KKD: సామర్లకోటలో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. గురువారం సామర్లకోట మండలం మాధపట్నం సమీపంలో లారీ, బైక్ను ఢీకొంది. సంఘటనలో వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడు వివరాలు తెలియాల్సి ఉంది.
కడప: 95వ బ్యాచ్, 11వ బెటాలియన్లో ఉద్యోగం చేస్తున్న రైల్వేకోడూరు మండలానికి చెందిన రాజయ్య సీఎం క్యాంప్ కార్యాలయానికి 15 రోజుల క్రితం డ్యూటీ నిమిత్తం తాడేపల్లికి వెళ్లారు. రెండు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా గురువారం చికిత్స నిమిత్తం మణిపాల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్టు ధ్రువీకరించారు.
కడప: సిద్దవటం మండలంలోని కడప-చెన్నై జాతీయ రహదారి కనుమలోపల్లి సమీపంలోని మందగిరి శనీశ్వరుని ఆలయం వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోటార్ బైక్ను లారీ ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: సోమశిల జలాశయానికి వరద తగ్గుముఖం పట్టినట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 2,577 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 71.923 టీఎంసీల నీటిమట్టం నమోదయింది. పెన్నా డెల్టాకు 1500 క్యూసెక్కులు, కండలేరుకు 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
TG: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్దచెరువులో భిక్కనూరు ఎస్సై సాయికుమార్ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. అయితే, సాయికుమార్ స్వగ్రామం కొల్చారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్సై మృతిపై గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాయికుమార్ మృతిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
VZM: బొబ్బిలి మున్సిపాల్టీ పరిధి పల్లె వీధిలో బుధవారం పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశామని పట్టణ ఎస్ఐ రమేష్ తెలిపారు. మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా, రహస్యంగా పేకాడుతున్న ఐదుగురిని పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.9,100లను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. నిందితులంతా స్థానిక పల్లె వీధికి చెందిన వారేనని, వారిపై కేసు నమోదు చేశారు.
ELR: గణపవరం మండలం సరిపల్లె గ్రామంలో తాడేపల్లిగూడెం ఎక్సైజ్ సీఐ స్వరాజ్యలక్ష్మి ఆదేశాలతో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద 10 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు సిఐ స్వరాజ్యలక్ష్మి తెలిపారు.
NTR: బాలిక ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఆర్టీసీ కాలనీకి చెందిన 14 సంవత్సరాల విద్యార్థిని ఓ ప్రైవేట్ స్కూల్లో 10th చదువుతోంది. బుధవారం సెలవు కావడంతో ఇంటి వద్దే ఉంది. తల్లిదండ్రులు బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ELR: ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి వద్ద ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఘంటశాలకు చెందిన భాను ప్రకాశ్, గౌతమ్, వెంకట సాయి, చల్లపల్లికి చెందిన భార్గవ్, తేజలు విజయవాడ నుంచి కారు అద్దెకు తీసుకుని మారేడుమిల్లి విహార యాత్రకు బయలు దేరారు. నాగులపల్లి వద్ద బుధవారం ముందు వెళుతున్న లారీని కారు ఢీకొట్టింది.
SKLM: టెక్కలి మండలం స్థానిక జగతిమెట్ట సమీప సర్వీస్ రోడ్లో గురువారం ఉదయం కారు ఢీకొని వ్యక్తికి తలకు బలమైన గాయం అయ్యింది. కారు నడుపుతున్న డ్రైవర్కు ఫిట్స్ రావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడ్డ వారిని హైవే అంబులెన్స్ సిబ్బంది టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ATP: గుత్తి పట్టణంలోని మన్రో సత్రం వద్ద ఈనెల 22న ఆదివారం రాత్రి బైక్ను ఆటో ఢీకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో శ్రీరాములు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.
TG: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో బిక్కనూరు ఎస్సై సాయికుమార్ మృతదేహం లభ్యమైంది. కాగా, నిన్న రాత్రి కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే.
SKLM: రణస్థలం మండలం నెలివాడ గ్రామంలో ఈరోజు పైవంతెన కింద నుంచి పీసీని గ్రామానికి వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని శ్రీకాకుళం-విశాఖపట్నం వెళుతున్న RTC బస్సు ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇజ్జాడ త్రినాధరావు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన 108 అంబులెన్సులో శ్రీకాకులం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
NLR: బోగోలు మండలం కడనూతల శివారులో బుధవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తి అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తి గాయపడ్డాడు. బిట్రగుంటలో క్రిస్మస్ వేడుకలు పూర్తి చేసుకొని కావలికి వెళ్తున్న ఎమ్మెల్యే వెంకట క్రిష్ణారెడ్డి ప్రమాదాన్ని గమనించారు. బాధితుడి వద్దకు వెళ్లి తక్షణమే ఆసుపత్రికి తరలించారు.
NLR: బోగోలు మండలం కడనూతల శివారులో బుధవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తి అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తి గాయపడ్డాడు. బిట్రగుంటలో క్రిస్మస్ వేడుకలు పూర్తి చేసుకొని కావలికి వెళ్తున్న ఎమ్మెల్యే వెంకట క్రిష్ణారెడ్డి ప్రమాదాన్ని గమనించారు. బాధితుడి వద్దకు వెళ్లి తక్షణమే ఆసుపత్రికి తరలించారు.