CTR: కానిస్టేబుల్ భార్య సూసైడ్ చేసుకున్న ఘటన నగరంలో బుధవారం చోటుచేసుకుంది. నగరంలోని టి.చవటపల్లెకు చెందిన హేమంత్ చిత్తూరు ఆర్ముడ్ రిజర్వు విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. ఆయన భార్య దేవి(40) గతంలో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించారు. బుధవారం మూడోసారి పిచోటపల్లిలోని బావిలో దూకి మృతి చెందింది. ఎస్సై రమేశ్ కేసు నమోదు చేశారు.
CTR: కానిస్టేబుల్ భార్య సూసైడ్ చేసుకున్న ఘటన నగరంలో బుధవారం చోటుచేసుకుంది. నగరంలోని టి.చవటపల్లెకు చెందిన హేమంత్ చిత్తూరు ఆర్ముడ్ రిజర్వు విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. ఆయన భార్య దేవి(40) గతంలో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించారు. బుధవారం మూడోసారి పిచోటపల్లిలోని బావిలో దూకి మృతి చెందింది. ఎస్సై రమేశ్ కేసు నమోదు చేశారు.
NLR: మనుబోలు మండల పరిధిలోని కొమ్మలపూడి క్రాస్ రోడ్డు సమీపంలోని వంతెనపై ఆటో బోల్తా పడటంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మనుబోలు కోదండరామ పురానికి చెందిన శాంతి సేవ సంస్థ అధ్యక్షుడు ఆనంద్, ఆర్టీసీ డ్రైవర్ సంపత్ కుమార్ అన్నదమ్ములు. వీరు సొంత ఆటోలో నెల్లూరుకి పని మీద వెళ్లి తిరిగి సొంత ఊరికి వస్తుండగా కొమ్మలపూడి క్రాస్ రోడ్ సమీపంలోని ప్రమాదం జరిగింది.
NLR: మనుబోలు మండల పరిధిలోని కొమ్మలపూడి క్రాస్ రోడ్డు సమీపంలోని వంతెనపై ఆటో బోల్తా పడటంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మనుబోలు కోదండరామ పురానికి చెందిన శాంతి సేవ సంస్థ అధ్యక్షుడు ఆనంద్, ఆర్టీసీ డ్రైవర్ సంపత్ కుమార్ అన్నదమ్ములు. వీరు సొంత ఆటోలో నెల్లూరుకి పని మీద వెళ్లి తిరిగి సొంత ఊరికి వస్తుండగా కొమ్మలపూడి క్రాస్ రోడ్ సమీపంలోని ప్రమాదం జరిగింది.
VSP: ఓల్డ్ డైరీ ఫామ్ ఇందిరాగాంధీనగర్లోని బుధవారం రాత్రి గ్యాస్ లీకైన ఘటనలో గాయపడ్డ వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాజశేఖర్ (11) 45%, సత్యవతి (28) 50%శాతం, టి. చంద్రశేఖర్ (13)26%, పి.వెంకట్రావు (30) 20% శాతం కాలిన గాయాలవ్వగా.. జి.జస్మిత్ అనే బాలుడి తలకు చిన్న గాయమైంది. ఈ ఘటనలో ప్రమాద ధాటికి గోడ ధ్వంసం అయ్యింది.
VSP: ఓల్డ్ డైరీ ఫామ్ ఇందిరాగాంధీనగర్లోని బుధవారం రాత్రి గ్యాస్ లీకైన ఘటనలో గాయపడ్డ వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాజశేఖర్ (11) 45%, సత్యవతి (28) 50%శాతం, టి. చంద్రశేఖర్ (13)26%, పి.వెంకట్రావు (30) 20% శాతం కాలిన గాయాలవ్వగా.. జి.జస్మిత్ అనే బాలుడి తలకు చిన్న గాయమైంది. ఈ ఘటనలో ప్రమాద ధాటికి గోడ ధ్వంసం అయ్యింది.
ASR: అక్రమంగా తరలిస్తున్న ఆరు టేకు దుంగలను అటవీశాఖ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ట్రక్కు ఆటోపై మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న టేకు దుంగలను దేవీపట్నం మండలం కంబలంపాలెం శివార్లలో పట్టుకున్నారు. వాహనంతోపాటు బొల్లెదుపాలెం తరలిస్తునట్లు ఇందుకూరు ఇన్ఛార్జి సెక్షన్ అధికారి హరీష్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.
E.G: రాజమండ్రిలోని గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలో సింహాద్రి ఎక్స్ప్రెస్ రైలు నుంచి జారిపడటంతో గుంటూరుకు చెందిన హేమలతకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె రైలు నుంచి జారీపడడంతో గోదావరి స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాధాకృష్ణ స్థానికులు సాయంతో మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చగా బుధవారం సాయంత్రం మృతి చెందింది.
TG: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మహిళా కానిస్టేబుల్ శృతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కానిస్టేబుల్ శృతితో పాటు మరో ఇద్దరు చెరువులో దూకినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్పీ సింధు శర్మ ఘటనా స్థలానికి చేరుకుని.. ఆత్మహత్య కారణాలపై విచారణ చేస్తున్నారు.
AP: కృష్ణా జిల్లాలో విషాదం జరిగింది. క్రికెట్ ఆడుతుంగా ఓ యువకుడు గుండె పోటుతో మరణించాడు. అంగళూరు నుంచి కౌతారం గ్రామానికి క్రికెట్ ఆడేందుకు వెళ్లిన కొమ్మలపాటి సాయి(26) బౌలింగ్ వేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలాడు. వెంటనే అతన్ని గుడివాడలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
GNTR: నకరికల్లులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చీమలమర్రికి చెందిన తోక కొండయ్య(56) మృతి చెందారు. మృతుడు తన భార్యతో రోడ్డు దాటుతుండగా పిడుగురాళ్ల వైపు వెళుతున్న లారీ వేగంగా వచ్చి ఓ బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు నియంత్రణ తప్పి కొండయ్య, ఆయన భార్యను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కొండయ్య మృతి చెందగా.. ఆయన భార్యకు తీవ్రగాయాలు కావడంతో నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.
SDPT: చేర్యాల పట్టణ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న యువకులను రిమాండ్కు తరలించినట్లు చేర్యాల సీఐ శీను తెలిపారు. బుధవారం చేర్యాల సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చేర్యాల ఎస్ఐ నిరేశు వచ్చిన సమాచారంతో పట్టణ శివారులోని గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి అమ్ముతున్నట్టు తెలిపారు.
NLR: కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామ శివారులో కోడిపందాలు స్థావరాలపై రూరల్ సీఐ రాజేశ్వరరావు అదేశాల తో ఎస్సై తిరుమలరెడ్డి తన సిబ్బందితో కలిసి బుధవారం దాడి చేశారు. కోడిపందాలు ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.5600 నగదు, 3 కోడిపుంజులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తామని రూరల్ పోలీసులు తెలిపారు.