• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

విషాదం నింపిన విహార యాత్ర

ELR: ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి వద్ద ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఘంటశాలకు చెందిన భాను ప్రకాశ్, గౌతమ్, వెంకట సాయి, చల్లపల్లికి చెందిన భార్గవ్, తేజలు విజయవాడ నుంచి కారు అద్దెకు తీసుకుని మారేడుమిల్లి విహార యాత్రకు బయలు దేరారు. నాగులపల్లి వద్ద బుధవారం ముందు వెళుతున్న లారీని కారు ఢీకొట్టింది. 

December 26, 2024 / 09:41 AM IST

టెక్కలి లో కారు ఢీకొని ఒకరికి గాయం

SKLM: టెక్కలి మండలం స్థానిక జగతిమెట్ట సమీప సర్వీస్ రోడ్‌లో గురువారం ఉదయం కారు ఢీకొని వ్యక్తికి తలకు బలమైన గాయం అయ్యింది. కారు నడుపుతున్న డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడ్డ వారిని హైవే అంబులెన్స్ సిబ్బంది టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

December 26, 2024 / 09:30 AM IST

యాక్సిడెంట్‌లో వ్యక్తికి గాయాలు.. చికిత్స పొందుతూ మృతి

ATP: గుత్తి పట్టణంలోని మన్రో సత్రం వద్ద ఈనెల 22న ఆదివారం రాత్రి బైక్‌ను ఆటో ఢీకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో శ్రీరాములు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.

December 26, 2024 / 09:20 AM IST

BREAKING: ఎస్సై మృతదేహం లభ్యం

TG: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో బిక్కనూరు ఎస్సై సాయికుమార్ మృతదేహం లభ్యమైంది. కాగా, నిన్న రాత్రి కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే.

December 26, 2024 / 08:52 AM IST

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

SKLM: రణస్థలం మండలం నెలివాడ గ్రామంలో ఈరోజు పైవంతెన కింద నుంచి పీసీని గ్రామానికి వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని శ్రీకాకుళం-విశాఖపట్నం వెళుతున్న RTC బస్సు ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇజ్జాడ త్రినాధరావు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన 108 అంబులెన్సులో శ్రీకాకులం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

December 26, 2024 / 08:47 AM IST

మానవత్వం చాటుకున్న కావలి ఎమ్మెల్యే

NLR: బోగోలు మండలం కడనూతల శివారులో బుధవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తి అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి గాయపడ్డాడు. బిట్రగుంటలో క్రిస్మస్ వేడుకలు పూర్తి చేసుకొని కావలికి వెళ్తున్న ఎమ్మెల్యే వెంకట క్రిష్ణారెడ్డి ప్రమాదాన్ని గమనించారు. బాధితుడి వద్దకు వెళ్లి తక్షణమే ఆసుపత్రికి తరలించారు.

December 26, 2024 / 08:31 AM IST

మానవత్వం చాటుకున్న కావలి ఎమ్మెల్యే

NLR: బోగోలు మండలం కడనూతల శివారులో బుధవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తి అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి గాయపడ్డాడు. బిట్రగుంటలో క్రిస్మస్ వేడుకలు పూర్తి చేసుకొని కావలికి వెళ్తున్న ఎమ్మెల్యే వెంకట క్రిష్ణారెడ్డి ప్రమాదాన్ని గమనించారు. బాధితుడి వద్దకు వెళ్లి తక్షణమే ఆసుపత్రికి తరలించారు.

December 26, 2024 / 08:31 AM IST

బావిలో దూకి కానిస్టేబుల్ భార్య సూసైడ్

CTR: కానిస్టేబుల్ భార్య సూసైడ్ చేసుకున్న ఘటన నగరంలో బుధవారం చోటుచేసుకుంది. నగరంలోని టి.చవటపల్లెకు చెందిన హేమంత్ చిత్తూరు ఆర్ముడ్ రిజర్వు విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఆయన భార్య దేవి(40) గతంలో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించారు. బుధవారం మూడోసారి పిచోటపల్లిలోని బావిలో దూకి మృతి చెందింది. ఎస్సై రమేశ్ కేసు నమోదు చేశారు.

December 26, 2024 / 08:19 AM IST

బావిలో దూకి కానిస్టేబుల్ భార్య సూసైడ్

CTR: కానిస్టేబుల్ భార్య సూసైడ్ చేసుకున్న ఘటన నగరంలో బుధవారం చోటుచేసుకుంది. నగరంలోని టి.చవటపల్లెకు చెందిన హేమంత్ చిత్తూరు ఆర్ముడ్ రిజర్వు విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఆయన భార్య దేవి(40) గతంలో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించారు. బుధవారం మూడోసారి పిచోటపల్లిలోని బావిలో దూకి మృతి చెందింది. ఎస్సై రమేశ్ కేసు నమోదు చేశారు.

