• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప స్వామికి తీవ్ర గాయాలు

HNK: కాజీపేట మండలం మడికొండ ప్రధాన రహదారిపై నేడు లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో రాజేష్ అనే అయ్యప్ప స్వామి తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం రోడ్డు క్రాస్ చేస్తున్న రాజేష్ వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. కుడికాలు నుజ్జు నుజ్జు కావడంతో 108 సర్వీస్‌లో ఆసుపత్రికి తరలించారు.

December 26, 2024 / 01:54 PM IST

క్వారీ గుంతలో దూకి యువకుడు ఆత్మహత్య..?

MHBD: క్వారీ గుంతలో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలిసులు అనుమానిస్తున్న ఘటన తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో ఉన్న చెప్పుల ఆధారంగా బాధితుడు అమ్మాపురం గ్రామానికి చెందిన హరీశ్(17)గా పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 26, 2024 / 01:45 PM IST

క్వారీ గుంతలో దూకి యువకుడు ఆత్మహత్య..?

MHBD: క్వారీ గుంతలో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలిసులు అనుమానిస్తున్న ఘటన తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో ఉన్న చెప్పుల ఆధారంగా బాధితుడు అమ్మాపురం గ్రామానికి చెందిన హరీశ్(17)గా పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 26, 2024 / 01:45 PM IST

నిన్న రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

WGL: ప్రమాదవశాత్తు చెట్టుకొమ్మతగిలి వ్యక్తికి తీవ్రగాయాలై చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. వర్ధన్నపేట మండలం కట్ర్యాల శివారులో జాతీయ రహదారిపై కడారిగూడెం గ్రామానికి చెందిన దోపతి రవీందర్ రెడ్డి అనే వ్యక్తి నిన్న ఇల్లంద గ్రామానికి వెళ్లి తిరిగి కడారిగూడెం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు.

December 26, 2024 / 01:35 PM IST

వృద్ధుడిపై దాడి చేసిన వీధి కుక్క

SKLM: టెక్కలి మండలం సుఖదేవుపేట గ్రామానికి చెందిన బీ.నారాయణరావు అనే వృద్ధుడిపై గురువారం వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గ్రామంలో నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆయనపై కుక్క దాడి చేసిందని కుటుంబసభ్యులు తెలిపారు. వృద్ధుడిని చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇటీవల వీధి కుక్కల దాడులు ఎక్కువయ్యాయని స్థానికులు వాపోతున్నారు.

December 26, 2024 / 01:18 PM IST

ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టిన టిప్పర్ లారీ

వరంగల్: కాజీపేట మండలం మడికొండ చౌరస్తాలో గురువారం ద్విచక్ర వాహనదారుడిని టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటనలో ముచ్చర్ల గ్రామానికి చెందిన రాజేష్ అయ్యప్ప మాలదారుడి కుడికాలు మొత్తం నుజ్జు నుజ్జు అయింది. ప్రమాదం జరిగిన వెంటనే 108 ద్వారా మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మడికొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

December 26, 2024 / 12:59 PM IST

సామర్లకోటలో రోడ్డు ప్రమాదం… వ్యక్తి మృతి

KKD: సామర్లకోటలో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.‌ గురువారం సామర్లకోట మండలం మాధపట్నం సమీపంలో లారీ, బైక్‌ను ఢీకొంది. సంఘటనలో వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడు వివరాలు తెలియాల్సి ఉంది.

December 26, 2024 / 12:55 PM IST

తాడేపల్లిలో రైల్వేకోడూరు కానిస్టేబుల్ మృతి

కడప: 95వ బ్యాచ్, 11వ బెటాలియన్లో ఉద్యోగం చేస్తున్న రైల్వేకోడూరు మండలానికి చెందిన రాజయ్య సీఎం క్యాంప్ కార్యాలయానికి 15 రోజుల క్రితం డ్యూటీ నిమిత్తం తాడేపల్లికి వెళ్లారు. రెండు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా గురువారం చికిత్స నిమిత్తం మణిపాల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్టు ధ్రువీకరించారు.

December 26, 2024 / 12:09 PM IST

బైక్, లారీ ఢీ.. మహిళ మృతి

కడప: సిద్దవటం మండలంలోని కడప-చెన్నై జాతీయ రహదారి కనుమలోపల్లి సమీపంలోని మందగిరి శనీశ్వరుని ఆలయం వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోటార్ బైక్‌ను లారీ ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 26, 2024 / 11:19 AM IST

సోమశిలకు తగ్గముఖం పట్టిన వరద

NLR: సోమశిల జలాశయానికి వరద తగ్గుముఖం పట్టినట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 2,577 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 71.923 టీఎంసీల నీటిమట్టం నమోదయింది. పెన్నా డెల్టాకు 1500 క్యూసెక్కులు, కండలేరుకు 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

December 26, 2024 / 10:37 AM IST

ఎస్సై సాయికుమార్ గ్రామంలో విషాదఛాయలు

TG: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్దచెరువులో భిక్కనూరు ఎస్సై సాయికుమార్ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. అయితే, సాయికుమార్ స్వగ్రామం కొల్చారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్సై మృతిపై గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాయికుమార్ మృతిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 26, 2024 / 10:26 AM IST

ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్టు

VZM: బొబ్బిలి మున్సిపాల్టీ పరిధి పల్లె వీధిలో బుధవారం పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశామని పట్టణ ఎస్ఐ రమేష్ తెలిపారు. మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా, రహస్యంగా పేకాడుతున్న ఐదుగురిని పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.9,100లను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. నిందితులంతా స్థానిక పల్లె వీధికి చెందిన వారేనని, వారిపై కేసు నమోదు చేశారు.

December 26, 2024 / 10:02 AM IST

బెల్ట్ షాప్ నిర్వాహకుడు అరెస్ట్

ELR: గణపవరం మండలం సరిపల్లె గ్రామంలో తాడేపల్లిగూడెం ఎక్సైజ్ సీఐ స్వరాజ్యలక్ష్మి ఆదేశాలతో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద 10 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు సిఐ స్వరాజ్యలక్ష్మి తెలిపారు.

December 26, 2024 / 09:52 AM IST

10th విద్యార్థిని సూసైడ్

NTR: బాలిక ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఆర్టీసీ కాలనీకి చెందిన 14 సంవత్సరాల విద్యార్థిని ఓ ప్రైవేట్ స్కూల్లో 10th చదువుతోంది. బుధవారం సెలవు కావడంతో ఇంటి వద్దే ఉంది. తల్లిదండ్రులు బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

December 26, 2024 / 09:51 AM IST

విషాదం నింపిన విహార యాత్ర

ELR: ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి వద్ద ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఘంటశాలకు చెందిన భాను ప్రకాశ్, గౌతమ్, వెంకట సాయి, చల్లపల్లికి చెందిన భార్గవ్, తేజలు విజయవాడ నుంచి కారు అద్దెకు తీసుకుని మారేడుమిల్లి విహార యాత్రకు బయలు దేరారు. నాగులపల్లి వద్ద బుధవారం ముందు వెళుతున్న లారీని కారు ఢీకొట్టింది. 

December 26, 2024 / 09:41 AM IST