GNTR: అమెరికా నార్త్ కెరోలినాలో నివాసం ఉంటున్న తెనాలికి చెందిన ఎన్నారై కుటుంబంలో ఇద్దరు చిన్నారులు నేడు మృతి చెందారు. తెనాలి అయితానగర్కు చెందిన గడ్డం థామస్ కుమార్తె షారోన్ సధానియేల్కు, అమెరికాకు చెందిన సథానియేల్ లివిస్కాతో 2007లో వివాహం కాగా అమెరికాలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. భారీ వృక్షం కూలి వీరి ఇంటిపై పడటంతో చిన్నారులు మృతి చెందారు.