రీతి మృతి వీడకముందే ఇంజినీరింగ్ విద్యార్థిని రక్షిత సూసైడ్ కలకలం రేపింది. తొలుత రక్షిత కూడా ర్యాగింగ్ వల్లే చనిపోయిందని ప్రచారం జరిగింది. అయితే ఆమె ర్యాగింగ్ వల్ల చనిపోలేదని.. రాహుల్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధించడం వల్లే బలవన్మరణానికి పాల్పడిందని తెలిసింది.
నెటిజన్లు ప్రీతి మృతికి సంతాపం తెలుపుతూ, ఆమెకు న్యాయం చేయాలంటూ '#JusticeForDrPreethi' అంటూ ట్వీట్ చేస్తున్నారు. భారత సమాజం ఆమెకు న్యాయం జరగాలని ఎంతలా కోరుకుంటుందంటే... అందుకు '#JusticeForDrPreethi' టాప్ ట్రెండింగ్ లో నిలవడమే నిదర్శనం.
దొంగతనం ఘటనతో ప్రస్తుతం ఆలయ అభివృద్ధిపై కొంత వెనుకడుగు పడినట్లు తెలుస్తున్నది. ప్రసిద్ధ ఆలయంలో చోరీకి గురవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దొంగతనానికి పాల్పడిన వారిని పట్టుకున్నారు.