ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు (Andhra Pradesh MLC Elections) గురు వారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నుండి పంచుమర్తి అనురాధ (panchumarthi anuradha), వైసీపీ (YCP) నుండి ఏడుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు.
చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. మూడు వన్డేల సిరీస్ ను 1-2 తేడాతో భారత్ కోల్పోయింది. గత నాలుగేళ్లలో స్వదేశంలో టీమిండియా వన్డే సిరీస్ ను కోల్పోవడం ఇదే మొదటిసారి.
ఆంధ్ర ప్రదేశ్ లోని (Andhra Pradesh) విశాఖపట్నం (Vizag) కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం (Building Collapses) కుప్పకూలింది. బుధవారం అర్ధరాత్రి (తెల్లవారితో గురువారం) ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందగా , ఆ తర్వాత రెస్క్యూ సిబ్బంది మరొక మృతదేహాన్ని బయటకు తీసింది.
దోమల విషయంలోను ప్రజలకు పోలీసులు సహకరించిన సంఘటన తాజాగా వెలుగు చూసింది. హాస్పిటల్ లో ప్రసవానంతరం ఓ మహిళకు యూపీ పోలీసులు దోమల నివారణ కాయిల్స్ ను అందించారు.
అంతర్జాతీయ టాప్ 10 కుబేరుల్లో (World’s Top 10 Billionaires list) మన దేశం నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి (Reliance Mukesh Ambani) మాత్రమే చోటు దక్కింది. హూరన్ గ్లోబర్ రిచ్ లిస్ట్ (2023 M3M Hurun Global Rich List) లో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి (Adani Gautam Adani) చోటు దక్కలేదు.
ఉగాది పర్వదినం (ugadi festival) రోజున తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (Telangana IT Minister KT Rama Rao), తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ (BJP Telangana president Bandi Sanjay) మధ్య ట్విట్టర్ యుద్ధం (Twitter fight) సాగింది.
పాంటసీ గేమింగ్ ప్లాట్ ఫామ్ (fantasy gaming platform) డ్రీమ్ 11 (Dream11) ఇటీవల 225 మిలియన్ డాలర్ల ఫండ్ రెయిజింగ్ రౌండ్ ను (fundraising round) ప్రకటించింది. ఇది మన కరెన్సీలో రూ.1650 కోట్లు. ఈ ఫండ్ రెయిజింగ్ ప్రకటన తర్వాత డ్రీమ్ 11 సీఈవో (Dream11 CEO) హర్ష్ జైన్ (Dream11 CEO Harsh Jain) వేతనం 3.3 రెట్లు పెరిగింది.
ఖలిస్థాన్ వేర్పాటువాద సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ పోలీసులకు చిక్కినట్లే చిక్కి, తప్పించుకున్నాడు. అతను తప్పించుకోవడానికి పపల్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి సహకరించినట్లుగా భావిస్తున్నారు.
Cm kcr:సీఎం కేసీఆర్ (Cm kcr) రేపు కరీంనగర్ (karimnagar) జిల్లాలో పర్యటిస్తారు. ఇటీవల కురిసిన వడగళ్ల వానతో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం ధర్మాజిపేట, చిప్పకుర్తి, లక్ష్మీపూర్ గ్రామాల్లో తీవ్ర పంట నష్టం జరిగిన సంగతి తెలిసిందే. అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. ప్రభుత్వ ఆదేశాలతో గ్రామాల్లో పర్యటించి అధికారులు నివేదిక సిద్దం చేసిన సంగతి తెలిసిందే.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నప్రాజెక్ట్ K(Project K) చిత్రంలో చేరినట్లు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్(Santhosh Narayanan) తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ద్వారా ఉగాది పండుగ సందర్భంగా ప్రకటించారు. 2024 జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Kavitha meet cm kcr:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) తన తండ్రి సీఎం కేసీఆర్ను (kcr) ఈ రోజు ప్రగతి భవన్లో (pragathi bhavan) కలిశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిన్న కూడా ఈడీ సుధీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. విచారణ తర్వాత ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు ప్రగతి భవన్ వచ్చి కేసీఆర్ను కలిశారు.
భద్రాచలం సీతా రామచంద్రస్వామి ఆలయంలో ఈరోజు(మార్చి 22న) బ్రహ్మోత్సవాలు(Bhadradri Brahmotsavam) ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. మరోవైపు మార్చి 30న నిర్వహించే శ్రీరామనవమి వేడుకలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisai soundararajan), సీఎం కేసీఆర్(cm kcr)లకు ఆహ్వానం పంపారు.
2030 నాటికి దేశంలో(india) 6జీ సేవలను అందుబాటులోకి తెస్తామని ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) అన్నారు. ఈ సందర్భంగా 6G విజన్ డాక్యుమెంట్ను ప్రధాని మోదీ ఆవిష్కరించిన క్రమంలో పేర్కొన్నారు. ఇది రెండు దశల్లో అమలు చేయబడుతుందని చెప్పారు.