December 26, 2024 / 08:19 AM IST

మనుబోలులో ఆటో బోల్తా.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

NLR: మనుబోలు మండల పరిధిలోని కొమ్మలపూడి క్రాస్ రోడ్డు సమీపంలోని వంతెనపై ఆటో బోల్తా పడటంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మనుబోలు కోదండరామ పురానికి చెందిన శాంతి సేవ సంస్థ అధ్యక్షుడు ఆనంద్, ఆర్టీసీ డ్రైవర్ సంపత్ కుమార్ అన్నదమ్ములు. వీరు సొంత ఆటోలో నెల్లూరుకి పని మీద వెళ్లి తిరిగి సొంత ఊరికి వస్తుండగా కొమ్మలపూడి క్రాస్ రోడ్ సమీపంలోని ప్రమాదం జరిగింది.

December 26, 2024 / 08:05 AM IST

మనుబోలులో ఆటో బోల్తా.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

NLR: మనుబోలు మండల పరిధిలోని కొమ్మలపూడి క్రాస్ రోడ్డు సమీపంలోని వంతెనపై ఆటో బోల్తా పడటంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మనుబోలు కోదండరామ పురానికి చెందిన శాంతి సేవ సంస్థ అధ్యక్షుడు ఆనంద్, ఆర్టీసీ డ్రైవర్ సంపత్ కుమార్ అన్నదమ్ములు. వీరు సొంత ఆటోలో నెల్లూరుకి పని మీద వెళ్లి తిరిగి సొంత ఊరికి వస్తుండగా కొమ్మలపూడి క్రాస్ రోడ్ సమీపంలోని ప్రమాదం జరిగింది.

December 26, 2024 / 08:05 AM IST

గ్యాస్ లీక్ ఘటనలో క్షతగాత్రుల వివరాలు

VSP: ఓల్డ్ డైరీ ఫామ్ ఇందిరాగాంధీనగర్లోని బుధవారం రాత్రి గ్యాస్ లీకైన ఘటనలో గాయపడ్డ వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాజశేఖర్ (11) 45%, సత్యవతి (28) 50%శాతం, టి. చంద్రశేఖర్ (13)26%, పి.వెంకట్రావు (30) 20% శాతం కాలిన గాయాలవ్వగా.. జి.జస్మిత్ అనే బాలుడి తలకు చిన్న గాయమైంది. ఈ ఘటనలో ప్రమాద ధాటికి గోడ ధ్వంసం అయ్యింది.

December 26, 2024 / 07:57 AM IST

గ్యాస్ లీక్ ఘటనలో క్షతగాత్రుల వివరాలు

VSP: ఓల్డ్ డైరీ ఫామ్ ఇందిరాగాంధీనగర్లోని బుధవారం రాత్రి గ్యాస్ లీకైన ఘటనలో గాయపడ్డ వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాజశేఖర్ (11) 45%, సత్యవతి (28) 50%శాతం, టి. చంద్రశేఖర్ (13)26%, పి.వెంకట్రావు (30) 20% శాతం కాలిన గాయాలవ్వగా.. జి.జస్మిత్ అనే బాలుడి తలకు చిన్న గాయమైంది. ఈ ఘటనలో ప్రమాద ధాటికి గోడ ధ్వంసం అయ్యింది.

December 26, 2024 / 07:57 AM IST

ఎస్సై ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు

TG: కామారెడ్డి జిల్లాలో ఆత్మహత్యలు కలకలం సృష్టించాయి. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దూకి కానిస్టేబుల్ శృతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెతోపాటు బిక్కనూరు ఎస్సై సాయికుమార్, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ చెరువులో దూకారు. ఎస్సై కారు, చెప్పులు, నిఖిల్‌ పాదరక్షలూ కనిపించాయి. అనుమానంతో చెరువులో గాలించడంతో ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. ఎస్సై ఆచూకీ తెలియాలి.

December 26, 2024 / 07:36 AM IST

ఎస్సై ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు

TG: కామారెడ్డి జిల్లాలో ఆత్మహత్యలు కలకలం సృష్టించాయి. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దూకి కానిస్టేబుల్ శృతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెతోపాటు బిక్కనూరు ఎస్సై సాయికుమార్, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ చెరువులో దూకారు. ఎస్సై కారు, చెప్పులు, నిఖిల్‌ పాదరక్షలూ కనిపించాయి. అనుమానంతో చెరువులో గాలించడంతో ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. ఎస్సై ఆచూకీ తెలియాలి.

December 26, 2024 / 07:36 AM IST