KMR: పాల్వంచ మండలం పోతారం గ్రామానికి చెందిన ఉప్పల్వాయి నారాయణ(70) ఆదివారం చేపలు పట్టడానికి చెరువుకు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని మృతి చెందారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు మాచారెడ్డి ఎస్సై అనిల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చెరువులు, వాగుల వద్ద చేపలు పట్టడం, లేదా సెల్ఫీలు తీసుకోవడం ప్రమాదకరమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చూచించారు.